Gorantla Madhav: వీడియోను సృష్టించిన వారిపై పరువునష్టం దావా వేస్తా.. వాడొక అరగుండు వెధవ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gorantla Madhav: ఓ మహిళతో నగ్నంగా తాను మాట్లాడిన వీడియో ఫేక్ అని అనంతపురం ఎస్పీనే నిర్ధారించారని.. ఈ వీడియో మార్ఫింగ్ అని తాను ఆనాడే చెప్పానని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వెల్లడించారు. ఫేక్ వీడియోను క్రియేట్ చేసిన వారిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. కొంతమంది దుర్మార్గులు కలిసి చేసిన పని అని గోరంట్ల మాధవ్ ఆరోపించారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టడానికి ఈ కుట్ర చేశారని ఆయన మండిపడ్డారు. బీసీలు ఎదుగుతుంటే చూసి టీడీపీ ఓర్వలేక పోతుందని ఆరోపించారు. ఈ వీడియో బహిర్గతం అయిన దగ్గర నుంచి తానేమీ టెన్షన్ పడలేదని.. కడిగిన ముత్యంలా బయటకు వస్తానని గట్టిగా విశ్వసించానని పేర్కొన్నారు. ఈ వీడియో వచ్చాక తన పని తాను చేసుకున్నట్లు గుర్తుచేశారు. తాను రెగ్యులర్గా పార్లమెంట్కు కూడా హాజరైనట్లు వివరించారు.
Read Also: Ananthapuram SP: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఒరిజినల్ కాదు
Also Read
- NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
- UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
అటు చంద్రబాబును ఉద్దేశించి ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఓ ముండా కొ…కు అని దూషించారు. అయ్యన్నపాత్రుడిని ఓ అరగుండు వెధవ అని దుర్భాషలాడారు. వాడు అబద్ధపు వీడియోను నిజం అని నమ్మించడానికి ప్రయత్నించాడని మండిపడ్డారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో దొరికిపోయాడని.. ఆ కేసు కారణంగా తెలంగాణ నుంచి ఇక్కడకు వచ్చి పడ్డాడని గోరంట్ల మాధవ్ విమర్శలు చేశారు. చంద్రబాబు అంత నీతిమంతుడు అయితే తన ఆడియోను స్వయంగా ఫోరెన్సిక్ అధికారులకు ఎందుకు అప్పగించలేదని సూటిగా ప్రశ్నించారు. పడిపోయిన పార్టీని చంద్రబాబు, లోకేష్ ఎంత లేపడానికి ప్రయత్నించినా ఉపయోగం లేదన్నారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడిని సొంత నియోజకవర్గంలోనే ప్రజలు నిలదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపైనే ఈ వీడియో ఎందుకు సృష్టించారన్న విషయాన్ని వీడియోను అప్లోడ్ చేసిన వారినే అడగాలంటూ జర్నలిస్టులకు ఎంపీ గోరంట్ల మాధవ్ హితబోధ చేశారు. చంద్రబాబు, లోకేష్, కొందరు మీడియా ప్రతినిధులు తనపై కుట్ర చేశారని ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన వీడియో ఫేక్ అని నిర్ధారణ కావడంతో చంద్రబాబు ముక్కు నేలకు రాసి, తనకు క్షమాపణ చెప్పాలన్నారు. నీచపు రాజకీయాలకు చంద్రబాబు ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టాలని గోరంట్ల మాధవ్ హెచ్చరించారు. చంద్రబాబు, టీడీపీ నేతలు తన బొచ్చు కూడా పీకలేరని వ్యాఖ్యానించారు.
https://www.youtube.com/watch?v=J5sYTsBVWhs
తాజావార్తలు
-
Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
-
Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
-
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..