Pinipe Viswarup: మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు అరెస్ట్!
- మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు అరెస్ట్
- మధురైలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
- శ్రీకాంత్ను కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pinipe Srikanth Arrest: వైసీపీ నేత, మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. దళిత యువకుడు, వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో శ్రీకాంత్ను తమిళనాడులోని మధురైలో ఈరోజు ఉదయం అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వడ్డి ధర్మేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో శ్రీకాంత్ పేరు బయటికి రావడంతో.. తాజాగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. నేడు శ్రీకాంత్ను కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లిలో రెండేళ్ల క్రితం జరిగిన దళిత యువకుడు దుర్గాప్రసాద్ హత్య కేసులో పినిపె శ్రీకాంత్ను పోలీసులు ప్రధాన నిందితుడిగా గుర్తించారు. కోనసీమ అల్లర్ల సమయంలో అయినవిల్లికి చెందిన వాలంటీరు దుర్గాప్రసాద్ను 2022 జూన్ 6న హత్య చేయించినట్లు నిర్ధరణకు వచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఉప్పలగుప్తం మండలానికి చెందిన నిందితుడు, మృతుడికి స్నేహితుడైన ధర్మేశ్ను పోలీసులు విచారించారు. అతడిని అక్టోబర్ 18న అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ఈ కేసులో మరో నలుగురు నిందితులతో పాటు శ్రీకాంత్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే మదురైలో శ్రీకాంత్ను అరెస్ట్ చేశారు.
Also Read
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
Also Read: MP Avinash Reddy: ఏపీలో శాంతి భద్రతలు ఉన్నాయా?: అవినాష్ రెడ్డి
శ్రీకాంత్ కుటుంబసభ్యులకు అసభ్యకర మెసేజ్లు పంపిన కారణంగానే అతడిని హత్య చేయించినట్లు ధర్మేష్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. దుర్గాప్రసాద్ను హత్య చేయించేందుకు ధర్మేశ్ సహా మరో నలుగురికి శ్రీకాంత్ బాధ్యత అప్పగించినట్లు విచారణలో తెలిసింది. దుర్గాప్రసాద్ను ధర్మేశ్ కోటిపల్లి రేవు వద్దకు తీసుకెళ్లగా.. మరో ముగ్గురు దుర్గాప్రసాద్ మెడకు తాడు బిగించి హత్య చేశారని చెప్పినట్లు సమాచారం. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు తొలుత మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. అయితే కొన్నాళ్లకు మృతదేహం లభించడం, పోస్టుమార్టంలో హత్యగా నిర్ధరణ అయింది.
తాజావార్తలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!