Ravindranath Reddy: కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు లేదు.. అభివృద్ధి అంతకంటే లేదు!
- కూటమి ప్రభుత్వంపై రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం
- పంట నష్టపోయినా దిక్కు లేదు
- అభివృద్ధి అంతకంటే లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అయ్యిందని.. ఈ కాలంలో రాష్ట్రంలో ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని, అభివృద్ధి అంతకంటే లేదని కడప వైసీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని, పాలన అనేదే లేకుండా పోయిందన్నారు. వైఎస్ జగన్ గారి హయాంలో వర్షాలకు పంట నష్టం జరిగితే అదే సీజన్లో తమ ప్రభుత్వం పరిహారం అందించిందని, ఇప్పుడు పంట నష్టపోయినా దిక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మాటలు చెప్తున్నారు తప్ప వాస్తవ రూపం లేదని రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు.
రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ… ‘కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు అయ్యింది. ఈ కాలంలో రాష్ట్రంలో ప్రజలకు చేసిన మేలు లేదు, అభివృద్ధి అంతకంటే లేదు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు, పాలన అనేదే లేకుండా పోయింది. వైఎస్ జగన్ గారి హయాంలో వర్షాలకు పంట నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం అందించాం. ఇప్పుడు పంట నష్టపోయినా దిక్కు లేదు. ఎరువులు, విత్తనాలు ఇచ్చే దిక్కు లేదు. ఈ తుఫానుకు వరి తీవ్రంగా నష్టపోయింది. అయినా ఈ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేదు. వరి కొనుగోలు లేదు, ఇక రంగు మారిన ధాన్యం కొనుగోలుకు దిక్కే లేదు. సీఎం చంద్రబాబు నుంచి అందరూ మాటలు చెప్తున్నారు తప్ప వాస్తవ రూపం లేదు. రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ అధికారులే ఉండటం లేదు’ అని అన్నారు.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
- Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
- Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
‘కాకినాడ పోర్టులో పీడీఎస్ బియ్యం అంటూ చంద్రశేఖర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ డైవర్షన్ చేస్తున్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుపై గ్యారెంటీ కాదు.. వీర బాదుడుకు గ్యారెంటీ. బియ్యం నుంచి కూరగాయల వరకూ ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గతంలో బాబు బాదుడే బాదుడు అన్నాడు, ఇప్పుడు వీర బాదుడు బాదుతున్నాడు. ప్రజలంతా ఇప్పుడు ఇదేం ఖర్మరా బాబూ అంటున్నారు. ప్రతి మీటింగులో విద్యుత్ చార్జీలు పెంచేది లేదు అని ఊదరగొట్టాడు. ఈ ఐదారు నెలల్లోనే రెండు సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. ఇప్పుడు కరెంట్ బిల్లు పట్టుకుంటే.. షాక్ కొట్టే పరిస్థితి వచ్చింది. స్థానిక కూటమి నేతలు కూడా ఎక్కడికక్కడ లోకల్ టాక్స్ తో వీర బాదుడు మొదలుపెట్టారు. బెల్టు పెడితే మీకు బెల్టు తీసేస్తా అన్నాడు. హోమ్ మినిస్టర్ నియోజకవర్గంలోనే బెల్టు షాపులను వేలం వేసుకున్నారు. 90 శాతం మద్యం షాపులన్నీ వారే కైవసం చేసుకున్నారు. వీళ్లంతా ప్రజల డబ్బు ఎలా దోచుకుంటుందో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది. టీడీపీ ప్రభుత్వం వచ్చింది దోచుకోవడానికే. చేసేదంతా వారు చేసి ఇదంతా జగన్ గారి వల్లే అంటూ పచ్చ పత్రికల్లో రాతలు రాయిస్తున్నాడు. ఈ ఫెయింజల్ తూఫాన్ కూడా జగన్ వల్లే వచ్చింది అన్నా అంటారు. మరోవైపు బాబు 30 ఏళ్లు అధికారంలో ఉండాలని పవన్ కళ్యాణ్ అంటాడు. సీజ్ చేసిన షిప్ నాకు చూపించలేదు అంటూ పవన్ రాద్ధాంతం చేస్తున్నారు. అసలు పవన్ అధికారంలో ఉండి మాట్లాడుతున్నారా?, డ్రామా చేస్తున్నారా?. బూడిద డబ్బులు పంచుకునేందుకు చంద్రబాబు నేరుగా పంచాయతీలు చేయడం సిగ్గుచేటు. ఇలాంటి పరిపాలనను ప్రజలు ఊహించి ఉండరు. రోడ్లపై టోల్ టాక్స్ అంటున్నాడు, ప్రజలతో వ్యాపారం చేస్తావా?. అందుకే ప్రజలు ఇదేం ఖర్మరా బాబూ అనుకుంటున్నారు. ఫ్రీ బస్సు ఆగస్టులో ప్రారంభం అన్నారు దీపావళి పోయింది.. ఇప్పుడు నేరుగా బంగాళాఖాతంలోకి వెళ్ళినట్లుంది’ అని రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు.
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
-
Drishyam 4: జార్జ్కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!