Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ycp Leader Ravindranath Reddy Slams Ap Govt

Ravindranath Reddy: కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు లేదు.. అభివృద్ధి అంతకంటే లేదు!

Published Date :December 2, 2024 , 12:18 pm
By Sampath Kumar
  • కూటమి ప్రభుత్వంపై రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం
  • పంట నష్టపోయినా దిక్కు లేదు
  • అభివృద్ధి అంతకంటే లేదు
Ravindranath Reddy: కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు లేదు.. అభివృద్ధి అంతకంటే లేదు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అయ్యిందని.. ఈ కాలంలో రాష్ట్రంలో ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని, అభివృద్ధి అంతకంటే లేదని కడప వైసీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని, పాలన అనేదే లేకుండా పోయిందన్నారు. వైఎస్ జగన్ గారి హయాంలో వర్షాలకు పంట నష్టం జరిగితే అదే సీజన్లో తమ ప్రభుత్వం పరిహారం అందించిందని, ఇప్పుడు పంట నష్టపోయినా దిక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మాటలు చెప్తున్నారు తప్ప వాస్తవ రూపం లేదని రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు.

రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ… ‘కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు అయ్యింది. ఈ కాలంలో రాష్ట్రంలో ప్రజలకు చేసిన మేలు లేదు, అభివృద్ధి అంతకంటే లేదు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు, పాలన అనేదే లేకుండా పోయింది. వైఎస్ జగన్ గారి హయాంలో వర్షాలకు పంట నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం అందించాం. ఇప్పుడు పంట నష్టపోయినా దిక్కు లేదు. ఎరువులు, విత్తనాలు ఇచ్చే దిక్కు లేదు. ఈ తుఫానుకు వరి తీవ్రంగా నష్టపోయింది. అయినా ఈ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేదు. వరి కొనుగోలు లేదు, ఇక రంగు మారిన ధాన్యం కొనుగోలుకు దిక్కే లేదు. సీఎం చంద్రబాబు నుంచి అందరూ మాటలు చెప్తున్నారు తప్ప వాస్తవ రూపం లేదు. రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ అధికారులే ఉండటం లేదు’ అని అన్నారు.

‘కాకినాడ పోర్టులో పీడీఎస్ బియ్యం అంటూ చంద్రశేఖర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ డైవర్షన్ చేస్తున్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుపై గ్యారెంటీ కాదు.. వీర బాదుడుకు గ్యారెంటీ. బియ్యం నుంచి కూరగాయల వరకూ ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గతంలో బాబు బాదుడే బాదుడు అన్నాడు, ఇప్పుడు వీర బాదుడు బాదుతున్నాడు. ప్రజలంతా ఇప్పుడు ఇదేం ఖర్మరా బాబూ అంటున్నారు. ప్రతి మీటింగులో విద్యుత్ చార్జీలు పెంచేది లేదు అని ఊదరగొట్టాడు. ఈ ఐదారు నెలల్లోనే రెండు సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. ఇప్పుడు కరెంట్ బిల్లు పట్టుకుంటే.. షాక్ కొట్టే పరిస్థితి వచ్చింది. స్థానిక కూటమి నేతలు కూడా ఎక్కడికక్కడ లోకల్ టాక్స్ తో వీర బాదుడు మొదలుపెట్టారు. బెల్టు పెడితే మీకు బెల్టు తీసేస్తా అన్నాడు. హోమ్ మినిస్టర్ నియోజకవర్గంలోనే బెల్టు షాపులను వేలం వేసుకున్నారు. 90 శాతం మద్యం షాపులన్నీ వారే కైవసం చేసుకున్నారు. వీళ్లంతా ప్రజల డబ్బు ఎలా దోచుకుంటుందో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది. టీడీపీ ప్రభుత్వం వచ్చింది దోచుకోవడానికే. చేసేదంతా వారు చేసి ఇదంతా జగన్ గారి వల్లే అంటూ పచ్చ పత్రికల్లో రాతలు రాయిస్తున్నాడు. ఈ ఫెయింజల్ తూఫాన్ కూడా జగన్ వల్లే వచ్చింది అన్నా అంటారు. మరోవైపు బాబు 30 ఏళ్లు అధికారంలో ఉండాలని పవన్ కళ్యాణ్ అంటాడు. సీజ్ చేసిన షిప్ నాకు చూపించలేదు అంటూ పవన్ రాద్ధాంతం చేస్తున్నారు. అసలు పవన్ అధికారంలో ఉండి మాట్లాడుతున్నారా?, డ్రామా చేస్తున్నారా?. బూడిద డబ్బులు పంచుకునేందుకు చంద్రబాబు నేరుగా పంచాయతీలు చేయడం సిగ్గుచేటు. ఇలాంటి పరిపాలనను ప్రజలు ఊహించి ఉండరు. రోడ్లపై టోల్ టాక్స్ అంటున్నాడు, ప్రజలతో వ్యాపారం చేస్తావా?. అందుకే ప్రజలు ఇదేం ఖర్మరా బాబూ అనుకుంటున్నారు. ఫ్రీ బస్సు ఆగస్టులో ప్రారంభం అన్నారు దీపావళి పోయింది.. ఇప్పుడు నేరుగా బంగాళాఖాతంలోకి వెళ్ళినట్లుంది’ అని రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • ap news
  • Chandrababu Naidu
  • pawan kalyan
  • Ravindranath Reddy

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions