Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ycp Leader Botsa Satyanarayana Fires On Ap Govt Over Increase Electricity Charges

Botsa Satyanarayana: విద్యుత్ చార్జీలు పెంచడంపై ప్రశ్నిస్తే.. ఎదురు దాడి చేస్తున్నారు!

Published Date :December 2, 2024 , 1:08 pm
By Sampath Kumar
  • విద్యుత్ చార్జీలు పెంచడంపై బొత్స ఆగ్రహం
  • ఆవు కథలాగా జగన్ చుట్టూ తిప్పుతున్నారు
  • సబ్సిడీ ఎందుకు ఇవ్వలేకపోతోంది
Botsa Satyanarayana: విద్యుత్ చార్జీలు పెంచడంపై ప్రశ్నిస్తే.. ఎదురు దాడి చేస్తున్నారు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు అడ్డగోలుగా పెంచడం మీద ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వం నాయకులు ఎదురు దాడి చేస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ధరలు నియంత్రించమని ప్రశ్నిస్తే.. ఆవు కథలాగా మాజీ సీఎం వైఎస్ జగన్ చుట్టూ తిప్పుతారన్నారు. ఒక్కో యూనిట్‌కి రెండు రూపాయలు చొప్పున పెరిగితే సామాన్యుడికి పెను భారంగా మారుతుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రం 70 వేల కోట్లు అప్పు చేసిందని, దాంట్లో నుంచి సబ్సిడీ ఎందుకు ఇవ్వలేకపోతోంది అని బొత్స ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ ఆరు నెలల కాలానికి 18 వేల కోట్లు సంక్షేమ పథకాలు విడుదల చేసే వాళ్లమని మాజీ మంత్రి చెప్పుకొచ్చారు.

‘ట్రూ అప్ చార్జీలను ప్రభుత్వం సబ్సిడీగా ప్రకటించి ప్రజలపై భారం పడకుండా చూడాలి. విద్యుత్ చార్జీలు సుమారు ఆరు వేల 72 కోట్లు భారం మోపింది. వచ్చే ఫిబ్రవరిలో పెరిగే ట్రూ అప్ చార్జీలతో కలిపితే 15 వేల 475 కోట్లకు పైగా వసూళ్లకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఒక్కో యూనిట్‌కి రెండు రూపాయలు చొప్పున పెరిగితే.. ఇది సామాన్యుడిపై భారంగా మారుతుంది. విద్యుత్ చార్జీలు అడ్డగోలుగా పెంచడం మీద ప్రశ్నిస్తే ఎదురు దాడి చేస్తున్నారు. ధరలు నియంత్రించమని ప్రశ్నిస్తే ఆవు కథలాగా వైఎస్ జగన్ చుట్టూ తిప్పుతారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 70 వేల కోట్లు అప్పు చేసింది. దాంట్లో నుంచి సబ్సిడీ ఎందుకు ఇవ్వలేక పోతోంది. గతంలో మేం ఇవ్వగలిగినప్పుడు మీకెందుకు సాధ్యం కాదు. 70 వేల కోట్లు అప్పులు తెచ్చి పెన్షన్, గ్యాస్ తప్ప ఇతర సంక్షేమాలు ఏవీ చేయడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చివుంటే ఈ ఆరు నెలల కాలానికి 18 వేల కోట్లు సంక్షేమ పథకాలు విడుదల చేసే వాళ్లం’ అని బొత్స సత్యనారాయణ అన్నారు.

Also Read

  • LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
  • Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
  • Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
  • MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన 'ర్యాన్‌ రికెల్టన్‌'.. SRH ముందు భారీ టార్గెట్.!

‘ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులకు ప్రజలకు లెక్క చెప్పాలి. అప్పులు తెచ్చిన డబ్బుతో స్నోలు, సోకులకు ఖర్చు చేశారా?. ప్రతిపక్షంగా, ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. జీఎస్టీ 10శాతం తగ్గడం చూస్తుంటే ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుందో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ప్రభుత్వానికి ప్రణాళిక, ఆలోచన, యంత్రాంగం మీద పట్టు కనిపించడం లేదు. వాటాల కోసం ఎమ్మేల్యేలు కొట్టుకోవడం, దానికి ముఖ్యమంత్రి పంచాయితీ చేయడం ఏంటి?. బెల్ట్ షాపులకు బహిరంగంగా వేలం వేయడం ఏంటి?, వినడానికే సిగ్గు చేటు. విజయనగరం జిల్లాలో బెల్ట్ షాప్ కు 50 లక్షలకు వేలం వేశారంటే.. ఈ ప్రభుత్వం మీద ఎవరికీ లెక్క లేదు. బెల్ట్ షాపులపై ఇప్పటి వరకు ఒక్కరి మీదైనా చర్య తీసుకున్నారా?. ట్రూ అప్ చార్జీలు పెంచిన తర్వాత బిల్లులు వస్తే వినియోగదారులకు హార్ట్ ఎటాక్ లు వస్తాయి’ అని బొత్స మండిపడ్డారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • ap news
  • botsa satyanarayana
  • electricity charges
  • ycp

తాజావార్తలు

  • LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!

  • Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?

  • Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..

  • Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!

  • MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్‌ రికెల్టన్‌’.. SRH ముందు భారీ టార్గెట్.!

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions