Botsa Satyanarayana: విద్యుత్ చార్జీలు పెంచడంపై ప్రశ్నిస్తే.. ఎదురు దాడి చేస్తున్నారు!
- విద్యుత్ చార్జీలు పెంచడంపై బొత్స ఆగ్రహం
- ఆవు కథలాగా జగన్ చుట్టూ తిప్పుతున్నారు
- సబ్సిడీ ఎందుకు ఇవ్వలేకపోతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు అడ్డగోలుగా పెంచడం మీద ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వం నాయకులు ఎదురు దాడి చేస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ధరలు నియంత్రించమని ప్రశ్నిస్తే.. ఆవు కథలాగా మాజీ సీఎం వైఎస్ జగన్ చుట్టూ తిప్పుతారన్నారు. ఒక్కో యూనిట్కి రెండు రూపాయలు చొప్పున పెరిగితే సామాన్యుడికి పెను భారంగా మారుతుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రం 70 వేల కోట్లు అప్పు చేసిందని, దాంట్లో నుంచి సబ్సిడీ ఎందుకు ఇవ్వలేకపోతోంది అని బొత్స ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ ఆరు నెలల కాలానికి 18 వేల కోట్లు సంక్షేమ పథకాలు విడుదల చేసే వాళ్లమని మాజీ మంత్రి చెప్పుకొచ్చారు.
‘ట్రూ అప్ చార్జీలను ప్రభుత్వం సబ్సిడీగా ప్రకటించి ప్రజలపై భారం పడకుండా చూడాలి. విద్యుత్ చార్జీలు సుమారు ఆరు వేల 72 కోట్లు భారం మోపింది. వచ్చే ఫిబ్రవరిలో పెరిగే ట్రూ అప్ చార్జీలతో కలిపితే 15 వేల 475 కోట్లకు పైగా వసూళ్లకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఒక్కో యూనిట్కి రెండు రూపాయలు చొప్పున పెరిగితే.. ఇది సామాన్యుడిపై భారంగా మారుతుంది. విద్యుత్ చార్జీలు అడ్డగోలుగా పెంచడం మీద ప్రశ్నిస్తే ఎదురు దాడి చేస్తున్నారు. ధరలు నియంత్రించమని ప్రశ్నిస్తే ఆవు కథలాగా వైఎస్ జగన్ చుట్టూ తిప్పుతారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 70 వేల కోట్లు అప్పు చేసింది. దాంట్లో నుంచి సబ్సిడీ ఎందుకు ఇవ్వలేక పోతోంది. గతంలో మేం ఇవ్వగలిగినప్పుడు మీకెందుకు సాధ్యం కాదు. 70 వేల కోట్లు అప్పులు తెచ్చి పెన్షన్, గ్యాస్ తప్ప ఇతర సంక్షేమాలు ఏవీ చేయడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చివుంటే ఈ ఆరు నెలల కాలానికి 18 వేల కోట్లు సంక్షేమ పథకాలు విడుదల చేసే వాళ్లం’ అని బొత్స సత్యనారాయణ అన్నారు.
Also Read
- Gulab Lassi Recipe: హీట్కు చెక్ పెట్టే షాహీ గులాబ్ లస్సీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి..!
- భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
- Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
- Broiler Chicken Facts: బ్రాయిలర్ కోళ్లకు నిజంగా హార్మోన్లు ఇస్తారా..? చికెన్పై ఉన్న అపోహల వెనుక అసలు నిజం ఇదే..
‘ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులకు ప్రజలకు లెక్క చెప్పాలి. అప్పులు తెచ్చిన డబ్బుతో స్నోలు, సోకులకు ఖర్చు చేశారా?. ప్రతిపక్షంగా, ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. జీఎస్టీ 10శాతం తగ్గడం చూస్తుంటే ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుందో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ప్రభుత్వానికి ప్రణాళిక, ఆలోచన, యంత్రాంగం మీద పట్టు కనిపించడం లేదు. వాటాల కోసం ఎమ్మేల్యేలు కొట్టుకోవడం, దానికి ముఖ్యమంత్రి పంచాయితీ చేయడం ఏంటి?. బెల్ట్ షాపులకు బహిరంగంగా వేలం వేయడం ఏంటి?, వినడానికే సిగ్గు చేటు. విజయనగరం జిల్లాలో బెల్ట్ షాప్ కు 50 లక్షలకు వేలం వేశారంటే.. ఈ ప్రభుత్వం మీద ఎవరికీ లెక్క లేదు. బెల్ట్ షాపులపై ఇప్పటి వరకు ఒక్కరి మీదైనా చర్య తీసుకున్నారా?. ట్రూ అప్ చార్జీలు పెంచిన తర్వాత బిల్లులు వస్తే వినియోగదారులకు హార్ట్ ఎటాక్ లు వస్తాయి’ అని బొత్స మండిపడ్డారు.
తాజావార్తలు
-
Gulab Lassi Recipe: హీట్కు చెక్ పెట్టే షాహీ గులాబ్ లస్సీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి..!
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
Anil Ravipudi: ‘పెద్ది’ ట్రైలర్ పై..అనిల్ రావిపూడి భారీ ప్రశంసలు!
-
PV Sindhu: క్రీడా రంగంలో ఏఐ విప్లవం.. అథ్లెట్ల కోసం ‘టెంపుల్’ స్మార్ట్ సెన్సార్ ప్యాచ్.. ప్రత్యేక ఆకర్షణగా పీవీ సింధు!
-
Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?