NTV Telugu Site icon

Yaatra 2 : మరో ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన ‘యాత్ర 2’..

Yaatra 2

Yaatra 2

Yaatra 2 : కోలీవుడ్ స్టార్ హీరో జీవా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ “యాత్ర 2 “.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజజీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాను దర్శకుడు మహి వీ రాఘవ్ తెరక్కించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల హీట్ పెంచింది. 2019లో వచ్చి సూపర్ హిట్ అయిన “యాత్ర”సినిమాకు సీక్వెల్‍గా డైరెక్టర్ మహి.వి.రాఘవ్ తెరకెక్కించారు.ఈ చిత్రం ఏప్రిల్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.

Read Also :NTR 31 : ప్రశాంత్ నీల్ కు బర్త్ డే విషెస్ తెలిపిన ‘ఎన్టీఆర్ 31’ టీం..

అయితే తాజాగా జూన్ ౩ న ఈ సినిమా మరో ఓటిటి ప్లాట్‍ఫామ్‍లో కి అందుబాటులోకి వచ్చింది.యాత్ర 2 సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఎలాంటి సమాచారం లేకుండా సడెన్‍గా ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. “మేం వున్నాం. మేం విన్నాం. యాత్ర 2 మీ కోసం తీసుకొస్తున్నాం!” అని ఆహా ట్వీట్ చేసింది .యాత్ర 2ను జూన్ 3 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు తెలిపింది.దీంతో యాత్ర 2 మూవీ ప్రస్తుతం రెండో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍ కు అందుబాటులో వుంది.