Yashwant Sinha: ఇది కేవలం రాజకీయ పోరాటమే కాదు.. ప్రభుత్వ సంస్థలపై పోరాడుతున్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yashwant Sinha: రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ ప్రారంభం కాగానే, ప్రతిపక్షాల అధ్యక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హా, దేశ తదుపరి రాష్ట్రపతిగా రేసులో తనకు ఓటు వేయాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. భారత రాష్ట్రపతి ఎన్నిక చాలా ముఖ్యమైనదని యశ్వంత్ సిన్హా అన్నారు. ఈ ఎన్నికలు దేశ ప్రజాస్వామ్యానికి బాటలు వేస్తాయని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు తనకు అనుకూలంగా ఓటు వేస్తారని ఆశిస్తున్నానంటూ ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంటేరియన్లు, శాసనసభ్యులు తమ హృదయవాణిని వినాలని.. ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది రహస్య ఓటింగ్ అని, ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ తమ విచక్షణాధికారాన్ని ఉపయోగించుకుని తనను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అధ్యక్ష అభ్యర్థి ద్రౌపది ముర్ముపై సిన్హా పోటీ చేస్తున్నారు. జూలై 21న ఓట్ల లెక్కింపు, జూలై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తాను కేవలం రాజకీయ పోరాటమే కాదు, ప్రభుత్వ సంస్థలపై కూడా పోరాడుతున్నానన్నారు. అవి చాలా శక్తివంతంగా మారాయి. డబ్బుతో కూడిన ఆట కూడా ఉందని ఆయన ఆరోపించారు. ఆదివారం నాడు యశ్వంత్ సిన్హా ట్విటర్లో ఎమ్మెల్యేలు, ఎంపీలందరి మద్దతును కోరుతూ ఓ ప్రకటనను పోస్ట్ చేశారు. తాను భారత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నానన్నారు. “మన రాజ్యాంగంలోని పూర్వ స్తంభమైన లౌకికవాదాన్ని రక్షించడం కోసం నేను నిలబడతాను. నేను ఏకాభిప్రాయం, సహకారంతో కూడిన రాజకీయాలను ప్రోత్సహించడం కోసం నిలబడతాను. నా ప్రత్యర్థి అభ్యర్థికి సంఘర్షణ, ఘర్షణ రాజకీయాలు చేసే పార్టీ మద్దతు ఇస్తుంది” ఓ ప్రకటనలో అన్నారు.
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
- Vladimir Putin: "భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
Presidential Poll 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎంలు ఎందుకు వాడరు?
రాష్ట్రపతి ఎన్నిక ఇద్దరు అభ్యర్థుల గురించి కాదని, ఇది రెండు సిద్ధాంతాల మధ్య పోటీ అని సిన్హా పునరుద్ఘాటించారు. బ్యూరోక్రాట్ నుండి రాజకీయవేత్తగా మారిన యశ్వంత్ సిన్హా, అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాలు, ఆర్థిక మంత్రి వంటి ముఖ్యమైన శాఖలను నిర్వహించారు.
తాజావార్తలు
-
India Forex Reserves: రూపాయి స్థిరత్వానికి బలం.. పెరిగిన విదేశీ మారక నిల్వలు.. 938 మిలియన్ డాలర్ల వృద్ధి
-
Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
-
Peddi: జాన్వీ కపూర్ పాత్రపై డైరెక్టర్ బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
-
Vladimir Putin: “భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం”.. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!