Yashwant Sinha: ఇది కేవలం రాజకీయ పోరాటమే కాదు.. ప్రభుత్వ సంస్థలపై పోరాడుతున్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yashwant Sinha: రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ ప్రారంభం కాగానే, ప్రతిపక్షాల అధ్యక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హా, దేశ తదుపరి రాష్ట్రపతిగా రేసులో తనకు ఓటు వేయాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. భారత రాష్ట్రపతి ఎన్నిక చాలా ముఖ్యమైనదని యశ్వంత్ సిన్హా అన్నారు. ఈ ఎన్నికలు దేశ ప్రజాస్వామ్యానికి బాటలు వేస్తాయని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు తనకు అనుకూలంగా ఓటు వేస్తారని ఆశిస్తున్నానంటూ ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంటేరియన్లు, శాసనసభ్యులు తమ హృదయవాణిని వినాలని.. ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది రహస్య ఓటింగ్ అని, ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ తమ విచక్షణాధికారాన్ని ఉపయోగించుకుని తనను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అధ్యక్ష అభ్యర్థి ద్రౌపది ముర్ముపై సిన్హా పోటీ చేస్తున్నారు. జూలై 21న ఓట్ల లెక్కింపు, జూలై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తాను కేవలం రాజకీయ పోరాటమే కాదు, ప్రభుత్వ సంస్థలపై కూడా పోరాడుతున్నానన్నారు. అవి చాలా శక్తివంతంగా మారాయి. డబ్బుతో కూడిన ఆట కూడా ఉందని ఆయన ఆరోపించారు. ఆదివారం నాడు యశ్వంత్ సిన్హా ట్విటర్లో ఎమ్మెల్యేలు, ఎంపీలందరి మద్దతును కోరుతూ ఓ ప్రకటనను పోస్ట్ చేశారు. తాను భారత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నానన్నారు. “మన రాజ్యాంగంలోని పూర్వ స్తంభమైన లౌకికవాదాన్ని రక్షించడం కోసం నేను నిలబడతాను. నేను ఏకాభిప్రాయం, సహకారంతో కూడిన రాజకీయాలను ప్రోత్సహించడం కోసం నిలబడతాను. నా ప్రత్యర్థి అభ్యర్థికి సంఘర్షణ, ఘర్షణ రాజకీయాలు చేసే పార్టీ మద్దతు ఇస్తుంది” ఓ ప్రకటనలో అన్నారు.
Also Read
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
Presidential Poll 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎంలు ఎందుకు వాడరు?
రాష్ట్రపతి ఎన్నిక ఇద్దరు అభ్యర్థుల గురించి కాదని, ఇది రెండు సిద్ధాంతాల మధ్య పోటీ అని సిన్హా పునరుద్ఘాటించారు. బ్యూరోక్రాట్ నుండి రాజకీయవేత్తగా మారిన యశ్వంత్ సిన్హా, అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాలు, ఆర్థిక మంత్రి వంటి ముఖ్యమైన శాఖలను నిర్వహించారు.
తాజావార్తలు
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్లీలా మహాసంఘ్’ డిమాండ్
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!