Yashwant Sinha: ఇది కేవలం రాజకీయ పోరాటమే కాదు.. ప్రభుత్వ సంస్థలపై పోరాడుతున్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yashwant Sinha: రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ ప్రారంభం కాగానే, ప్రతిపక్షాల అధ్యక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హా, దేశ తదుపరి రాష్ట్రపతిగా రేసులో తనకు ఓటు వేయాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. భారత రాష్ట్రపతి ఎన్నిక చాలా ముఖ్యమైనదని యశ్వంత్ సిన్హా అన్నారు. ఈ ఎన్నికలు దేశ ప్రజాస్వామ్యానికి బాటలు వేస్తాయని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు తనకు అనుకూలంగా ఓటు వేస్తారని ఆశిస్తున్నానంటూ ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంటేరియన్లు, శాసనసభ్యులు తమ హృదయవాణిని వినాలని.. ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది రహస్య ఓటింగ్ అని, ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ తమ విచక్షణాధికారాన్ని ఉపయోగించుకుని తనను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అధ్యక్ష అభ్యర్థి ద్రౌపది ముర్ముపై సిన్హా పోటీ చేస్తున్నారు. జూలై 21న ఓట్ల లెక్కింపు, జూలై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తాను కేవలం రాజకీయ పోరాటమే కాదు, ప్రభుత్వ సంస్థలపై కూడా పోరాడుతున్నానన్నారు. అవి చాలా శక్తివంతంగా మారాయి. డబ్బుతో కూడిన ఆట కూడా ఉందని ఆయన ఆరోపించారు. ఆదివారం నాడు యశ్వంత్ సిన్హా ట్విటర్లో ఎమ్మెల్యేలు, ఎంపీలందరి మద్దతును కోరుతూ ఓ ప్రకటనను పోస్ట్ చేశారు. తాను భారత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నానన్నారు. “మన రాజ్యాంగంలోని పూర్వ స్తంభమైన లౌకికవాదాన్ని రక్షించడం కోసం నేను నిలబడతాను. నేను ఏకాభిప్రాయం, సహకారంతో కూడిన రాజకీయాలను ప్రోత్సహించడం కోసం నిలబడతాను. నా ప్రత్యర్థి అభ్యర్థికి సంఘర్షణ, ఘర్షణ రాజకీయాలు చేసే పార్టీ మద్దతు ఇస్తుంది” ఓ ప్రకటనలో అన్నారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
Presidential Poll 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎంలు ఎందుకు వాడరు?
రాష్ట్రపతి ఎన్నిక ఇద్దరు అభ్యర్థుల గురించి కాదని, ఇది రెండు సిద్ధాంతాల మధ్య పోటీ అని సిన్హా పునరుద్ఘాటించారు. బ్యూరోక్రాట్ నుండి రాజకీయవేత్తగా మారిన యశ్వంత్ సిన్హా, అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాలు, ఆర్థిక మంత్రి వంటి ముఖ్యమైన శాఖలను నిర్వహించారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..