Yashwant Sinha: ఇది కేవలం రాజకీయ పోరాటమే కాదు.. ప్రభుత్వ సంస్థలపై పోరాడుతున్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yashwant Sinha: రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ ప్రారంభం కాగానే, ప్రతిపక్షాల అధ్యక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హా, దేశ తదుపరి రాష్ట్రపతిగా రేసులో తనకు ఓటు వేయాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. భారత రాష్ట్రపతి ఎన్నిక చాలా ముఖ్యమైనదని యశ్వంత్ సిన్హా అన్నారు. ఈ ఎన్నికలు దేశ ప్రజాస్వామ్యానికి బాటలు వేస్తాయని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు తనకు అనుకూలంగా ఓటు వేస్తారని ఆశిస్తున్నానంటూ ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంటేరియన్లు, శాసనసభ్యులు తమ హృదయవాణిని వినాలని.. ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది రహస్య ఓటింగ్ అని, ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ తమ విచక్షణాధికారాన్ని ఉపయోగించుకుని తనను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అధ్యక్ష అభ్యర్థి ద్రౌపది ముర్ముపై సిన్హా పోటీ చేస్తున్నారు. జూలై 21న ఓట్ల లెక్కింపు, జూలై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తాను కేవలం రాజకీయ పోరాటమే కాదు, ప్రభుత్వ సంస్థలపై కూడా పోరాడుతున్నానన్నారు. అవి చాలా శక్తివంతంగా మారాయి. డబ్బుతో కూడిన ఆట కూడా ఉందని ఆయన ఆరోపించారు. ఆదివారం నాడు యశ్వంత్ సిన్హా ట్విటర్లో ఎమ్మెల్యేలు, ఎంపీలందరి మద్దతును కోరుతూ ఓ ప్రకటనను పోస్ట్ చేశారు. తాను భారత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నానన్నారు. “మన రాజ్యాంగంలోని పూర్వ స్తంభమైన లౌకికవాదాన్ని రక్షించడం కోసం నేను నిలబడతాను. నేను ఏకాభిప్రాయం, సహకారంతో కూడిన రాజకీయాలను ప్రోత్సహించడం కోసం నిలబడతాను. నా ప్రత్యర్థి అభ్యర్థికి సంఘర్షణ, ఘర్షణ రాజకీయాలు చేసే పార్టీ మద్దతు ఇస్తుంది” ఓ ప్రకటనలో అన్నారు.
Also Read
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
- Amen : "గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్కు రావద్దు".. హారర్ మూవీ మేకర్స్ సంచలన హెచ్చరిక!
Presidential Poll 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎంలు ఎందుకు వాడరు?
రాష్ట్రపతి ఎన్నిక ఇద్దరు అభ్యర్థుల గురించి కాదని, ఇది రెండు సిద్ధాంతాల మధ్య పోటీ అని సిన్హా పునరుద్ఘాటించారు. బ్యూరోక్రాట్ నుండి రాజకీయవేత్తగా మారిన యశ్వంత్ సిన్హా, అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాలు, ఆర్థిక మంత్రి వంటి ముఖ్యమైన శాఖలను నిర్వహించారు.
తాజావార్తలు
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
-
Amen : “గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్కు రావద్దు”.. హారర్ మూవీ మేకర్స్ సంచలన హెచ్చరిక!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!