Yarlagadda Venkat Rao Election Campaign: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ-జనసేన సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పాటు అవుతుందని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుపై ఓటేసి.. తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన నియోజకవర్గ ప్రజలను కోరారు. బాబు వస్తేనే భవిష్యత్తు బాగుంటుందని యార్లగడ్డ ప్రచారం చేశారు.
‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గన్నవరం మండలం ముస్తాబాద గ్రామంలో యార్లగడ్డ వెంకట్రావు పర్యటించారు. ముస్తాబాద గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ.. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను యార్లగడ్డ ఎండగట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయబోయే సూపర్ సిక్స్ పథకాలను ఆయన ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుపై ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Also Read: NTR-Bharata Ratna: కేంద్ర కేబినెట్ చివరి భేటీ.. ఎన్టీఆర్కు భారతరత్న?
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేసిన విషయం తెలిసిందే. టీడీపీ అభ్యర్ధి వల్లభనేని వంశీపై ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే గతేడాది వైసీపీకి రాజీనామా చేసిన యార్లగడ్డ.. టీడీపీలో చేరారు. అప్పటినుంచి గన్నవరం నియోజకవర్గంలో చురుగ్గా ఉంటున్నారు. గన్నవరం నియోజకవర్గంలో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ఆయన ముందుకుదుకుపోతున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండంతో ప్రచారంలో వేగం పెంచారు.