Yanamala Ramakrishnudu: రూ.71,449 కోట్ల కేంద్రం నిధులు పక్కదారి..! రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yanamala Ramakrishnudu: వైఎస్ జగన్ ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలు అమలు చేస్తోంది.. జగన్ వైఖరి వల్ల కేంద్రం నుంచి రావాల్సిన వేలాది కోట్ల రూపాయలు ఏపీకి రావడం లేదు.. మరోవైపు.. వచ్చిన నిధులను కూడా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు.. 94 కేంద్ర పథకాలకు జగన్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల బీసీ వర్గాలు అభివృద్ధికి దూరమయ్యాయన్న ఆయన.. కొన్ని రంగాలకు వస్తోన్న కేంద్ర నిధులను ఏపీ దారి మళ్లిస్తున్నారు.. వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, స్ఖానిక సంస్థలకు వచ్చే నిధులను పక్కదారి పట్టించారు. నాలుగున్నరేళ్ల కాలంలో కేంద్రం నుంచి వచ్చిన రూ. 71,449 కోట్ల నిధులు పక్కదారి పట్టాయని.. అవినీతి, అక్రమాలు, దోపిడీకే కేంద్ర నిధులను దారి మళ్లించారని ఆరోపించారు.
Read Also: Uttarakhand Tunnel Collapse: ఉత్తరాఖండ్ ఘటన.. మూడో రోజు కూడా కొనసాగతున్న సహాయక చర్యలు
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
వ్యక్తిగత ప్రచారం కోసం రాష్ట్రానికి సీఎం వైఎస్ జగన్ ద్రోహం చేస్తున్నారని విమర్శించారు యనమల.. కేంద్రం ఇచ్చే నిధులకు వైఎస్సార్, జగన్ పేర్లను పెట్టడంపై కేంద్రం అభ్యంతరం తెలిపింది. పేర్ల విషయంలో జగన్ ప్రభుత్వ తీరు మారకపోవడంతో ఏపీకివ్వాల్సిన రూ. 6 వేల కోట్లను కేంద్రం నిలిపేసిందన్నారు. పేర్ల కోసం జగన్ పేదలను బలి చేస్తున్నారు. 75 పథకాలకు జగన్, వైఎస్సార్ పేర్లు పెట్టడం రాచరిక పోకడ కాదా..? పేదల గృహ నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన రూ. 3084 కోట్లని దారి మళ్లించారు. రైతులకివ్వాలని కేంద్రం ఇచ్చిన కరవు సాయం రూ. 900 కోట్లు రైతులకు చేరలేదు. రూ. 8660 కోట్ల మేర స్థానిక సంస్థల నిధులు రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించింది. ఉపాధి హామీ కూలీలకు చెందాల్సిన రూ. 7879 కోట్లను దారి మళ్లించి.. వలసలకు జగన్ ప్రభుత్వం కారణమవుతోంది అంటూ ఆరోపణలు గుప్పించారు టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!