Yanamala Ramakrishnudu: ఈ పాలనలో బడ్జెట్ కేటాయింపులకు విలువలేదు..!
Yanamala Ramakrishnudu: జగన్ రెడ్డి పాలనలో బడ్జెట్ కేటాయింపులకు విలువ లేదు అని విమర్శించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు.. ఆరు విధ్వంసకర ఆర్ధిక విధానాలతో రాష్ట్రాన్ని సీఎం జగన్ సర్వనాశనం చేశారని ఆయన. బ్యాడ్ డెట్, హై కరెప్షన్, హై ఇన్ప్లేషన్, హై అన్ ఎంప్లాయ్మెంట్, హై డెఫిసిట్స్, సిస్టమ్స్ కొలాప్స్ అనే విధానాలే రాష్ట్రానికి పట్టిన దరిద్రం అన్నారు. రాష్ట్ర ఆర్ధిక దుస్థితిపై అసెంబ్లీ సాక్షిగా చేదు నిజాలను దాచిపెట్టి రాష్ట్ర ప్రజలను మసిపూసి మారేడు కాయ చేయాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోంది. జగన్ రెడ్డి పాలనలో బడ్జెట్ కేటాయింపులకు విలువ లేదు. 2022-23 ఏడాది రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి తెచ్చిన తాత్కాలిక అప్పులతోనే నడిపిందని ఆరోపించారు.
Read Also: CM Revanth: మీరెప్పుడు రైతుబంధు ఇచ్చారు..? మేము వచ్చి 60 రోజులు కూడా కాలేదు
Also Read
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
- యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
ఏడాదిలో 365 రోజుల్లో 24 రోజులు తప్ప మొత్తం ఏడాది చేబదుళ్లతోనే గడిచిందని విమర్శించారు యనమల.. ఓడీ 152 రోజులు తీసుకున్నారు. అసెంబ్లీకి చెప్పకుండా తెచ్చిన రూ.5 లక్షల కోట్ల రుణాలు, ఆర్బీఐ నుంచి తీసుకున్న తాత్కాలిక అప్పులు రూ.1,18,039 కోట్లు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2021-22 లో 11,22,837 కోట్లు ఉండగా 2022-23 లో 13,17,728 కోట్లకు పెరిగిందని తప్పుడు లెక్కలు చెబుతున్నారని దుయ్యబట్టారు.. ఖర్చు చేయకుండా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (ఎస్.జీఎస్టీ) ఎలా పెరుగుతుంది? అని నిలదీశారు. జగన్ రెడ్డి పాలనలో పేదలు మరింత పేదలయ్యారన్న ఆయన.. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో మన రాష్ట్రం స్థానం ఎక్కడో చెప్పకుండా పేదరికం తగ్గిందని చెప్పడం అవివేకం అవుతుందన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో మన రాష్ట్రంది 13 వ స్థానం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మనది 20 వ స్థానం.. మన కంటే వనరులు తక్కువైన పొరుగు రాష్ట్రం తెలంగాణ.. ఏపీ కంటే మెరుగ్గా 21 స్థానంలో నిలిచిందని తెలిపారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు.
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!