Delhi Yamuna Flood: ఢిల్లీలో 45 ఏళ్ల రికార్డు బద్దలు.. యమునకు పెరిగిన నీటి మట్టం.. 144సెక్షన్ అమలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Yamuna Flood: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఉత్తర భారతదేశంలో వరదలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీలోని యమునా నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. యమునా నీటిమట్టం బుధవారం నాటికి రికార్డు స్థాయిలో 207.81 మీటర్లను దాటింది. 1978 తర్వాత ఇదే అత్యధికం. అప్పట్లో నది నీటిమట్టం 207.49 మీటర్లకు చేరుకుంది. యమునా నది నీటిమట్టం నిరంతరం పెరగడంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సచివాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం యమునా సమీపంలో లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు వీలైనంత త్వరగా తమ ఇళ్లను ఖాళీ చేయాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
Read Also:Chandrayaan 3: చంద్రయాన్ -3 రిహార్సల్ లాంచ్ పూర్తి.. కౌంట్ డౌన్ షురూ
Also Read
సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘హిమాచల్ ప్రదేశ్ నుండి హర్యానాకు విడుదల చేసే నీటి పరిమాణం తగ్గిందని, ఇది యమునా నీటి మట్టంపై ప్రభావం చూపుతుందని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ తనకు తెలియజేశారు. నది నీటిమట్టం తగ్గేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థించారు. ఢిల్లీలో వరదల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని పాఠశాలలను జూలై 13న మూసివేస్తున్నట్లు పౌర సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సివిల్ లైన్స్ జోన్లోని లోతట్టు ప్రాంతాల్లోని 10 పాఠశాలలు, షహదర (సౌత్) జోన్లో 6 పాఠశాలలు, షహదారా (ఉత్తర) జోన్లో ఒక పాఠశాలను మూసివేయాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ తెలిపింది. జులై 13న ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
Read Also:Gold Price Today: పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
ఢిల్లీలోని యమునా నది నీటిమట్టం బుధవారం సాయంత్రం 4 గంటలకు 207.81 మీటర్లకు చేరుకుంది. అంతకుముందు 1978లో నది నీటిమట్టం 207.49 మీటర్లకు చేరుకుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, కేజ్రీవాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. వీలైతే హర్యానాలోని హథినికుండ్ బ్యారేజీ నుండి పరిమిత వేగంతో నీటిని విడుదల చేయాలని అభ్యర్థించారు. ప్రస్తుతం ప్రజల ప్రాణాలను కాపాడటంపై దృష్టి సారించామని కేజ్రీవాల్ అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాలని ఆయన కోరారు. పొంగిపొర్లుతున్న నదిని చూసేందుకు కొందరు వెళ్లడం కూడా చూస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. దయచేసి సెల్ఫీలు తీసుకోవడానికి అక్కడికి వెళ్లవద్దని వేడుకున్నారు. బోట్క్లబ్, మఠం మార్కెట్, నీలి ఛత్రీ మందిర్, యమునా బజార్, నీమ్ కరోలి గౌశాల, విశ్వకర్మ కాలనీ, మజ్ను కా తిలా, వజీరాబాద్ మధ్య ప్రాంతం నీట మునిగింది. ఢిల్లీ ప్రభుత్వం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డిఆర్ఎఫ్) సహాయం కోరవచ్చని తెలియజేసిందని కేజ్రీవాల్ చెప్పారు. అవసరమైతే పాఠశాలలను రిలీఫ్ క్యాంపులుగా మార్చాలని జిల్లా మేజిస్ట్రేట్లకు కూడా సూచించామని చెప్పారు.
తాజావార్తలు
-
ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్పై ఘన విజయం..
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!