Delhi Yamuna Flood: ఢిల్లీలో 45 ఏళ్ల రికార్డు బద్దలు.. యమునకు పెరిగిన నీటి మట్టం.. 144సెక్షన్ అమలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Yamuna Flood: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఉత్తర భారతదేశంలో వరదలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీలోని యమునా నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. యమునా నీటిమట్టం బుధవారం నాటికి రికార్డు స్థాయిలో 207.81 మీటర్లను దాటింది. 1978 తర్వాత ఇదే అత్యధికం. అప్పట్లో నది నీటిమట్టం 207.49 మీటర్లకు చేరుకుంది. యమునా నది నీటిమట్టం నిరంతరం పెరగడంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సచివాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం యమునా సమీపంలో లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు వీలైనంత త్వరగా తమ ఇళ్లను ఖాళీ చేయాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
Read Also:Chandrayaan 3: చంద్రయాన్ -3 రిహార్సల్ లాంచ్ పూర్తి.. కౌంట్ డౌన్ షురూ
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘హిమాచల్ ప్రదేశ్ నుండి హర్యానాకు విడుదల చేసే నీటి పరిమాణం తగ్గిందని, ఇది యమునా నీటి మట్టంపై ప్రభావం చూపుతుందని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ తనకు తెలియజేశారు. నది నీటిమట్టం తగ్గేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థించారు. ఢిల్లీలో వరదల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని పాఠశాలలను జూలై 13న మూసివేస్తున్నట్లు పౌర సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సివిల్ లైన్స్ జోన్లోని లోతట్టు ప్రాంతాల్లోని 10 పాఠశాలలు, షహదర (సౌత్) జోన్లో 6 పాఠశాలలు, షహదారా (ఉత్తర) జోన్లో ఒక పాఠశాలను మూసివేయాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ తెలిపింది. జులై 13న ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
Read Also:Gold Price Today: పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
ఢిల్లీలోని యమునా నది నీటిమట్టం బుధవారం సాయంత్రం 4 గంటలకు 207.81 మీటర్లకు చేరుకుంది. అంతకుముందు 1978లో నది నీటిమట్టం 207.49 మీటర్లకు చేరుకుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, కేజ్రీవాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. వీలైతే హర్యానాలోని హథినికుండ్ బ్యారేజీ నుండి పరిమిత వేగంతో నీటిని విడుదల చేయాలని అభ్యర్థించారు. ప్రస్తుతం ప్రజల ప్రాణాలను కాపాడటంపై దృష్టి సారించామని కేజ్రీవాల్ అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాలని ఆయన కోరారు. పొంగిపొర్లుతున్న నదిని చూసేందుకు కొందరు వెళ్లడం కూడా చూస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. దయచేసి సెల్ఫీలు తీసుకోవడానికి అక్కడికి వెళ్లవద్దని వేడుకున్నారు. బోట్క్లబ్, మఠం మార్కెట్, నీలి ఛత్రీ మందిర్, యమునా బజార్, నీమ్ కరోలి గౌశాల, విశ్వకర్మ కాలనీ, మజ్ను కా తిలా, వజీరాబాద్ మధ్య ప్రాంతం నీట మునిగింది. ఢిల్లీ ప్రభుత్వం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డిఆర్ఎఫ్) సహాయం కోరవచ్చని తెలియజేసిందని కేజ్రీవాల్ చెప్పారు. అవసరమైతే పాఠశాలలను రిలీఫ్ క్యాంపులుగా మార్చాలని జిల్లా మేజిస్ట్రేట్లకు కూడా సూచించామని చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!