Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Yamuna Water Level Rises Cm Arvind Kejriwal Emergency Meeting Appeals To People To Vacate Their Houses

Delhi Yamuna Flood: ఢిల్లీలో 45 ఏళ్ల రికార్డు బద్దలు.. యమునకు పెరిగిన నీటి మట్టం.. 144సెక్షన్ అమలు

Published Date :July 13, 2023 , 7:10 am
By Rakesh Reddy
Delhi Yamuna Flood: ఢిల్లీలో 45 ఏళ్ల రికార్డు బద్దలు.. యమునకు పెరిగిన నీటి మట్టం.. 144సెక్షన్  అమలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Delhi Yamuna Flood: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఉత్తర భారతదేశంలో వరదలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీలోని యమునా నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. యమునా నీటిమట్టం బుధవారం నాటికి రికార్డు స్థాయిలో 207.81 మీటర్లను దాటింది. 1978 తర్వాత ఇదే అత్యధికం. అప్పట్లో నది నీటిమట్టం 207.49 మీటర్లకు చేరుకుంది. యమునా నది నీటిమట్టం నిరంతరం పెరగడంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సచివాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం యమునా సమీపంలో లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు వీలైనంత త్వరగా తమ ఇళ్లను ఖాళీ చేయాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.

Read Also:Chandrayaan 3: చంద్రయాన్ -3 రిహార్సల్ లాంచ్ పూర్తి.. కౌంట్ డౌన్ షురూ

Also Read

  • PBKS Income: 2008 నుంచి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కొట్టని పంజాబ్‌కు‌ డబ్బులే డబ్బులు.. ఎలా అంటే..
  • AP Mobile Alert: మొబైల్‌లో అలర్ట్ షాక్.? రేపు ఎన్నిగంటలకంటే..!
  • Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్‌లో కలకలం..
  • RR Vs DC: యశస్వి జైస్వాల్ చేసిన పరుగులు 6.. అయినా మరో ప్రపంచ రికార్డు బద్దలు..

సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘హిమాచల్ ప్రదేశ్ నుండి హర్యానాకు విడుదల చేసే నీటి పరిమాణం తగ్గిందని, ఇది యమునా నీటి మట్టంపై ప్రభావం చూపుతుందని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ తనకు తెలియజేశారు. నది నీటిమట్టం తగ్గేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థించారు. ఢిల్లీలో వరదల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని పాఠశాలలను జూలై 13న మూసివేస్తున్నట్లు పౌర సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సివిల్‌ లైన్స్‌ జోన్‌లోని లోతట్టు ప్రాంతాల్లోని 10 పాఠశాలలు, షహదర (సౌత్‌) జోన్‌లో 6 పాఠశాలలు, షహదారా (ఉత్తర) జోన్‌లో ఒక పాఠశాలను మూసివేయాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ తెలిపింది. జులై 13న ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

Read Also:Gold Price Today: పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?

ఢిల్లీలోని యమునా నది నీటిమట్టం బుధవారం సాయంత్రం 4 గంటలకు 207.81 మీటర్లకు చేరుకుంది. అంతకుముందు 1978లో నది నీటిమట్టం 207.49 మీటర్లకు చేరుకుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, కేజ్రీవాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. వీలైతే హర్యానాలోని హథినికుండ్ బ్యారేజీ నుండి పరిమిత వేగంతో నీటిని విడుదల చేయాలని అభ్యర్థించారు. ప్రస్తుతం ప్రజల ప్రాణాలను కాపాడటంపై దృష్టి సారించామని కేజ్రీవాల్ అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాలని ఆయన కోరారు. పొంగిపొర్లుతున్న నదిని చూసేందుకు కొందరు వెళ్లడం కూడా చూస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. దయచేసి సెల్ఫీలు తీసుకోవడానికి అక్కడికి వెళ్లవద్దని వేడుకున్నారు. బోట్‌క్లబ్, మఠం మార్కెట్, నీలి ఛత్రీ మందిర్, యమునా బజార్, నీమ్ కరోలి గౌశాల, విశ్వకర్మ కాలనీ, మజ్ను కా తిలా, వజీరాబాద్ మధ్య ప్రాంతం నీట మునిగింది. ఢిల్లీ ప్రభుత్వం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) సహాయం కోరవచ్చని తెలియజేసిందని కేజ్రీవాల్ చెప్పారు. అవసరమైతే పాఠశాలలను రిలీఫ్ క్యాంపులుగా మార్చాలని జిల్లా మేజిస్ట్రేట్‌లకు కూడా సూచించామని చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Arvind Kejriwal
  • delhi Yamuna
  • Delhi Yamuna Flood
  • yamuna water level

తాజావార్తలు

  • PBKS Income: 2008 నుంచి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కొట్టని పంజాబ్‌కు‌ డబ్బులే డబ్బులు.. ఎలా అంటే..

  • AP Mobile Alert: మొబైల్‌లో అలర్ట్ షాక్.? రేపు ఎన్నిగంటలకంటే..!

  • Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్‌లో కలకలం..

  • Palakura Ullikaram Recipe : పాలకూర ఉల్లికారం.. అన్నం, చపాతీల్లోకి అదిరిపోయే రుచి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!

  • RR Vs DC: యశస్వి జైస్వాల్ చేసిన పరుగులు 6.. అయినా మరో ప్రపంచ రికార్డు బద్దలు..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions