Mumbai: ఇండియాకు పాకిన పాలస్తీనా నినాదం.. స్కూల్ ప్రిన్సిపాల్ తొలగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత రెండు నెలలుగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. అక్టోబర్ 7న హమాస్ హఠాత్తుగా ఇజ్రాయెల్పై దాడి చేసింది. అనంతరం ప్రతీకారంగా ఇజ్రాయెల్.. హమాస్ లక్ష్యంగా దాడులకు తెగబడింది. వందలాది మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా రఫాలోని హమాస్ టార్గెట్గా ఇజ్రాయెల్ ముట్టడి వేసింది. వారి అంతమే లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ జరిగిస్తున్న మారణహోమానికి నిరసనగా ఇటీవల అమెరికాలోని యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలతో దద్దరిల్లాయి. అప్రమత్తం అయిన అమెరికా పోలీసులు.. నిరసనలపై ఉక్కుపాదం మోపారు. ఎక్కడికక్కడే ఆందోళనలను, నిరసనలను అణగదొక్కారు. కేసులు నమోదు చేసి.. విశ్వవిద్యాలయాల నుంచి బయటకు పంపేశారు. మరోవైపు ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదని విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. ఇదిలా ఉంటే పాలస్తీనా అనుకూల ఉద్యమం తాజాగా ఇండియాకు పాకింది. ముంబైలోని ఓ స్కూల్ ప్రిన్సిపల్.. పాలస్తీనాకు అనుకూలంగా పోస్టులు పెట్టడంతో యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది.
ఇది కూడా చదవండి: RBI: రూ. 20,000 నగదు రుణాల పరిమితిని పాటించాలి.. నాన్-బ్యాంక్స్కి ఆర్బీఐ ఆదేశం..?
Also Read
- YS Jagan: వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
- TDP Mahanadu: పసుపు జెండా చూస్తే వచ్చే వైబ్రేషన్సే వేరు.. మహానాడులో చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం
- స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
- Supreme Court: SIR ప్రక్రియ చట్టబద్ధమే.. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..
ముంబైలోని ఒక ఉన్నత పాఠశాలలో పర్వీన్ షేక్ ప్రిన్సిపల్గా పని చేస్తున్నారు. ఆమె సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా పాలస్తీనాకు మద్దతుగా పోస్టులు పెడుతూ వస్తున్నారు. పాఠశాల విలువలకు విరుద్ధంగా ఆమె వ్యవహరించడంతో సోమయ్య స్కూల్ మేనేజ్మెంట్ సీరియస్గా తీసుకుంది. ఆమె కార్యకలాపాలు.. సంస్థ యొక్క సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయన్న కారణంతో ఆమెను తొలగిస్తున్నట్లు స్కూల్ యాజమాన్యం ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Young Voters: 2024 లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా ఎన్ని కోట్ల మంది యువత ఓటు వేస్తున్నారు..?
ప్రిన్సిపల్ పర్వీన్ షేక్ మాత్రం.. యాజమాన్యం నిర్ణయాన్ని తప్పుపట్టారు. తొలగింపు వార్త తెలిసి షాక్ అయినట్లు చెప్పారు. టెర్మినేషన్ నోటీసు అందుకోకముందే తనను తొలగించడం చట్ట విరుద్ధం అన్నారు. 12 ఏళ్లుగా పాఠశాల అభివృద్ధికి కృషి చేసినట్లు చెప్పుకొచ్చారు. నిజాయితీ, అంకితభావంతో పని చేసినట్లు ఆమె తెలిపారు.
ఏడేళ్ల క్రితమే పర్వీన్ షేక్ పాఠశాల ప్రిన్సిపల్గా బాధ్యతలు చేపట్టారు. సోషల్ మీడియాలో ఆమె పెడుతున్న పోస్టులపై గతంలోనే యాజమాన్యం సీరియస్ అయింది. రాజీనామా చేయాలని కోరింది. ఆమె నుంచి వ్రాతపూర్వక వివరణ కోరింది. ఆమె సమాధానం కోసం వేచి చూస్తున్న సమయంలోనే వేటు పడింది.
ఈ చర్య రాజకీయ ప్రేరేపితమైనదిగా కనిపిస్తోందని పర్వీన్ షేక్ అభిప్రాయపడింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో వ్యాఖ్యానించింది. తనకు న్యాయ వ్యవస్థ, భారత రాజ్యాంగంపై నమ్మకం ఉందన్నారు. న్యాయప్రకారం పోరాటం చేస్తానని ఆమె ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Telangana Tourism: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో తిరుమల ట్రిప్.. ఫ్రీగా శీఘ్రదర్శనం..
తాజావార్తలు
-
SRH vs RR Eliminator: కళ్లు చెదిరే గణాంకాలు వర్మ.. ఎలిమినేటర్లో బౌలర్లకు అతి పెద్ద సవాల్ ఆ ఇద్దరే!
-
YS Jagan: వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
-
Vishwambhara : అదిగో విశ్వంభర.. ఇదిగో రిలీజ్
-
TDP Mahanadu: పసుపు జెండా చూస్తే వచ్చే వైబ్రేషన్సే వేరు.. మహానాడులో చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం
-
August Box Office: టాలీవుడ్లో హీట్ పెంచనున్న ఆగస్టు రిలీజ్లు.. నాని Vs రవితేజ Vs శర్వా!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!