WPL 2024: నేటి నుంచే డబ్ల్యూపీఎల్ 2024.. తొలి మ్యాచ్లో ముంబై, ఢిల్లీ ఢీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
All you need to know WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024కు రంగం సిద్ధమైంది. శుక్రవారం రెండో సీజన్కు తెరలేవనుంది. చెన్నైలోని చిన్నస్వామి స్టేడియంలో గతేడాది ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్తో డబ్ల్యూపీఎల్ 2024కు తెరలేవనుంది. ఈ మ్యాచ్కు ముందు ఓపెనింగ్ సెర్మనీ సాయత్రం 6.30 గంటలకు జరగనుంది. రాత్రి 7:30 నుంచి స్పోర్ట్–18, జియో సినిమాలో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. గత ఏడాదిలాగే ఈసారి కూడా మొత్తం 22 మ్యాచ్లు నిర్వహిస్తారు. మార్చి 17న ఢిల్లీ వేదికగా డబ్ల్యూపీఎల్ ఫైనల్ జరుగుతుంది.
డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్ కేవలం ముంబైలోని డీవై పాటిల్, బ్రబౌర్న్ స్టేడియాల్లోనే జరిగింది. డబ్ల్యూపీఎల్కు ఆదరణ పెరగడంతో ఈసారి రెండు నగరాల్లో మ్యాచ్లు జరగబోతున్నాయి. తొలి 11 మ్యాచ్లకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం, ఫైనల్ సహా చివరి 11 మ్యాచ్లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యమిస్తాయి. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియల్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు టైటిల్ కోసం బరిలోకి దిగుతున్నాయి.
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్కు అర్హత సాధిస్తుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ‘ఎలిమినేటర్’ మ్యాచ్లో తలపడతాయి. ఎలిమినేటర్లో గెలిచిన జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. ఇక చిన్నస్వామి స్టేడియంలో జరిగే డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఆరంభ వేడుకల్లో బాలీవుడ్ హీరోలు షారుక్ ఖాన్, షాహిద్ కపూర్, టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్ర, కార్తీక్ ఆర్యన్ సహా మరికొందరు ప్రత్యేక ప్రదర్శన ఇవ్వబోతున్నారు.
Also Read: MLA Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి కారణం అదే!
హైదరాబాద్, ఏపీ నుంచి 8 మంది డబ్ల్యూపీఎల్ 2024లో బరిలోకి దిగనున్నారు. హైదరాబాద్ ప్లేయర్లు అరుంధతి రెడ్డి (ఢిల్లీ), త్రిష పూజిత (గుజరాత్), యషశ్రీ, గౌహర్ సుల్తానా (యూపీ) జట్లకు ఆడుతున్నారు. ఏపీ ప్లేయర్లు స్నేహ దీప్తి (ఢిల్లీ), సబ్బినేని మేఘన (బెంగళూరు), ఎండీ షబ్నమ్ (గుజరాత్), అంజలి శర్వాణి (యూపీ) టీమ్ల తరఫున ఆడుతున్నారు. హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, షెఫాలీ వర్మ, శిఖా పాండే, రేణుక సింగ్ లాంటి స్టార్స్ కూడా పలు జట్లకు ఆడుతున్నారు.
తాజావార్తలు
-
Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్కు త్రిషా కృష్ణన్.. విజయ్తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్లో చర్చ
-
India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
-
AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
-
BRICS Summit 2026: మోడీ-జిన్పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
-
Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్ను పక్కన పెట్టి.. మరో సూపర్హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!