Pakistan: పాకిస్థాన్ సైన్యం దృష్టిలో మరొక పార్టీ.. అదే సీన్ రిపీట్ అవుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: నిజానికి పాకిస్థాన్ను శాసించేది ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకులు కాదని.. పాక్ సైన్యం అని పలువురు విశ్లేషకులు చెబుతుంటారు. అంతటి శక్తి ఉంటుంది దాయాది దేశంలో సైన్యానికి. పాకిస్థాన్ రాజకీయాల్లో నెలకొన్న గందరగోళం ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. తాజాగా పాక్ సైన్యం.. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ తర్వాత, మరో ప్రధాన రాజకీయ పార్టీ అయిన ముత్తహిదా క్వామీ మూవ్మెంట్ (ఎంక్యూఎం) పాకిస్థాన్పై సైన్యం నిఘా పెట్టినట్లు సమాచారం.
READ ALSO: ADG Mahesh Bhagwat : నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలు.. రూల్స్ ఇలా..!
Also Read
- Sabir Bhatia: 2012లో ఫ్లాట్ బుక్ చేస్తే.. 2032లో చేతికి తాళాలు!.. కుబేరుడికే ఈ గతి పడితే సామాన్యుడి పరిస్థితేంటి?
- OM: ధనుష్ మాస్ అవతార్.. ‘ఓం’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. చూశారా.?
- Income Tax: భారత్లో పెరుగుతున్న కుబేరులు.. 300% పెరిగిన శతకోటీశ్వరులు.. రూ.100 కోట్ల క్లబ్లో 576 మంది
- Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్.. మహిళా ట్రైనీ ఐపీఎస్కు వైద్య పరీక్షలు!
ఇటీవల పాకిస్థాన్లో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. అనేక మంది అగ్ర MQM నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేల భద్రతను అకస్మాత్తుగా సైన్యం ఉపసంహరించుకుంది. ఇది రాజకీయ వర్గాలలో భయాందోళనలకు గురిచేసింది. దీనిని ఆ పార్టీ నాయకత్వం తీవ్రమైన భద్రతా ముప్పుగా పేర్కొంది. ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే ఫెడరల్ మంత్రి ఖలీద్ మక్బూల్ సిద్ధిఖీ, సీనియర్ నాయకులు ఫరూఖ్ సత్తార్, ముస్తఫా కమల్, అనీస్ ఖైంఖానీల భద్రతను ఉపసంహరించుకున్నట్లు పలు వర్గాలు తెలిపాయి. అంతే కాకుండా, సింధ్ అసెంబ్లీలో MQM ప్రతిపక్ష నాయకుడు అలీ ఖుర్షీదీ భద్రతను కూడా ఉపసంహరించుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి. కరాచీలో జరిగిన గుల్ ప్లాజా సంఘటనకు సంబంధించి MQM ప్రశ్నలు లేవనెత్తుతూ, ప్రభుత్వ యంత్రాంగాన్ని విమర్శిస్తున్న సమయంలో ఈ భద్రత ఉపసంహరణ తెరపైకి రావడం సంచలనం సృష్టిస్తుంది.
ఈ నిర్ణయంపై మంత్రులు, అసెంబ్లీ సభ్యులు, సీనియర్ MQM నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతా ఉపసంహరణకు తమకు కచ్చితమైన కారణం ఇవ్వలేదని లేదా వారికి ఎటువంటి ముప్పు అంచనా వేయలేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ చర్యకు గుల్ ప్లాజా సంఘటనను బహిరంగంగా ప్రశ్నించడమే కారణమై ఉండవచ్చని ఒక సీనియర్ MQM నాయకుడు పేర్కొన్నారు. ఈ అంశంపై ఎలాంటి ఒత్తిడి లేదా బెదిరింపులతో సంబంధం లేకుండా తమ పార్టీ ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంటుందని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. ఈ చర్య పాకిస్థాన్లో పెరుగుతున్న పౌర-సైనిక ఉద్రిక్తత, రాజకీయ అసమ్మతిని సూచిస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి పాక్లో మొదట PTI పై అణచివేత, ఇప్పుడు MQM నాయకులకు భద్రతను తొలగించడం అనేది ఆలోచించాల్సిన విషయమే అని వెల్లడించారు. ఈ మొత్తం పరిణామం తరువాత, MQM నాయకత్వం అత్యవసర విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకత్వం తాజా అంశంపై తన అధికారిక వైఖరిని ప్రదర్శిస్తుందని సమాచారం.
READ ALSO: TharunBhascker – EeshaRebba: త్వరలోనే ‘గుడ్ న్యూస్’ వినవచ్చేమో..
తాజావార్తలు
-
Unemployment Crisis: చేతిలో డిగ్రీ ఉన్నా ఉద్యోగం ఎందుకు దొరకడం లేదు? షాకింగ్ రిపోర్ట్
-
Sabir Bhatia: 2012లో ఫ్లాట్ బుక్ చేస్తే.. 2032లో చేతికి తాళాలు!.. కుబేరుడికే ఈ గతి పడితే సామాన్యుడి పరిస్థితేంటి?
-
OM: ధనుష్ మాస్ అవతార్.. ‘ఓం’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. చూశారా.?
-
Ten Doeschate-KKR: టీమిండియా తరిమేసింది.. కేకేఆర్ అక్కున చేర్చుకుంది.. ర్యాన్ డస్కాటె భలే లక్కీ!
-
Shivangi Joshi: యాక్టింగ్ నేర్పిస్తానంటూ వేధింపులు.. మేనమామ చేసిన పనికి కన్నీళ్ళు పెట్టుకున్న శివాంగి
ట్రెండింగ్
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?