Suicide Attempt : దుర్గం చెరువులో దూకబోయిన యువతి.. కాపాడిని పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యక్తిగత సమస్యలతో మనస్తాపానికి గురైన 25 ఏళ్ల యువతి సోమవారం దుర్గం చెరువులో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. మాదాపూర్ ట్రాఫిక్ పోలీసుల మొబైల్ పెట్రోలింగ్ వాహనం క్షణికావేశంలో ఆమెను గమనించి రక్షించింది. కొంత మందు తాగిన మహిళ సరస్సులోకి దూకేందుకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని సందర్శించింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు కౌన్సెలింగ్ చేసి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించామని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే.. మాదాపూర్లో సాయి అనే యువకుడి అనుమానాస్పద మృతి చెందాడు. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలోని ఓయో హోటల్ ఆరవ అంతస్తుపై నుంచి దూకి మృతి చెందాడు. మృతుడు అనంతపురం జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఇటీవలే ప్రిలిమ్స్ పరీక్ష్ రాసి మెయిన్స్కు సాయి సిద్ధం అవుతున్నాడు. ఓయో రూంలో నలుగురు ఫ్రెండ్స్పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాయి అనే యువకుడిది ఆత్మహత్యా? లేదంటే స్నేహితులు కావాలనే పైనుంచి తోసేశారా? అనేది తెలియాల్సి ఉంది.
Also Read
- Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
- Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
- Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
- PM Modi: ప్రధాని మోడీ ఇండోనేషియా పర్యటన.. బ్రహ్మోస్ ఒప్పందమే కీలకం..
మరో చోట.. ఆన్లైన్ బెట్టింగ్ మరో యువకుడి ప్రాణాలు తీసింది. ఆర్థికంగా నష్టపోయిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెద్క్ జిల్లా రామాయంపేటలో జరిగింది. మండలంలోని ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన దొమ్మాట భానుప్రసాద్ (24) అనే యువకుడు గత కొన్నిరోజులుగా ఆన్లైన్లో గేమ్లు ఆడుతున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటుపడిన భాను ప్రసాద్ రూ.1.50 లక్షలు పోగొట్టుకున్నాడు. పైగా తెలిసిన వారి వద్ద అప్పులు కూడా చేశాడు. పెట్టిన డబ్బులన్నీ పోవడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఐదురోజుల క్రితం తమ వ్యవసాయ బావివద్దకు వెళ్లి పురుగు మందు తాగాడు.
తాజావార్తలు
-
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
-
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
-
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
-
Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!