Srilanka: శ్రీలంకలో ఇల్లు అమ్మి తమిళనాడుకు చేరుకున్న మహిళ.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srilanka: శ్రీలంకలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం మరింతగా ముదురుతూ.. ప్రజల ఇబ్బందులను పెంచుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి శ్రీలంక ప్రజలు ఎప్పుడూ చూడని అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే దేశంలో పట్టణ పేదరికం గత సంవత్సరంలో మూడు రెట్లు పెరిగిందనీ ప్రపంచ బ్యాంకు నివేదిక కూడా పేర్కొంది. చేతిలో చిల్లిగవ్వ లేదు.. శ్రీలంకలో ఎటు చూసినా దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి నిస్సహాయ స్థితిలో లంక మహిళలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులను చవిచూసిన ళ శ్రీలంకకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి స్వదేశం నుంచి పారిపోయి శనివారం తమిళనాడులోని ధనుష్కోడికి చేరుకుంది.
శ్రీలంకలో సంక్షోభం నుండి తప్పించుకోవడానికి ఒక మహిళ ఇల్లు అమ్మి, తమిళనాడుకు చేరుకుంది. శ్రీలంక మహిళ తన ఇంటితో సహా తన వస్తువులన్నింటినీ విక్రయించి, సంక్షోభంలో ఉన్న దేశం నుండి పారిపోయి శనివారం తమిళనాడు ఒడ్డుకు చేరుకుంది. ఆస్తులు అమ్మి వచ్చిన డబ్బును భారత్ పర్యటనకు వినియోగించింది. ఓ పడవలో ధనుష్కోడికి తన ఇద్దరు పిల్లలతో కలి వచ్చింది. అక్రమంగా భారత జలాల్లోకి వచ్చిన పడవలో వచ్చిన కారణంగా ప్రాదేశిక జలాల పర్యవేక్షణలో ఉన్న మెరైన్ పోలీసులు ముగ్గురిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు.
Also Read
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
Isro LVM3: కొన్ని గంటల్లో నింగిలోకి దూసుకెళ్లనున్న బాహుబలి రాకెట్ ఎల్వీఎం3..
శాంతి అనే మహిళ శ్రీలంకలోని జాఫ్నా నివాసి అని ప్రాథమిక విచారణలో తేలింది. ఆమె నిన్న రాత్రి 10 గంటల సమయంలో తలైమన్నార్ నుంచి ఫైబర్ బోట్ ఎక్కి ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో ధనుష్కోడి చేరుకుంది. రెండేళ్ల క్రితం నా భర్త చనిపోవడంతో పిల్లలిద్దరినీ నేనే చూసుకుంటున్నా.. ఇంటి పని చేస్తే వచ్చ డబ్బులు బతకడానికి సరిపోవడం లేదని.. చాలా రోజులుగా ఒక్క పూట భోజనం చేసేవాళ్లమని శాంతి తన బాధను వివరించింది. ఆర్థిక సంక్షోభం నేపథ్యలో ఆ దేశంలోని ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలిపింది. తాము ఇక్కడికి బతుకుదెరువు కోసం వచ్చినట్లు విన్నవించింది.
తాజావార్తలు
-
iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
-
NBK 112 : బాలయ్య -కొరటాల మాస్ సినిమా కాదు.. అంతకుమించి
-
Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
-
Lenin movie trailer : లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అయ్యగారు ఆన్ ట్రాక్
-
Stokes-Archer: వికెట్ పడినా సెలబ్రేషన్స్ చేసుకొని ఆర్చర్.. స్టోక్స్ అసహనం.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!