NTV Telugu Site icon

Woman Kidnapped Married Boyfriend: మరో పెళ్లి చేసుకున్న ప్రియుడు.. కిడ్నాప్ చేసి తాళికట్టించుకున్న ప్రియురాలు!

Woman Kidnapped Married Boyfriend

Woman Kidnapped Married Boyfriend

Chennai Woman Kidnapped and Married Boyfriend: తన ప్రియురాలికి ఏదైనా ఆపద ఎదురైతే తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాపాడుకుంటాడు ప్రియుడు. ప్రేమించిన అమ్మాయికి మరొకరితో పెళ్లి నిశ్చయం అయితే.. లేచిపోయైనా సరే పెళ్లి చేసుకునేందుకు వెనకాడరు. ఇందుకు యువతులు కూడా అతీతులు ఏమీ కాదు. తాజాగా ఓ యువతి తను ప్రాణానికంటే అమితంగా ప్రేమించిన వాడు మరొకరిని పెళ్లి చేసుకోవడం భరించలేక పోయింది. ఏకంగా తన ప్రియుడిని కిడ్నాప్‌ చేసి.. బలవంతంగా తాళి కట్టించుకుంది. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..

చెన్నై వేళచ్చేరికి చెందిన పార్తిబన్‌ (31) ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. గత జూలైలో ప్రియ అనే అమ్మాయిని పార్తిబన్‌ పెళ్లి చేసుకున్నాడు. ప్రియ కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. అయితే పార్తిబన్‌ పెళ్లికి మందు రాణిపేటకు చెందిన సౌందర్యను ప్రేమించాడు. చదువుకునే రోజుల్లో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఏడేళ్ల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు.

పార్తిబన్‌ పెళ్లి విషయం తెలుసుకున్న సౌందర్య అతడిని మర్చిపోలేకపోయింది. అతన్నే వివాహం చేసుకుంటానని తన తల్లి, బంధువులతో చెప్పింది. ఇక చేసేదిలేక సౌందర్యకు ఆమె తల్లి ఉమ అండగా నిలిచింది. తల్లి ఉమ.. బంధువులు రమేష్‌, శివ కుమార్‌ల సాయంతో పార్తిబన్‌ను కిడ్నాప్‌ చేసేందుకు ప్రణాళిక వేసింది. శుక్రవారం ఎప్పటిలాగానే ఆఫీస్ వెళ్లేందుకు పార్తీబన్ కారు ఎక్కాడు. ఇంతలో ఓ ముఠా హఠాత్తుగా వచ్చి కారులో ఉన్న పార్తిబన్‌ను కిడ్నాప్ చేశారు. ఇది చూసిన పార్తిబన్‌ తల్లి కారును ఆపేందుకు ప్రయత్నించగా.. అతివేగంతో ఆమెను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఇరుగుపొరుగు వారు వచ్చి ఆమెను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.

Also Read: Sunday Good Luck Remedies: ఆదివారం నాడు ఈ చర్యలు చేస్తే.. వ్యాపారంలో విజయం! ఊహించని డబ్బు మీ సొంతం

కిడ్నాప్ ముఠా పార్తిబన్‌ను నేరుగా కాంచీపురంలోని ఓ ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ సౌందర్య మెడలో బలవంతంగా తాళి కట్టించారు. విషయం తెలుసుకున్న పార్తీపన్ భార్య ప్రియ వెలాచ్చేరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలిలోని సీసీ కెమెరా ఫుటేజి ఆధారంగా నిందితులను గుర్తించారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఓ ఇంట్లో పార్తిబన్‌ ఉన్నట్లు గుర్తించారు. ఇంట్లో ఉన్న పార్తిబన్‌ మాజీ ప్రియురాలు సౌందర్య, ఆమె బంధువులను పోలీసులు అరెస్ట్ చేశారు.