Illegal Relationship: ఇద్దరు మగాళ్లతో కోడలు రాసలీలలు.. సడన్ గా ఎంట్రీ ఇచ్చిన అత్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Illegal Relationship: ఇటీవల అక్రమ సంబంధాలు ఎక్కువైపోయాయి. పెళ్లైన తరువాత వేరే వ్యక్తులతో కొంతమంది అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. అక్రమ బంధాల మోజులో పడి జీవిత భాగస్వాములను చంపుకుంటున్నారు. అనంతరం రోడ్డుపాలు అవుతున్నారు. ఇలాంటి కేసులు ఈ మధ్య కాలంలో తరచూ వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి ఘటన తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఓ పెళ్లయిన మహిళ ఒకే గదిలో ఇద్దరు మగవారితో రాసలీలలో ఉండగా సడన్ గా అత్త ఎంట్రీ ఇచ్చింది. కోడలు అలా చేయడం చూసి కోపోద్రిక్తురాలై గదికి తాళంవేసి పోలీసులకు ఫోన్ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు.
Read Also: America : కాలింగ్ బెల్ కొట్టినందుకు కారుతో గుద్ది కాటికి పంపాడు
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజ్గంజ్ జిల్లా నిచ్లాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే వ్యక్తి పక్క గ్రామానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన కొద్దిరోజులకు సదరు వ్యక్తి ఉపాధికోసం సౌదీ అరేబీయా వెళ్లాడు. భర్త విదేశాలకు వెళ్లడంతో.. భార్య పక్కగ్రామంలోని తన పుట్టింటికి వెళ్లి వస్తుండేది. కొద్దికాలానికి పుట్టింటి వద్ద తనకు బంధువులైన ఇద్దరు వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. పుట్టింటికి వెళ్లినప్పుడల్లా ఆ ఇద్దరితో కలిసి వస్తుండేది. ఇలా అక్రమ సంబంధం వ్యవహారం గుట్టుచప్పుడుగా కొంత కాలం సాగించింది.
Read Also: TS Eamcet: ఎంసెట్ హాల్ టిక్కెట్లు వచ్చేశాయ్.. డౌన్లోడ్ చేసుకోండి ఇలా
మెట్టినింటికి వచ్చిన తర్వాత కొద్దిరోజులకు వారిద్దరిని నేరుగా ఇంటికి పిలవడం మొదలు పెట్టింది. అత్తామామలకు తమ అమ్మవారి తరపు బంధువులని చెప్పేది. పలుసార్లు వాళ్లు ఇంటికి వచ్చిపోతుండటంతో అత్తకు అనుమానం వచ్చింది. ఓ రోజు ఇద్దరు వ్యక్తులు ఇంటికిరాగా.. తన కోడలు, ఇద్దరు వ్యక్తులు ఒకే గదిలో ఉన్నారు. రూంలో వారు ఏం చేస్తున్నారో చూసేందుకు అత్తవెళ్లగా.. తన కోడలు ఆ ఇద్దరు వ్యక్తులతో రాసలీలల్లో లీనమైపోగా… కోడలు చేసే పనిని కన్నంలో నుంచి చూసి కంగుతింది. ఎలాగైనా రెడ్ హ్యండెడ్ గా పట్టుకోవాలని భావించింది. కొడుకుకు జరిగిన అన్యాయం చూసి తట్టుకోలేకపోయింది. వెంటనే లావుపాటి తాళం తెచ్చి రూం తలుపుకు వేసింది. వెంటనే ఫోన్ అందుకుని 112 నెంబర్కు డయల్ చేసి పోలీసులకు విషయం చెప్పంది. పోలీసులు అక్కడికి చేరుకొని వారి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ అధికారి మాట్లాడుతూ.. మహిళ తన కోడలుపై ఫిర్యాదు చేసిందని తెలిపారు. పోలీసులు వెళ్లి చూడగా.. కోడలు ఇద్దరు వ్యక్తులతో అభ్యంతరకర స్థితిలో ఉందని, దీంతో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!