Wimbledon 2025: భారీగా వింబుల్డన్ ప్రైజ్మనీ.. విజేతకు ఎన్ని కోట్లంటే?
- జూన్ 30న వింబుల్డన్ 2025 ప్రారంభం
- భారీగా పెరిగిన వింబుల్డన్ ప్రైజ్మనీ
- టోర్నీ నగదు బహుమతి 53.5 మిలియన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ 2025 ఛాంపియన్షిప్ జూన్ 30న ప్రారంభం కానుంది. జులై 13 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. వింబుల్డన్ కోసం ఇప్పటికే ప్లేయర్స్ సిద్ధమయ్యారు. అయితే ఈసారి వింబుల్డన్ ప్రైజ్మనీ భారీగా పెరిగింది. టోర్నీ నగదు బహుమతిని రూ.610 కోట్లు (53.5 మిలియన్స్)గా నిర్ణయించినట్లు ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ అధికారులు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. వింబుల్డన్ 2024తో పోలిస్తే.. ఈసారి 7 శాతం అధికం.
వింబుల్డన్ 2025 విజేతగా నిలిచే ప్లేయర్కు రూ.34 కోట్ల ప్రైజ్మనీ అందించనున్నారు. ఇది గత సంవత్సరం కంటే దాదాపు 11.1 శాతం ఎక్కువ. గ్రాండ్ స్లామ్ టోర్నీలలో ఇదే అత్యధిక ప్రైజ్మనీ. వింబుల్డన్ 2025 టోర్నీలో పురుషులు, మహిళల విజేతలకు సమాన ప్రైజ్మనీ దక్కుతుంది. తొలి రౌండ్లో నిష్క్రమించే క్రీడాకారులకు రూ.76 లక్షల దక్కనున్నాయి. ఇది 10 శాతం పెరుగుదల. ప్రపంచ టాప్ 20లో ఉన్న అనేక మందితో సహా అగ్రశ్రేణి ప్లేయర్స్ గ్రాండ్ స్లామ్ ఆదాయంలో ఎక్కువ వాటాను అడగడంతో ప్రైజ్మనీని పెంచాల్సి వచ్చింది.
Also Read
- Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
- 48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
Also Read: Netherlands: వన్డేల్లో చరిత్ర సృష్టించిన పసికూన నెదర్లాండ్స్.. టీమిండియాకు కూడా సాధ్యం కాలేదు!
వింబుల్డన్ ప్రైజ్మనీని పెంచినందుకు గర్విస్తున్నాం అని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ డైరెక్టర్ డెబోరా జెవాన్స్ పేర్కొన్నాడు. ‘వింబుల్డన్ ప్రైజ్మనీని పెంచినందుకు మేం గర్విస్తున్నాం. గత 10 ఏళ్ల నుంచి నగదు బహుమతి పెంచుతూ వస్తున్నాం. గతేడాదితో పోలిస్తే ఈసారి 7 శాతం పెంచాం’ అని జెవాన్స్ తెలిపాడు. వింబుల్డన్ పురుషుల, మహిళల సింగిల్స్ ఫైనల్స్ సమయాలను మార్చారు. గతంలో కంటే రెండు గంటలు ఆలస్యంగా జరుగుతాయి. స్థానిక సమయం ప్రకారం సాయంత్రం 4 గంటలకు (ఐఎస్టీ రాత్రి 8:30 గంటలకు) మార్చారు. డబుల్స్ ఫైనల్స్ స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు (ఐఎస్టీ సాయంత్రం 5:30 గంటలకు) ప్రారంభమవుతాయి.
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
-
Aadi Saikumar : ఆది సాయికుమార్ కొత్త సినిమా అనౌన్స్మెంట్: ‘శంభల’ టీమ్తో మరో క్రేజీ ప్రయోగం!
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
ట్రెండింగ్
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!