Rahul gandhi: ఆ విషయంలో మోడీ బిజీగా ఉన్నారు
- మోడీ సర్కార్పై ఎక్స్ వేదికగా రాహుల్ విమర్శలు
- రాజ్యాంగంపై దాడి చేస్తోందని ధ్వజం
- ఎన్డీఏ సర్కార్ను కాపాడుకునే పనిలో మోడీ బిజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోమవారం 18వ పార్లమెంట్ సమావేశాలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రొటెం స్పీకర్ భర్తృహరి ఎంపీలచే ప్రమాణం చేయించారు. ఇక ఎంపీలంతా పార్లమెంట్ ఆవరణలో సందడి సందడిగా కనిపించారు. అయితే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా తొలిరోజే కేంద్రంపై ఆరోపణలు సంధించారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి 15 రోజుల్లోనే పరీక్షల్లో అవకతవకలు, ఉగ్రదాడులు వంటివి చోటుచేసుకున్నాయని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాత్రం తన ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారని విమర్శించారు. మోడీ సర్కార్.. రాజ్యాంగంపై దాడి చేస్తోందని ధ్వజమెత్తారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: AP Crime: బయటకు పొక్కిన గుట్టు.. వదిన, మరిది ఆత్మహత్య..
Also Read
రాజ్యాంగంపై దాడి ఆమోదయోగ్యం కాదని… రాజ్యాంగాన్ని ఏ శక్తి తాకలేదన్నారు. మేం దానిని కాపాడతామని చెప్పారు. ఈ విషయంలో మా సందేశం ప్రజల వద్దకు చేరుతోందని మీడియాతో రాహుల్ పేర్కొన్నారు. అనంతరం ‘ఎక్స్’ వేదికగా కూడా అదే సందేశాన్న ఇచ్చారు.‘‘అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే రైలు ప్రమాదాలు, కశ్మీర్లో ఉగ్రదాడులు, నీట్, యూజీసీ నెట్ పరీక్షల వివాదాలు, పాలు, గ్యాస్, టోల్ ధరల పెంపు, కార్చిచ్చులు, నీటి సంక్షోభం, వడదెబ్బ మరణాల వంటివి చోటుచేసుకున్నాయి’’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: 2.70 లక్షల ఇళ్లను మంజూరు చేయండి.. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్ వినతి
ఇంత జరుగుతున్నా.. ప్రధాన మంత్రి మాత్రం తన ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో బిజీగా ఉన్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. బలమైన ప్రతిపక్షం కేంద్ర సర్కారుపై ఒత్తిడిని కొనసాగిస్తుందని చెప్పారు. ప్రజల తరఫున గొంతుకను వినిపించడంతోపాటు జవాబుదారీతనం లేకుండా ప్రధాని తప్పించుకోవడాన్ని అడ్డుకుంటుందని తెలిపారు. ఇదిలా ఉంటే లోక్సభ తొలి సమావేశాల ప్రారంభం వేళ ఇండియా కూటమి నేతలు రాజ్యాంగ ప్రతిని చేతపట్టి లోక్సభ ఛాంబర్వైపు ప్రదర్శనగా వెళ్లారు.
ఇది కూడా చదవండి: Crime News: రూ.9వేల కోసం బావా బావమరిదిల మధ్య వివాదం.. ఒకరి హత్య, మరో ముగ్గురికి కత్తిపోట్లు
తాజావార్తలు
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!