Nifty: నిఫ్టీ 25 వేలు దాటుతుందా, ఇన్వెస్టర్లపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nifty: గత వారం బడ్జెట్ తర్వాత స్టాక్ మార్కెట్లో క్షీణత కనిపించింది. అయితే శుక్రవారం ఒక్క రోజులో కోలుకుంది. దీనికి ప్రధాన కారణాలు అమెరికా జీడీపీ గణాంకాలు. శుక్రవారం స్టాక్ మార్కెట్ లో కనిపించిన పెరుగుదల ఇన్వెస్టర్లు, నిపుణుల్లో ఆశలు రేకెత్తించింది. స్టాక్మార్కెట్లో ఏర్పడిన ఊపును వచ్చే వారం నిఫ్టీ 25,000 మార్కును దాటుతుందని నిపుణులు భావిస్తున్నారు. వచ్చే వారం దేశీయ మార్కెట్ దిశను పలు అంశాలు నిర్ణయిస్తాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్కు చెందిన వినోద్ నాయర్ మీడియా నివేదికలో తెలిపారు. త్రైమాసిక ఫలితాల డేటా, అమెరికా ఫెడ్, బీఓఈ ద్రవ్య విధానాలు, అమెరికా ఉద్యోగాల డేటా, యూరోజోన్ జీడీపీ డేటాతో సహా ప్రపంచ ఆర్థిక నవీకరణలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే, తదుపరి సూచికల కోసం గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్, ముడి చమురు ధరలలో హెచ్చుతగ్గులపై కూడా ఇన్వెస్టర్లు ఓ కన్నేసి ఉంచుతారని నిపుణులు అంటున్నారు.
ఈ వారం గెయిల్, అదానీ పవర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, భెల్, కోల్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ, టాటా స్టీల్, అదానీ ఎంటర్ప్రైజెస్, టాటా మోటార్స్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. దీని ప్రభావం స్టాక్ మార్కెట్పై కూడా కనిపిస్తోంది. కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఎలా వస్తాయనే దానిపై స్టాక్ మార్కెట్ పరిస్థితి ఆధారపడి ఉంటుంది. వారంలోని ఆగస్టు 1వ తేదీన, పీఎంఐ తయారీ డేటా కూడా స్టాక్ మార్కెట్ ముందు అందుబాటులో ఉంటుంది. దీని ప్రభావం మార్కెట్పై కూడా కనిపిస్తోంది.
Also Read
- King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- The Paradise: సెకండ్ సింగిల్.. "యేష నాగుల" లైవ్గా పాడిన అనిరుధ్.. మాస్ స్టెప్స్తో అదరగొట్టిన నాని.!
Read Also:CM Revanth Reddy: సంప్రదాయాలతో నిండిన తెలంగాణకు మీలో ప్రతి ఒక్కరికి స్వాగతం
జూలై 26 నాటికి ఈక్విటీలో ఎఫ్పిఐ పెట్టుబడులు రూ.33,688 కోట్లుగా ఉన్నాయి. ఇదే కాలంలో అప్పుల్లో ఎఫ్ పీఐ పెట్టుబడులు రూ.19222 కోట్లుగా ఉన్నాయని మీడియా నివేదికలో చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వీకే విజయకుమార్ తెలిపారు. ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటివరకు ఈక్విటీలో ఎఫ్పిఐ పెట్టుబడులు రూ.36,888 కోట్లు కాగా, డెట్లో రూ.87,846 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న మార్కెట్లలో భారతదేశం ఒకటి కాబట్టి, వాల్యుయేషన్లు పెరుగుతున్నప్పటికీ ఎఫ్ఐఐలు భారతదేశంలో అమ్మకాలను కొనసాగించలేవు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన పాలసీని జూలై 31న ప్రకటించనుంది. స్టాక్ మార్కెట్ ఈ ప్రకటనపై ఒక కన్ను వేసి ఉంచుతుంది. ఫెడ్ త్వరలో రేట్ల తగ్గింపును ప్రకటించవచ్చని మార్కెట్ విశ్వసిస్తోంది. మరోవైపు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కూడా అదే దిశలో చూసేందుకు ప్రయత్నిస్తోంది. ఫెడ్ తర్వాత, బీఐఐ కూడా తన రేట్లను ప్రకటిస్తుంది.
గ్లోబార్ మార్కెట్
గ్లోబల్ ఇన్వెస్టర్లు రాబోయే వారంలో అమెరికా మార్కెట్లోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీల ఆదాయాలు, ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశం, ఉపాధి డేటాపై ఒక కన్ను వేసి ఉంచుతారు. ఈ సూచికలన్నీ అమెరికన్ స్టాక్ మార్కెట్, ప్రపంచంలోని ఇతర ప్రధాన మార్కెట్ల పరిస్థితిని నిర్ణయించగలవు.
Read Also:Shamirpet Road Accident: శామీర్ పేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్..
తాజావార్తలు
-
Race 4: ‘రేస్’ రీబూట్లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్తో అల్టిమేట్ యాక్షన్ ?
-
King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
-
PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
-
DC OTT Release: రెండు ఓటీటీలలో లోకేష్ కనగరాజ్ ‘డీసీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?
-
Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్లో కొత్త సంక్షోభం..!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!