Viral News : భర్త చనిపోవడంతో అందరికీ పార్టీ ఇచ్చిన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆధునిక యుగంలో భార్యాభర్తల సంబంధాలుకూడా యాంత్రికంగా మారిపోతున్నాయి. ప్రతి చిన్న విషయానికి అపార్థాలు, అలకలు, కోపాలు పెరిగి దాంపత్యంలో ప్రేమభావన, ఆత్మీయత తగ్గపోతున్నాయి. ఇలాంటి పరిస్థితి సమాజంలో అవాంఛనీయ పరిణామాలకు దారితీస్తోంది. భార్యాభర్తలు మధ్య సంబంధాలు బలంగా ఉండేందుకు మానసిక శాస్త్రవేత్తలు అనేక మార్గాలు సూచిస్తున్నారు. అయితే.. ఇది ఒక రకమైతే.. భార్యభర్తల బంధానికి ఆదర్శంగా నిలుస్తున్నారు మరికొందరు. అలాంటి ఘటనే ఇది.. భర్త చనిపోయాక ఓ మహిళ భారీ పార్టీ చేసుకున్న ఘటన అమెరికాలోని అరిజోనాలో చోటుచేసుకుంది . దాదాపు 500 మంది అతిథులతో పార్టీని ఏర్పాటు చేయడం ద్వారా ఆమె సంతోషంగా తన భర్తకు వీడ్కోలు పలికింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అన్నింటికంటే, భర్త మరణంపై పార్టీకి బలమైన కారణం ఉంది. భార్య ఇలా ఎలా చేస్తుందో మీరు ఆశ్చర్యపోతారు.
కానీ మీరు అనుకున్నట్లుగా ఏమీ లేదు. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం, కేటీ యంగ్ అనే 40 ఏళ్ల మహిళ భర్త బ్రెయిన్ స్ట్రోక్తో మరణించాడు. ఆమెకు 12 నుంచి ఎనిమిదేళ్ల వయసున్న ముగ్గురు చిన్నారులు ఉన్నారు. నిజానికి భర్త మరణవార్త విని పిల్లలు దిగ్భ్రాంతి చెందకుండా ఉండేందుకు కేటీ తన దుఃఖంలోనూ ఓ భారీ పార్టీని పెట్టుకుంది. ‘పిల్లలు తమ తండ్రితో గడిపిన మంచి సమయాన్ని గుర్తుంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందుకే సంతాపానికి బదులు, నా భర్తతో గడిపిన అందమైన క్షణాలను గుర్తుంచుకోవడానికి పార్టీని ఏర్పాటు చేసుకున్నాను అని కేటీ పేర్కొంది.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!