Site icon NTV Telugu

UP: పెళ్లి రోజు నైట్ బెడ్‌రూంలో భర్త లోపాన్ని గుర్తించిన భార్య.. అత్తామామలకు విషయం చెప్పడంతో..

Wife

Wife

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో ఒక మహిళ పెళ్లి రోజు రాత్రి తన భర్తను చూసి ఆశ్చర్యపోయింది. తన భర్త నపుంసకుడు అని ఆరోపిస్తోంది. తన అత్తమామలు కట్నం కోసం నపుంసకుడితో తనకు వివాహం చేశారని ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని తన అత్తామామలకు చెబితే కొట్టి చంపడానికి ప్రయత్నించారని తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త, మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

READ MORE: AP Cabinet: రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ!

కాన్పూర్‌లోని రావత్‌పూర్‌కు చెందిన ఓ యువతి దాదాపు ఏడాది క్రితం 2024 మార్చిలో ఉన్నావ్‌కు చెందిన ఓ యువకుడిని వివాహం చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. తన భర్త నపుంసకుడు అని పెళ్లి రోజు రాత్రి తనకు తెలిసిందని ఆమె చెప్పింది. ఉదయం.. ఈ విషయాన్ని తన వదినకు చెబితే.. ఆమె జోక్‌గా తీసుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆమె మరోసారి తన బావ, వదినతో దీని గురించి చర్చించింది. దీంతో అత్తమామలు ఆమెను వేధించడం ప్రారంభించారు. వారికి అన్నీ తెలుసని చెప్పారు. వారు కట్నం కోసమే ఈ వివాహం చేశారు. తన భర్తకు చికిత్స చేయించుకోవడానికి అత్తమామలు తనను రెండు లక్షల రూపాయలు అడిగారని భార్య ఆరోపిస్తోంది. మొదట్లో సర్దుకుని కాపురం చేయాలని ఆ మహిళ భావించింది. ఈ విషయం తెలిసిన తన బావ ఆమెను వేధించడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని ఆమె అత్తమామలకు చెప్పడంతో ఆమెను కొట్టారు. ఆమెను ఉరి వేసి చంపడానికి కూడా ప్రయత్నించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

READ MORE: Vem Narender Reddy: రాష్ట్రం వాళ్ల సొత్తు అన్నట్లు కేసీఆర్ కుటుంబం వ్యవహరిస్తోంది!

Exit mobile version