Wife Kills Husband: మరో భర్త బలి.. కూల్ డ్రింక్లో గడ్డి మందు కలిపి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Kills Husband: దేశవ్యాప్తంగా వరుసగా భర్తలను చంపిన భార్యల కేసులు నమోదవుతున్నవేళ.. సరిగ్గా అలాంటి ఘటనే వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో వెలుగులోకి వచ్చింది. భర్తను కూల్గా చంపేందుకు కూల్ డ్రింక్లో గడ్డి మందు కలిపింది. ఆస్పత్రిలో రెండు రోజులపాటు అతడు పోరాడి చనిపోయాడు. ఈ ఘటన వర్ధన్నపేటలోని భవానికుంట తండాలో సంచలనం సృష్టించింది. అమాయకంగా కనిపించే ఆమె పేరు కాంతి. వరంగల్ జిల్లా వర్థన్నపేట సమీపంలోని భవానికుంట తండాకు చెందిన ఈమెకు జాటోత్ బాలాజీతో వివాహం జరిగింది. చాలా కాలం నుంచి వీరి కాపురం బాగానే సాగుతోంది. వీరికి ఓ కూతురు, కొడుకు ఉన్నారు.
Read Also:Digital Micro Finance: డిజిటల్ మైక్రోఫైనాన్స్.. 500 మంది రోడ్డుపాలు..!
Also Read
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ 'వాటర్ బాయ్'గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
- 2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
బాలాజీ.. వ్యవసాయ కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 8న దాటుడు పండుగను బాలాజీ కుటుంబసభ్యులతో కలిసి జరుపుకొన్నాడు. ఆ రోజు సాయంత్రం మద్యం తాగడానికి వెళ్తానంటూ బాలాజీ ఇంట్లోంచి బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. సరిగ్గా అదే సమయంలో భార్య కాంతి నైస్గా పలకరించింది. ప్రేమగా పలకరించి.. తాగేందుకు కూల్ డ్రింక్ ఇచ్చింది. అందులో కాలకూట విషం దాగుందనే విషయాన్ని బాలాజీ పసిగట్టలేకపోయాడు. భార్య ఇచ్చిన కూల్ డ్రింక్ తాగి అస్వస్థతకు గురయ్యాడు.
Read Also:Akash Prime: వైమానిక రక్షణలో మరో అస్త్రం.. 15,000 అడుగుల ఎత్తులో ‘ఆకాశ్ ప్రైమ్’ విజయవంతం..!
కానీ, ఆ సమయంలో భర్తను పట్టించుకోలేదు కాంతి. పైగా తనకు ఏం సంబంధం లేనట్లు వ్యవహరించింది. అంతే కాదు భర్తను ఆ స్థితిలోనే వదిలేసి తాళ్లకుంట తండాలో ఉంటున్న అక్క- బావ ఇంటికి వెళ్లింది. ఇరుగు పొరుగు వారు గుర్తించి బాలాజీని ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులపాటు అక్కడే చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. భార్యా కాంతి అతన్ని చంపిందంటూ బాలాజీ బంధువులు ఆరోపిస్తున్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని.. ఆ గొడవలు మనసులో పెట్టుకొనే కాంతి.. తన బావ దస్రూతో కలిసి ఈ ఘటనకు పాల్పడిందంటూ పోలీసులకు మృతుడి తండ్రి హరిచందర్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
-
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!