NTV Telugu Site icon

Wife Kidnapped: ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని భార్య కిడ్నాప్‌.. ఎక్కడంటే..

Kidnapped

Kidnapped

ఓ నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తానని ఒకరి నుంచి నాలుగు లక్షల రూపాయలను వసూలు చేశాడు ఓ ఘనుడు. సంవత్సరాలు గడుస్తున్న ఉద్యోగం ఇప్పించుకోవడంతో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అతడిపై బాధితుడు ఒత్తిడిని పెంచాడు. అప్పుడు ఇప్పుడు అంటూ మాట తిప్పేస్తున్నాడంతో విసిగిపోయిన బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి భార్యను కిడ్నాప్ చేసిన రాజ్యాంగ వెలుగులోకి వచ్చింది. తమ దగ్గర ఉద్యోగం కోసం తీసుకున్న డబ్బులు ఇస్తేనే తన భార్యని వదులుతామని వారు హెచ్చరించారు. ఈ సంఘటన మల్కాజ్ గిరి జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

School Timings Change: బడి గంట సమయం మారిందోచ్.. ఇకపై 9 గంటలకే స్కూల్‌..

ఈ సంఘటన శనివారం ఉదయం జరగాగా పోలీసుల జోక్యంతో సాయంత్రానికి సుఖాంతం అయింది. పోలీసులు తెలిపిన సమాచారం వరకు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన మాగంటి లక్ష్మణరావు తో హైదరాబాదు నగరానికి చెందిన ఎల్ జి పురానికి 19 ఏళ్ల క్రితం వివాహమైంది. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సుందర్ నగర్ లో నివసిస్తున్న వీరికి ఓ కూతురు, కొడుకు కూడా ఉన్నారు. ఇక లక్ష్మణరావు భార్య ఎలిజిబెత్ రాణి స్థానిక ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో స్టాఫ్ నర్స్ గా పని చేస్తుంది. ఇకపోతే భర్త లక్ష్మణరావు ఏడు సంవత్సరాల క్రితం ఓయూ ప్రాంతంలోని వెంకటేష్ అనే వ్యక్తికి ఉద్యోగం ఇస్తానని చెప్పి నాలుగు లక్షలు తీసుకున్నాడు.

Pakistan : పాకిస్తాన్‌లో ముస్లిమేతరులపై క్రైస్తవులపై గుంపు దాడులు.. ఇళ్లు, ఫ్యాక్టరీలకు నిప్పు

ఇకపోతే తాను మోసపోయానని గ్రహించిన వెంకటేష్ తన డబ్బుల కోసం ఒత్తిడి పెంచాడు. అయితే లక్ష్మణ్ రావు చేస్తున్న తందా తెలుసుకున్న ఓ ఉన్నత ఉద్యోగి అతనిని ఉద్యోగం నుంచి తొలగించగా., ఈ క్రమంలో ఇద్దరు మహిళలు కలిసి శనివారం ఉదయం ఎలిజబెత రాణిని ఆటోలో ఎక్కించుకొని బలవంతంగా వారి ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆ విషయాన్ని తన కొడుకు కు ఫోన్ చేసి చెప్పింది. అంతవరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఇక వెంకటేశ్ నివసిస్తున్న ప్రాంతాన్ని పోలీసులు కనిపెట్టి అక్కడ నుంచి బాధితురాలని విడిపించారు. అలాగే నిందితులను పోలీస్ స్టేషన్కు తీసుకుని వచ్చారు. నేను వర్గాలు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఇక సమస్య పరిష్కారం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.