NTV Telugu Site icon

Snakebite: పాముకాటుతో భార్య మృతి, షాక్‌తో గుండెపోటుతో భర్త మృతి..

Snakebite

Snakebite

యూపీ రాష్ట్రం ఘాజీపూర్‌లోని వీర్‌పూర్ గ్రామంలో శుక్రవారం విషాదం చేటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ మహిళ పాముకాటుతో మృతి చెందింది. మృతదేహాన్ని చూసిన కొంతసేపటికి భర్త కూడా షాక్‌కు గురై గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కుమారులు, కుమార్తెల రోదనలతో గ్రామస్తుల కంట కన్నీరు మున్నీరైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని భార్యాభర్తల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Read Also: Ismail Haniyeh: హమాస్ చీఫ్ కోసం రెండు నెలల ముందు నుంచే “మృత్యువు” వెయిటింగ్..

వీర్‌పూర్‌ గ్రామానికి చెందిన శాంతిదేవి(40) సాయంత్రం కుటుంబసభ్యులతో కలిసి రాత్రి భోజనం చేసి ఇంటి ప్రాంగణంలో మంచంపై నిద్రిస్తోంది. అర్థరాత్రి పాము ఆమె కాలుకి కాటేసింది. ఈ క్రమంలో.. నిద్రపోతున్న మహిళ వెంటనే లేచి కేకలు వేసింది. దీంతో.. వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని టార్చ్‌ లైట్ తో చుట్టు పక్కల చూశారు. అయితే వారికి పాము కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులు పామును చంపేశారు. అయితే.. మహిళ పరిస్థితి విషమిస్తుండటంతో ఆమ్వాకు చెందిన భూతవైద్యురాలు సతీ మాయి దగ్గరకు తీసుకువచ్చారు. ఆమె పాము కాటుకు వైద్యం చేసి పంపించింది. కాగా.. రాత్రి 2.30 గంటల ప్రాంతంలో కోలుకుని ఇంటికి వచ్చినా కొంతసేపటికి శాంతిదేవి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది.

Read Also: Bunny Vasu: కల్కి కలెక్షన్స్ పై బన్నీ వాసు క్లారిటీ

దీంతో.. చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆ మహిళను బీహార్ ప్రావిన్స్‌లోని ప్రతాప్‌గఢ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు బక్సర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు మహిళ చనిపోయినట్లు నిర్ధారించారు. మృతదేహంతో కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకునేలోపే మృతురాలి భర్త రాంప్రవేష్ షాక్‌కు గురై గుండెపోటుకు గురై మృతి చెందాడు. భార్యాభర్తల మృతితో కుటుంబ సభ్యుల్లో గందరగోళం నెలకొంది. కుమారులు, కూతుళ్ల రోదనలు చూసి గ్రామస్తులు సైతం కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భార్యాభర్తల మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.