Bihar: భార్య, ముగ్గురు పిల్లలు హత్య.. అనంతరం భర్త ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మోతీహరిలో భార్య, ముగ్గురు పిల్లలను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు భర్త ఇద్దుమియాన్. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు.. వారిని హత్య చేసి ఇంటి నుండి పారిపోయాడు. అయితే.. నిందితుడు ఇద్దును పట్టుకున్న వారికి మోతిహరి పోలీసులు రూ. 15,000 రివార్డు ప్రకటించారు. అందుకోసం నేరస్థుడిని పట్టుకునేందుకు పోలీసులు అన్ని చోట్లా గాలింపు చర్యలు చేపట్టారు.
కాగా.. ఇద్దు ఇంతకుముందు సీతాపూర్లో నివాసముంటున్న తన మొదటి భార్యకు సంబంధించి ఇద్దరు పిల్లలను రైలు నుండి తోసి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అయితే.. అందులో ఒక పిల్లవాడు మరణించగా.. మరొక పిల్లవాడు గాయాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత.. గత రాత్రి తన రెండో భార్య అఫ్రీనా ఖాతున్, ముగ్గురు పిల్లలను తన ఇంట్లోనే గొంతు కోసి హత్య చేశాడు.
Also Read
- India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
ఇద్దు మియాన్ కుటుంబం 4 సంవత్సరాల క్రితం గ్రామానికి వచ్చి స్థిరపడింది. ఇద్దు తన కుటుంబాన్ని ఎందుకు చంపాడనేది ఇంకా వివరాలు తెలియలేదు. హత్య చేసిన అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. అయితే.. మృతదేహాలను చూసిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసులు ఎఫ్ఎస్ఎల్, డాగ్ స్క్వాడ్లతో ఇంట్లో సోదాలు చేశారు. అంతకుముందు ఇద్దూ తన పిల్లలను రైలు నుంచి తోసేసిన ఘటనలో జైలు శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత జైలు నుంచి విడుదలై బయటికి వచ్చాక కుటుంబ సభ్యులందరినీ దారుణంగా హతమార్చి, ఆపై రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. కుటుంబ కలహాల కారణంగానే ఇద్దు ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య ఘటనపై వివరాలు ఇంకా తెలియరాలేదు.. విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!