Supreme Court: ‘ఎన్నికల ముందు కేజ్రీవాల్ను ఎందుకు అరెస్టు చేశారు?’.. ఈడీని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్పై వరుసగా రెండో రోజు విచారణ జరిగింది. కేజ్రీవాల్ను అరెస్టు చేసిన సమయంపై సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నలు లేవనెత్తింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ను అరెస్టు చేయడంపై సుప్రీంకోర్టు ఈడీని సమాధానం కోరింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేసిన సమయానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను కోరింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడాన్ని సవాలు చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది.
Read Also: Benefits of jaggery: రోజూ బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..?
Also Read
- CM Chandrababu: దమ్ముంటే అసెంబ్లీకి రండి.. వైసీపీకి సీఎం చంద్రబాబు సవాల్.. మెగా డీఎస్సీపై కీలక వ్యాఖ్యలు
- LPG: వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. ఆగస్టు 23 వరకు ఛాన్స్..
- BJP: యూపీ ఎన్నికల ముందు బీజేపీలో పదవుల జాతర.. పురందేశ్వరికి కీలక పదవి
- Deputy CM Pawan Kalyan: తొలి విమానం ల్యాండింగ్.. ఉత్తరాంధ్ర ప్రగతికి కొత్త అధ్యాయంగా అభివర్ణించిన పవన్
జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం కేజ్రీవాల్ను అరెస్టు చేసిన సమయానికి సంబంధించిన ప్రశ్నపై అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు నుండి ప్రతిస్పందనను కోరింది. జీవితం, స్వేచ్ఛ చాలా ముఖ్యమైనవి అని కూడా కోర్టు పేర్కొంది. మీరు దానిని కాదనలేరు అని.. బెంచ్ అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును పలు ఇతర ప్రశ్నలు వేసింది. మార్చి 21న అరెస్టు చేసిన తర్వాత, కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని తెలిసిందే. కేజ్రీవాల్ పిటిషన్పై సమాధానం చెప్పాలని ఏప్రిల్ 15న ఈడీకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. అరవింద్ కేజ్రీవాల్ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ, నేరాల ద్వారా వచ్చిన ఆదాయాల జాడ లేదని, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత నేరుగా ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు రుజువు లేదని కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ జరిగే మే 3న స్పందించాలని ఈడీని సుప్రీంకోర్టు కోరింది.
ఇప్పుడు రద్దు చేసిన ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మార్చి 21న కేజ్రీవాల్ను అరెస్టు చేసింది. ఏప్రిల్ 1 నుంచి తీహార్ జైలులో ఉన్న ఆయన మే 7 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు. ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టు ముఖ్యమంత్రి అరెస్టుపై చట్టవిరుద్ధంగా ఏమీ లేదని తేల్చిచెప్పింది.
తాజావార్తలు
-
CM Chandrababu: దమ్ముంటే అసెంబ్లీకి రండి.. వైసీపీకి సీఎం చంద్రబాబు సవాల్.. మెగా డీఎస్సీపై కీలక వ్యాఖ్యలు
-
LPG: వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. ఆగస్టు 23 వరకు ఛాన్స్..
-
BJP: యూపీ ఎన్నికల ముందు బీజేపీలో పదవుల జాతర.. పురందేశ్వరికి కీలక పదవి
-
Korean Kanakaraju: సైలెంటుగా 50 కోట్లు కొట్టిన కొరియన్ కనకరాజు
-
Suriya Vs Lokesh: లోకేష్ కనగరాజ్’కు సూర్య మార్క్ షాక్?
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!