Supreme Court: ‘ఎన్నికల ముందు కేజ్రీవాల్ను ఎందుకు అరెస్టు చేశారు?’.. ఈడీని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్పై వరుసగా రెండో రోజు విచారణ జరిగింది. కేజ్రీవాల్ను అరెస్టు చేసిన సమయంపై సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నలు లేవనెత్తింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ను అరెస్టు చేయడంపై సుప్రీంకోర్టు ఈడీని సమాధానం కోరింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేసిన సమయానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను కోరింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడాన్ని సవాలు చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది.
Read Also: Benefits of jaggery: రోజూ బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..?
Also Read
- Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
- India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
- Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్లో భూకంపం..
జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం కేజ్రీవాల్ను అరెస్టు చేసిన సమయానికి సంబంధించిన ప్రశ్నపై అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు నుండి ప్రతిస్పందనను కోరింది. జీవితం, స్వేచ్ఛ చాలా ముఖ్యమైనవి అని కూడా కోర్టు పేర్కొంది. మీరు దానిని కాదనలేరు అని.. బెంచ్ అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును పలు ఇతర ప్రశ్నలు వేసింది. మార్చి 21న అరెస్టు చేసిన తర్వాత, కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని తెలిసిందే. కేజ్రీవాల్ పిటిషన్పై సమాధానం చెప్పాలని ఏప్రిల్ 15న ఈడీకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. అరవింద్ కేజ్రీవాల్ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ, నేరాల ద్వారా వచ్చిన ఆదాయాల జాడ లేదని, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత నేరుగా ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు రుజువు లేదని కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ జరిగే మే 3న స్పందించాలని ఈడీని సుప్రీంకోర్టు కోరింది.
ఇప్పుడు రద్దు చేసిన ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మార్చి 21న కేజ్రీవాల్ను అరెస్టు చేసింది. ఏప్రిల్ 1 నుంచి తీహార్ జైలులో ఉన్న ఆయన మే 7 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు. ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టు ముఖ్యమంత్రి అరెస్టుపై చట్టవిరుద్ధంగా ఏమీ లేదని తేల్చిచెప్పింది.
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!