G20 Summit: జీ–20 వేదికకు దూరంగా ఈ ముగ్గురు అగ్రనేతలు.. కారణం ఏంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G20 Summit: 20 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా దక్షిణాఫ్రికాలో జి20 శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోహన్నెస్బర్గ్ చేరుకున్నారు. ఈ సదస్సులోని మూడు సెషన్లలో ఆయన పాల్గొంటారు. సమ్మిళిత అభివృద్ధి, వాతావరణ సంక్షోభం, కృత్రిమ మేధస్సు వంటి కీలక అంశాలపై ఆయన తన అభిప్రాయాలను ఈ వేదికపై పంచుకోనున్నారు. అయితే ప్రపంచంలోని ముగ్గురు అగ్ర నాయకులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కాలేదు. ప్రపంచంలోని ముగ్గురు అత్యంత శక్తివంతమైన నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశానికి ఎందుకు హాజరు కావడం లేదనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచం ముందుకు వచ్చింది. ఈ ప్రశ్నకు సమాధాన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అగ్రనాయకులు ఎందుకు రావడం లేదంటే..
Also Read
- Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
- West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
- August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
- Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
* అమెరికా G20 వ్యవస్థాపక సభ్యదేశం, తదుపరి అధ్యక్ష పదవిని నిర్వహిస్తోంది. అలాంటి సమయంలో ఈ సమావేశంలో అగ్రరాజ్యం పాల్గొనకపోవడం అనేది ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో G20 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కాబోనని స్పష్టంగా ప్రకటించారు. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి రైతులు అణచివేతకు గురవుతున్నారని ఆయన ఆరోపించారు. కొత్త భూ సంస్కరణల చట్టం తర్వాత దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి రైతులు జాతి వివక్షను ఎదుర్కొంటున్నారని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే శిఖరాగ్ర సమావేశానికి ఒక రోజు ముందు, ట్రంప్ తన వైఖరిని మార్చుకున్నారు. శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి అమెరికా తన తాత్కాలిక రాయబారి మార్క్ డి. డిల్లార్డ్ను పంపింది.
* రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా దక్షిణాఫ్రికాను సందర్శించలేదు. దీనికి కారణం చాలా స్పష్టంగా ఉంది. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) పుతిన్పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దక్షిణాఫ్రికా రోమ్ శాసనంలో సభ్యదేశం, అంటే ICC వారెంట్ను పాటించడం చట్టబద్ధంగా బాధ్యత. అంటే పుతిన్ G20కి హాజరై ఉంటే, దక్షిణాఫ్రికా చట్టబద్ధంగా ఆయనను అరెస్టు చేయాల్సి ఉండేది. అందుకే ఆయన దక్షిణాఫ్రికాలో జరిగిన 2023 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి కూడా హాజరు కాలేదు.
* ఈసారి చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ కూడా జి20 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడం లేదు. పలు నివేదికల ప్రకారం.. ఆయన అనారోగ్యంతో ఉన్నారని, అందుకే ఆయన బదులుగా చైనా ప్రధాన మంత్రి లీ కెకియాంగ్ను తన ప్రతినిధిగా పంపినట్లు కథనాలు వస్తున్నాయి. చైనా – దక్షిణాఫ్రికా మధ్య బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. జి జిన్పింగ్ 2023 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి దక్షిణాఫ్రికాను సందర్శించారు.
ఈ ముగ్గురి లోటు భారతదేశ ప్రాముఖ్యతను పెంచింది..
ఈ G20 శిఖరాగ్ర సమావేశానికి ట్రంప్, పుతిన్, జి జిన్పింగ్ వంటి ప్రముఖ నాయకులు రాకపోవడంతో భారతదేశ పాత్రను మరింత కీలకంగా మార్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచ సమస్యలపై ప్రధాని మోడీ తన అభిప్రాయాలను ఎలా వ్యక్తం చేస్తారో, అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతులను ఈ వేదికపై ఎలా ప్రకటిస్తారు అనే దానిపై ప్రపంచం ఆసక్తిగా గమనిస్తుంది. ఈ పర్యటనకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఈ శిఖరాగ్ర సమావేశం భారతదేశానికి ప్రత్యేకమైనదని అన్నారు.
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!