G20 Summit: జీ–20 వేదికకు దూరంగా ఈ ముగ్గురు అగ్రనేతలు.. కారణం ఏంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G20 Summit: 20 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా దక్షిణాఫ్రికాలో జి20 శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోహన్నెస్బర్గ్ చేరుకున్నారు. ఈ సదస్సులోని మూడు సెషన్లలో ఆయన పాల్గొంటారు. సమ్మిళిత అభివృద్ధి, వాతావరణ సంక్షోభం, కృత్రిమ మేధస్సు వంటి కీలక అంశాలపై ఆయన తన అభిప్రాయాలను ఈ వేదికపై పంచుకోనున్నారు. అయితే ప్రపంచంలోని ముగ్గురు అగ్ర నాయకులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కాలేదు. ప్రపంచంలోని ముగ్గురు అత్యంత శక్తివంతమైన నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశానికి ఎందుకు హాజరు కావడం లేదనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచం ముందుకు వచ్చింది. ఈ ప్రశ్నకు సమాధాన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అగ్రనాయకులు ఎందుకు రావడం లేదంటే..
Also Read
- Earthquake: ఇండోనేషియాలో వరసగా భారీ భూకంపాలు.. అసలు కారణాలేంటి.?
- IND Vs SL: మొదటి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోర్.. రెండో రోజు ముగిసిన ఆట..
- Visaka Airport: 40 ఏళ్ల నాటి అనుబంధం నేటితో ముగింపు.. భావోద్వేగంతో వీడ్కోలు..
- Sonipat Viral Incident: వీడియో కాల్లో తండ్రి అంత్యక్రియలు.. కర్మలకు కూడా రాని కుమార్తెలు
* అమెరికా G20 వ్యవస్థాపక సభ్యదేశం, తదుపరి అధ్యక్ష పదవిని నిర్వహిస్తోంది. అలాంటి సమయంలో ఈ సమావేశంలో అగ్రరాజ్యం పాల్గొనకపోవడం అనేది ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో G20 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కాబోనని స్పష్టంగా ప్రకటించారు. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి రైతులు అణచివేతకు గురవుతున్నారని ఆయన ఆరోపించారు. కొత్త భూ సంస్కరణల చట్టం తర్వాత దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి రైతులు జాతి వివక్షను ఎదుర్కొంటున్నారని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే శిఖరాగ్ర సమావేశానికి ఒక రోజు ముందు, ట్రంప్ తన వైఖరిని మార్చుకున్నారు. శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి అమెరికా తన తాత్కాలిక రాయబారి మార్క్ డి. డిల్లార్డ్ను పంపింది.
* రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా దక్షిణాఫ్రికాను సందర్శించలేదు. దీనికి కారణం చాలా స్పష్టంగా ఉంది. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) పుతిన్పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దక్షిణాఫ్రికా రోమ్ శాసనంలో సభ్యదేశం, అంటే ICC వారెంట్ను పాటించడం చట్టబద్ధంగా బాధ్యత. అంటే పుతిన్ G20కి హాజరై ఉంటే, దక్షిణాఫ్రికా చట్టబద్ధంగా ఆయనను అరెస్టు చేయాల్సి ఉండేది. అందుకే ఆయన దక్షిణాఫ్రికాలో జరిగిన 2023 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి కూడా హాజరు కాలేదు.
* ఈసారి చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ కూడా జి20 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడం లేదు. పలు నివేదికల ప్రకారం.. ఆయన అనారోగ్యంతో ఉన్నారని, అందుకే ఆయన బదులుగా చైనా ప్రధాన మంత్రి లీ కెకియాంగ్ను తన ప్రతినిధిగా పంపినట్లు కథనాలు వస్తున్నాయి. చైనా – దక్షిణాఫ్రికా మధ్య బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. జి జిన్పింగ్ 2023 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి దక్షిణాఫ్రికాను సందర్శించారు.
ఈ ముగ్గురి లోటు భారతదేశ ప్రాముఖ్యతను పెంచింది..
ఈ G20 శిఖరాగ్ర సమావేశానికి ట్రంప్, పుతిన్, జి జిన్పింగ్ వంటి ప్రముఖ నాయకులు రాకపోవడంతో భారతదేశ పాత్రను మరింత కీలకంగా మార్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచ సమస్యలపై ప్రధాని మోడీ తన అభిప్రాయాలను ఎలా వ్యక్తం చేస్తారో, అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతులను ఈ వేదికపై ఎలా ప్రకటిస్తారు అనే దానిపై ప్రపంచం ఆసక్తిగా గమనిస్తుంది. ఈ పర్యటనకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఈ శిఖరాగ్ర సమావేశం భారతదేశానికి ప్రత్యేకమైనదని అన్నారు.
తాజావార్తలు
-
Earthquake: ఇండోనేషియాలో వరసగా భారీ భూకంపాలు.. అసలు కారణాలేంటి.?
-
CM Revanth Reddy : సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాలు పెడతా.. కేసీఆర్ను కూడా తీసుకురండి
-
IND Vs SL: మొదటి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోర్.. రెండో రోజు ముగిసిన ఆట..
-
Visaka Airport: 40 ఏళ్ల నాటి అనుబంధం నేటితో ముగింపు.. భావోద్వేగంతో వీడ్కోలు..
-
CM Revanth Reddy : పరకాలకు సీఎం రేవంత్ వరాలు.. రూ.400 కోట్లకు పైగా అభివృద్ధి పనులు.!
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?