G20 Summit: జీ–20 వేదికకు దూరంగా ఈ ముగ్గురు అగ్రనేతలు.. కారణం ఏంటో తెలుసా?
G20 Summit: 20 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా దక్షిణాఫ్రికాలో జి20 శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోహన్నెస్బర్గ్ చేరుకున్నారు. ఈ సదస్సులోని మూడు సెషన్లలో ఆయన పాల్గొంటారు. సమ్మిళిత అభివృద్ధి, వాతావరణ సంక్షోభం, కృత్రిమ మేధస్సు వంటి కీలక అంశాలపై ఆయన తన అభిప్రాయాలను ఈ వేదికపై పంచుకోనున్నారు. అయితే ప్రపంచంలోని ముగ్గురు అగ్ర నాయకులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కాలేదు. ప్రపంచంలోని ముగ్గురు అత్యంత శక్తివంతమైన నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశానికి ఎందుకు హాజరు కావడం లేదనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచం ముందుకు వచ్చింది. ఈ ప్రశ్నకు సమాధాన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అగ్రనాయకులు ఎందుకు రావడం లేదంటే..
Also Read
- KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
- Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
- GT VS PBKS: గుజరాత్ బౌలర్ల ధాటికి పంజాబ్ విలవిల.. తక్కువ స్కోర్కే పరిమితమైన PBKS..
- Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
* అమెరికా G20 వ్యవస్థాపక సభ్యదేశం, తదుపరి అధ్యక్ష పదవిని నిర్వహిస్తోంది. అలాంటి సమయంలో ఈ సమావేశంలో అగ్రరాజ్యం పాల్గొనకపోవడం అనేది ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో G20 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కాబోనని స్పష్టంగా ప్రకటించారు. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి రైతులు అణచివేతకు గురవుతున్నారని ఆయన ఆరోపించారు. కొత్త భూ సంస్కరణల చట్టం తర్వాత దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి రైతులు జాతి వివక్షను ఎదుర్కొంటున్నారని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే శిఖరాగ్ర సమావేశానికి ఒక రోజు ముందు, ట్రంప్ తన వైఖరిని మార్చుకున్నారు. శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి అమెరికా తన తాత్కాలిక రాయబారి మార్క్ డి. డిల్లార్డ్ను పంపింది.
* రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా దక్షిణాఫ్రికాను సందర్శించలేదు. దీనికి కారణం చాలా స్పష్టంగా ఉంది. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) పుతిన్పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దక్షిణాఫ్రికా రోమ్ శాసనంలో సభ్యదేశం, అంటే ICC వారెంట్ను పాటించడం చట్టబద్ధంగా బాధ్యత. అంటే పుతిన్ G20కి హాజరై ఉంటే, దక్షిణాఫ్రికా చట్టబద్ధంగా ఆయనను అరెస్టు చేయాల్సి ఉండేది. అందుకే ఆయన దక్షిణాఫ్రికాలో జరిగిన 2023 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి కూడా హాజరు కాలేదు.
* ఈసారి చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ కూడా జి20 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడం లేదు. పలు నివేదికల ప్రకారం.. ఆయన అనారోగ్యంతో ఉన్నారని, అందుకే ఆయన బదులుగా చైనా ప్రధాన మంత్రి లీ కెకియాంగ్ను తన ప్రతినిధిగా పంపినట్లు కథనాలు వస్తున్నాయి. చైనా – దక్షిణాఫ్రికా మధ్య బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. జి జిన్పింగ్ 2023 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి దక్షిణాఫ్రికాను సందర్శించారు.
ఈ ముగ్గురి లోటు భారతదేశ ప్రాముఖ్యతను పెంచింది..
ఈ G20 శిఖరాగ్ర సమావేశానికి ట్రంప్, పుతిన్, జి జిన్పింగ్ వంటి ప్రముఖ నాయకులు రాకపోవడంతో భారతదేశ పాత్రను మరింత కీలకంగా మార్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచ సమస్యలపై ప్రధాని మోడీ తన అభిప్రాయాలను ఎలా వ్యక్తం చేస్తారో, అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతులను ఈ వేదికపై ఎలా ప్రకటిస్తారు అనే దానిపై ప్రపంచం ఆసక్తిగా గమనిస్తుంది. ఈ పర్యటనకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఈ శిఖరాగ్ర సమావేశం భారతదేశానికి ప్రత్యేకమైనదని అన్నారు.
తాజావార్తలు
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!