G20 Summit: జీ–20 వేదికకు దూరంగా ఈ ముగ్గురు అగ్రనేతలు.. కారణం ఏంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G20 Summit: 20 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా దక్షిణాఫ్రికాలో జి20 శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోహన్నెస్బర్గ్ చేరుకున్నారు. ఈ సదస్సులోని మూడు సెషన్లలో ఆయన పాల్గొంటారు. సమ్మిళిత అభివృద్ధి, వాతావరణ సంక్షోభం, కృత్రిమ మేధస్సు వంటి కీలక అంశాలపై ఆయన తన అభిప్రాయాలను ఈ వేదికపై పంచుకోనున్నారు. అయితే ప్రపంచంలోని ముగ్గురు అగ్ర నాయకులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కాలేదు. ప్రపంచంలోని ముగ్గురు అత్యంత శక్తివంతమైన నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశానికి ఎందుకు హాజరు కావడం లేదనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచం ముందుకు వచ్చింది. ఈ ప్రశ్నకు సమాధాన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అగ్రనాయకులు ఎందుకు రావడం లేదంటే..
Also Read
- Israel: ఇజ్రాయెల్పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
* అమెరికా G20 వ్యవస్థాపక సభ్యదేశం, తదుపరి అధ్యక్ష పదవిని నిర్వహిస్తోంది. అలాంటి సమయంలో ఈ సమావేశంలో అగ్రరాజ్యం పాల్గొనకపోవడం అనేది ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో G20 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కాబోనని స్పష్టంగా ప్రకటించారు. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి రైతులు అణచివేతకు గురవుతున్నారని ఆయన ఆరోపించారు. కొత్త భూ సంస్కరణల చట్టం తర్వాత దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి రైతులు జాతి వివక్షను ఎదుర్కొంటున్నారని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే శిఖరాగ్ర సమావేశానికి ఒక రోజు ముందు, ట్రంప్ తన వైఖరిని మార్చుకున్నారు. శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి అమెరికా తన తాత్కాలిక రాయబారి మార్క్ డి. డిల్లార్డ్ను పంపింది.
* రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా దక్షిణాఫ్రికాను సందర్శించలేదు. దీనికి కారణం చాలా స్పష్టంగా ఉంది. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) పుతిన్పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దక్షిణాఫ్రికా రోమ్ శాసనంలో సభ్యదేశం, అంటే ICC వారెంట్ను పాటించడం చట్టబద్ధంగా బాధ్యత. అంటే పుతిన్ G20కి హాజరై ఉంటే, దక్షిణాఫ్రికా చట్టబద్ధంగా ఆయనను అరెస్టు చేయాల్సి ఉండేది. అందుకే ఆయన దక్షిణాఫ్రికాలో జరిగిన 2023 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి కూడా హాజరు కాలేదు.
* ఈసారి చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ కూడా జి20 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడం లేదు. పలు నివేదికల ప్రకారం.. ఆయన అనారోగ్యంతో ఉన్నారని, అందుకే ఆయన బదులుగా చైనా ప్రధాన మంత్రి లీ కెకియాంగ్ను తన ప్రతినిధిగా పంపినట్లు కథనాలు వస్తున్నాయి. చైనా – దక్షిణాఫ్రికా మధ్య బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. జి జిన్పింగ్ 2023 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి దక్షిణాఫ్రికాను సందర్శించారు.
ఈ ముగ్గురి లోటు భారతదేశ ప్రాముఖ్యతను పెంచింది..
ఈ G20 శిఖరాగ్ర సమావేశానికి ట్రంప్, పుతిన్, జి జిన్పింగ్ వంటి ప్రముఖ నాయకులు రాకపోవడంతో భారతదేశ పాత్రను మరింత కీలకంగా మార్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచ సమస్యలపై ప్రధాని మోడీ తన అభిప్రాయాలను ఎలా వ్యక్తం చేస్తారో, అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతులను ఈ వేదికపై ఎలా ప్రకటిస్తారు అనే దానిపై ప్రపంచం ఆసక్తిగా గమనిస్తుంది. ఈ పర్యటనకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఈ శిఖరాగ్ర సమావేశం భారతదేశానికి ప్రత్యేకమైనదని అన్నారు.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!