Minister Amarnath: రజనీకాంత్ కు మేమెందుకు క్షమాపణ చెప్పాలి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల విమర్శలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ ముఖ్య అతిథిగా హాజరయిన సంగతి తెలిసిందే. ఆయన ఎన్టీఆర్ గురించి పనిలో పనిగా చంద్రబాబు విజనరీ గురించి మాట్లాడారు. ఈ వ్యవహారం కాస్త వివాదంగా మారింది. రజనీకాంత్ పై వైసీపీ నేతలు మండిపడ్డారు. రజనీకాంత్ ని చెడామడా తిట్టేశారు. రజనీకాంత్ కి వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి అమర్నాథ్ కామెంట్ చేశారు. అసలు రజనీకాంత్ కు మేమెందుకు క్షమాపణ చెప్పాలన్నారు.
Read Also: Shock To Tdp Leaders: అనుమతి లేకుండా స్టిక్కర్లు .. తాడపత్రిలో టీడీపీ నేతలకు చుక్కెదురు..
Also Read
- Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
- BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
- Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
చంద్రబాబు గురించి రజనీకాంత్ చెప్పిన అవాస్తవాలనే మేం వ్యతిరేకించామ్….సినిమాల్లో మాదిరిగా ఎవరినైనా ఏమైనా అంటాం అంటే సమాజంలో కౌంటర్ ఫేస్ చేయవలిసిందే…..దొంగ,హంతకుడు పెట్టిన సభకు వచ్చి పొగడ్తలు కురిపిస్తే చూస్తూ ఊరు కోవాలా…..? సినిమాల్లో మాత్రమే రజనీకాంత్ సూపర్ స్టార్…..ఒక సారి చెబితే వంద సార్లు చెప్పినట్టు ఫీల్ అవ్వడానికి రాజకీయాలు సినిమా కాదు….ఈ విషయం అర్థం అయ్యే పార్టీ విషయంలో రజనీకాంత్ వెనక్కి తగ్గారు అనుకుంటున్నా అన్నారు మంత్రి అమర్నాథ్. వెన్నుపోటులో కుట్రదారుడు చంద్రబాబు…. ఉత్తరాంధ్రను ఉత్తి ఆంధ్రాగా మార్చిన చరిత్ర టీడీపీదే అన్నారు.
ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా తీర్చిదిద్దడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యం అని స్పష్టం చేశారు. తాపీమెస్ట్రీ, శిలా ఫలకం ఉంటే ఎంత భారీ ప్రాజెక్ట్ అయిన కట్టేయగల ఘనుడు చంద్రబాబు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో 2025నాటికి తొలి ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అవుతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అందుబాటులో వచ్చే నాటికి విశాఖ-భోగాపురం మధ్య 6,500కోట్ల రూపాయలతో 6లైన్స్ రహదారి నిర్మాణం పూర్తి చేస్తాం. శిలాఫలకాలు వేసిన ప్రాజెక్టులు అన్నీ నేనే తెచ్చానని టీడీపీ, చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టులో ప్రధాన రన్ వే నిర్మాణం జరిగే భూమి లిటిగేషన్ లో ఉంటే క్లియర్ చేసింది మా ప్రభుత్వమే. పునరావాసం, భూ సమీకరణ, ఆర్ధిక వనరులు సమీకరబ జరగకుండానే చంద్రబాబు శంకుస్థాపన పేరుతో హడావిడి చేశారని మండిపడ్డారు మంత్రి అమర్నాథ్.
Read Also: Dasari Jayanthi: సినీ దిగ్గజాల సమక్షంలో దాసరి ఫిల్మ్ అవార్డ్స్
తాజావార్తలు
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?