Shock To Tdp Leaders: అనుమతి లేకుండా స్టిక్కర్లు .. తాడపత్రిలో టీడీపీ నేతలకు చుక్కెదురు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల సీజన్ వచ్చేస్తోంది. ప్రతి పార్టీ జనంలోకి వెళ్లాలని భావిస్తోంది. ఒకవైపు అధికార వైసీపీ నేతలు తమ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాల గురించి పీపుల్స్ సర్వే చేపడుతున్నారు. జగనన్నే మా భవిష్యత్ అంటూ ఇంటింటికీ, గడప గడపకూ తిరిగి ప్రచారం చేస్తున్నారు. జగన్ స్టిక్కర్లు అతికిస్తున్నారు. ఈ మెగా మాస్ సర్వేకి అనూహ్య స్పందన లభించింది. ఇటు టీడీపీ నేతలు కూడా ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజల దృష్టికి తెస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి అంటూ సభలు పెడుతున్నారు. జగన్ స్టిక్కర్లను చూసి అదే తరహాలో ప్రచారానికి తెరతీశారు టీడీపీ నేతలు. అయితే అక్కడే రివర్స్ కొట్టింది వ్యవహారం. తాడిపత్రిలో జగన్ స్టిక్కర్ల తరహాలో టీడీపీ నేతలు స్టిక్కర్ల యుద్ధానికి దిగారు. అయితే వారికి స్థానికులు, ఇంటి యజమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అనుమతి లేకుండా స్టిక్కర్లు అంటించడంపై స్థానికుల నుంచి టీడీపీకి వ్యతిరేకత వచ్చింది. స్థానికులు ఆగ్రహించడంతో టీడీపీ నేతలు వెనక్కి తగ్గక తప్పలేదు.
Read Also: Ambati Rambabu: టీడీపీ పుట్టుక నుంచి కాపు వ్యతిరేక పార్టీయే
Also Read
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్లైన్.. భారత్కు పెరిగిన కష్టాలు!
తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం పెద్దపేట గ్రామంలో టీడీపీ ఇంచార్జి జేసీ అశ్మిత్ రెడ్డి ‘ఇదేం కర్మ మన రాష్ట్రం కి’ ప్రచారం నిర్వహించారు. టీడీపీ క్యాడర్ ఇంటి యజమానుల అనుమతి లేకుండా స్టిక్కర్ను అతికించడంతో ఓ ఇంటి యజమాని ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీడీపీ నేతలు ఎవరిని అడిగి స్టిక్కర్లు అతికిస్తున్నారని యజమానులు మండిపడ్డారు. స్టిక్కర్లు అతికించవద్దని చెప్పినా జగన్ స్టిక్కర్ కింద అష్మిత్ రెడ్డి స్టిక్కర్ అతికించాడు టీడీపీ కార్యకర్త. దీంతో ఆగ్రహంతో టీడీపీ నేతలపై ఇంటి యజమానులు విరుచుకుపడ్డారు. దీంతో టీడీపీ కార్యకర్త బలవంతంగా ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే స్టిక్కర్ను తొలగించాల్సి వచ్చింది. తమ అనుమతి లేకుండా స్టిక్కర్లు ఎలా అతికిస్తారని, వెంటనే తీసేయాలని చెప్పడంతో టీడీపీ నేతలు ఆ స్టిక్కర్లు తీసేసి అక్కడినుంచి వెళ్ళిపోయారు.
Read Also: Bandi Sanjay: కేసీఆర్ ఇచ్చిన ఆ హామీ ఇంతవరకు అమలు కాకపోవడం సిగ్గుచేటు
తాజావార్తలు
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!