May 1st Labor Day history: మే 1న కార్మిక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? భారత్ లో ఎప్పుడు ప్రారంభమైంది?
- మే 1న కార్మిక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు
- భారత్ లో ఎప్పుడు ప్రారంభమైంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి సంవత్సరం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా మే డేగా జరుపుకుంటారు. ఈ రోజు కార్మికుల హక్కులను కాపాడటానికి, వారి సహకారాన్ని గౌరవించడానికి, శ్రామిక వర్గం యొక్క పోరాటాలను స్మరించడానికి ఒక ప్రత్యేక సందర్భంగా నిలుస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కార్మికుల జీవితాలను మార్చివేసింది. కానీ ఈ రోజును జరుపుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. దానికి మే 1వ తేదీని ఎందుకు ఎంచుకున్నారు. భారత్ లో కార్మిక దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
Also Read:Chandrababu: నేడు ఆత్మకూరులో చంద్రబాబు పర్యటన.. పింఛన్లు పంపిణీ
Also Read
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
కార్మిక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?
మే 1న కార్మిక దినోత్సవ వేడుకలు 19వ శతాబ్దంలో ప్రారంభమయ్యాయి. దీనికి ముందు, అమెరికా, యూరప్లోని కర్మాగారాల్లోని కార్మికులను 15-16 గంటలు పని చేయించేవారు. కానీ ఆ పనికి ప్రతిఫలంగా వారికి చాలా తక్కువ వేతనాలు చెల్లించేవారు. కార్మికులకు ఎటువంటి హక్కులు లేవు. వారికి ఎటువంటి సెలవులు ఉండేవి కావు. కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. దీనితో ఇబ్బంది పడిన వేలాది మంది కార్మికులు 1886 మే 1న అమెరికాలోని చికాగోలో 8 గంటల పని గంటలు డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు.
Also Read:Chandrababu: నేడు ఆత్మకూరులో చంద్రబాబు పర్యటన.. పింఛన్లు పంపిణీ
ఈ ఉద్యమం శాంతియుతంగా జరిగింది. కార్మికుల ఉద్యమాన్ని అణిచివేయడానికి, పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో చాలా మంది కార్మికులు మరణించారు. చాలా మంది గాయపడ్డారు. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా కార్మికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. దీని తరువాత, 1889లో పారిస్లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ సమావేశంలో, కార్మికుల పోరాటం, త్యాగాలను గుర్తుచేసుకోవడానికి మే 1ని “అంతర్జాతీయ కార్మిక దినోత్సవం”గా జరుపుకోవాలని నిర్ణయించారు.
భారతదేశంలో కార్మిక దినోత్సవం
భారతదేశంలో కార్మిక దినోత్సవ వేడుకలు 1923 మే 1న చెన్నైలో ప్రారంభమయ్యాయి. ఆ రోజున, మద్రాస్ హైకోర్టు ముందు కార్మికుల సమావేశం నిర్వహించారు. కార్మికుల హక్కుల గురించి గళాన్ని వినిపించింది. కార్మిక దినోత్సవం కేవలం సెలవుదినం కాదు. కార్మికుల సహకారాన్ని గౌరవించే రోజు. నేటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులు తమ న్యాయమైన వేతనాలు, సురక్షితమైన పని వాతావరణం, సామాజిక న్యాయం కోసం పోరాడాల్సి వస్తోంది.
తాజావార్తలు
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!