Diwali Festival 2025: దీపావళి పండగ రోజు దీపాలు ఎందుకు ముట్టిస్తారో తెలుసా..?
- భారతీయ సంస్కృతిలో దీపావళి పండుగకు ఒక విశిష్టత..
- చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి..
- దీపావళి నాడు లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి దీపాలు వెలిగించనున్న భక్తులు..
Diwali Festival 2025: భారతీయ సంస్కృతిలో దీపావళి పండుగకు ఒక విశిష్టత ఉంది. లోక కంటకుడైన నరకాసురుడిని శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా సంహరిస్తాడు. నరకుని పీడ విరగడైపోవడంతో సకల జనులు సంతోషంతో నరక చతుర్దశి రోజున దీపాలు వెలిగించి, బాణాసంచా కాల్చి సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఆనాటి నుంచి నరక చతుర్దశి, దీపావళి పండుగలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా కూడా ఈ దీపావళి పండుగను జరుపుకుంటారని అనేక పురాణ కథలు సైతం ఉన్నాయి. లక్ష్మీదేవి ఆవిర్భావం, పాండవులు అజ్ఞాతవాసం నుంచి రావడం, రావణుడి సంహారం తర్వాత రాముడు అయోధ్యకు విచ్చేయడం వంటివి అన్నీ కూడా దీపావళి పండుగతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి, దీపావళి ప్రధానంగా దీపాల పండుగ కావునా, ఈ రోజు దీపాన్ని లక్ష్మీదేవిగా భావించి పూజించడం సంప్రదాయంగా వస్తుంది.
Also Read
- Roti Pizza Recipe: మిగిలిపోయిన రోటీలతో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ పిజ్జా.. మార్కెట్లో దొరికే పిజ్జాని మర్చిపోతారంతే..!
- Doug Bracewell Banned: వివాదంలో మాజీ స్టార్ క్రికెటర్ డగ్ బ్రేస్వెల్.. రెండేళ్ల నిషేధం
- Iran: 2 నెలల యుద్ధం తర్వాత టెహ్రాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం
- Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
ఇక, నరక చతుర్దశి, దీపావళి రోజు చేసే దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ‘నరక’ అనే శబ్దానికి యమలోకం అనే అర్థం వస్తుంది, అందుకే నరక విముక్తికై యమధర్మరాజు అనుగ్రహం కోసం యమ దీపాలు పెట్టి, పూజించాలని వ్రత చూడామణిలో తెలిపారు. యమయా ధర్మరాజాయ మృత్యువే చాంతకాయచ’ అని పురాణాల్లో ఉన్నాయి. అంటే జనులందరికి నరక బాధలు లేకుండా చేయడమే దీపావళి యొక్క ఆంతర్యమని మీనింగ్. ఇక, దీపం వెలిగించే సమయంలో ఈ మంత్రాన్ని చదవాలి. అలాగే, దీపావళి రోజున లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు.. దీపాలు వెలిగించడం ద్వారా ఆమెను ఆహ్వానించి, తమ ఇళ్లను ధనం, ధాన్యం, సంతోషం నింపమని భక్తులు వేడుకుంటారు.
Read Also: IRCTC: దేవుడా.. తిని పడేసిన ఫుడ్ కంటెయినర్స్ ను కడిగి.. మళ్లీ ప్యాకింగ్..
దీపం జ్యోతి పరబ్రహ్మ!
దీపం జ్యోతి జనార్దనః
దీపోన హరతు మే పాపం
సంధ్యా దీపం నమోస్తుతే!
అనే శ్లోకాన్ని చదువుతూ దీపావళి నాటి సాయంత్రం దీపాలను ముట్టించాలి. అన్ని పండుగలు సాయంత్రానికి ముగిస్తే దీపావళి సంబరాలు మాత్రం సాయంత్రం తర్వాతే ప్రారంభం అవుతాయి.
తాజావార్తలు
-
Roti Pizza Recipe: మిగిలిపోయిన రోటీలతో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ పిజ్జా.. మార్కెట్లో దొరికే పిజ్జాని మర్చిపోతారంతే..!
-
Doug Bracewell Banned: వివాదంలో మాజీ స్టార్ క్రికెటర్ డగ్ బ్రేస్వెల్.. రెండేళ్ల నిషేధం
-
Wasim Jaffer: కోహ్లీతో పోల్చడమే బాబర్ ఆజాంకు శాపమైంది.. టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Iran: 2 నెలల యుద్ధం తర్వాత టెహ్రాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం
-
Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!