Diwali Festival 2025: దీపావళి పండగ రోజు దీపాలు ఎందుకు ముట్టిస్తారో తెలుసా..?
- భారతీయ సంస్కృతిలో దీపావళి పండుగకు ఒక విశిష్టత..
- చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి..
- దీపావళి నాడు లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి దీపాలు వెలిగించనున్న భక్తులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diwali Festival 2025: భారతీయ సంస్కృతిలో దీపావళి పండుగకు ఒక విశిష్టత ఉంది. లోక కంటకుడైన నరకాసురుడిని శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా సంహరిస్తాడు. నరకుని పీడ విరగడైపోవడంతో సకల జనులు సంతోషంతో నరక చతుర్దశి రోజున దీపాలు వెలిగించి, బాణాసంచా కాల్చి సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఆనాటి నుంచి నరక చతుర్దశి, దీపావళి పండుగలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా కూడా ఈ దీపావళి పండుగను జరుపుకుంటారని అనేక పురాణ కథలు సైతం ఉన్నాయి. లక్ష్మీదేవి ఆవిర్భావం, పాండవులు అజ్ఞాతవాసం నుంచి రావడం, రావణుడి సంహారం తర్వాత రాముడు అయోధ్యకు విచ్చేయడం వంటివి అన్నీ కూడా దీపావళి పండుగతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి, దీపావళి ప్రధానంగా దీపాల పండుగ కావునా, ఈ రోజు దీపాన్ని లక్ష్మీదేవిగా భావించి పూజించడం సంప్రదాయంగా వస్తుంది.
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
ఇక, నరక చతుర్దశి, దీపావళి రోజు చేసే దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ‘నరక’ అనే శబ్దానికి యమలోకం అనే అర్థం వస్తుంది, అందుకే నరక విముక్తికై యమధర్మరాజు అనుగ్రహం కోసం యమ దీపాలు పెట్టి, పూజించాలని వ్రత చూడామణిలో తెలిపారు. యమయా ధర్మరాజాయ మృత్యువే చాంతకాయచ’ అని పురాణాల్లో ఉన్నాయి. అంటే జనులందరికి నరక బాధలు లేకుండా చేయడమే దీపావళి యొక్క ఆంతర్యమని మీనింగ్. ఇక, దీపం వెలిగించే సమయంలో ఈ మంత్రాన్ని చదవాలి. అలాగే, దీపావళి రోజున లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు.. దీపాలు వెలిగించడం ద్వారా ఆమెను ఆహ్వానించి, తమ ఇళ్లను ధనం, ధాన్యం, సంతోషం నింపమని భక్తులు వేడుకుంటారు.
Read Also: IRCTC: దేవుడా.. తిని పడేసిన ఫుడ్ కంటెయినర్స్ ను కడిగి.. మళ్లీ ప్యాకింగ్..
దీపం జ్యోతి పరబ్రహ్మ!
దీపం జ్యోతి జనార్దనః
దీపోన హరతు మే పాపం
సంధ్యా దీపం నమోస్తుతే!
అనే శ్లోకాన్ని చదువుతూ దీపావళి నాటి సాయంత్రం దీపాలను ముట్టించాలి. అన్ని పండుగలు సాయంత్రానికి ముగిస్తే దీపావళి సంబరాలు మాత్రం సాయంత్రం తర్వాతే ప్రారంభం అవుతాయి.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!