Manipur Violence: మణిపూర్లో హింసాత్మక ఘటనలు ఎందుకు చోటుచేసుకున్నాయి. సమస్యలేంటీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Violence: మణిపూర్లో హింసాత్మక ఘటనలతో అడ్డుడికిపోతుంది. అసలు అలాంటి ఘటనలు ఎందుకు చోటుచేసుకున్నాయి. అనే కారణాలు, పరిస్థితులపై మాజీ అసోం డీజీపీ, అసోం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పల్లబ్ భట్టాచార్య చర్చించారు. మైతేయిలకు ఎస్టీ హోదా ఇవ్వరాదని ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ మణిపూర్.. ట్రైబల్ సంఘీభావ ర్యాలీ చేపట్టిన తర్వాత ఆ రాష్ట్రంలో హింస మొదలైంది. స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి మణిపూర్ లో ఇప్పటి వరకు ఎన్నో పొరపాట్లు, సమస్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
Read Also: Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదానికి అసలు కారణం ఇదే..!
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
అందుకు గల కారణాలు, తప్పులు నాలుగు ఉన్నాయి. అందులో మొదటిది.. బ్రిటీష్ ఇండియాలో మణిపూర్ రాష్ట్ర చేరిక జరిగింది. 1930వ దశకం మలి సంవత్సరాల్లో మణిపూర్ సంస్థానం బర్మాలో కాకుండా బ్రిటీష్ పాలిత భారత్లో చేరాలని ప్రతిపాదించింది. 1935లో స్వాతంత్ర్య సమరాన్ని బలహీనపరచడానికి బ్రిటీషర్లు భారత్ నుంచి బర్మాను వేరుచేశారు. 1947 ఆగస్టు 11న చేరికపై మహారాజా బుధాచంద్ర సంతకం చేయగా.. 1949 సెప్టెంబర్ 21వ తేదీన విలీన ఒప్పందంపై సంతకం పెట్టారు. ఈ నిర్ణయాన్ని కొన్ని మణిపూర్ గ్రూపులు వ్యతిరేకించాయి. నిర్ణయంపై ఏకాభిప్రాయం రాకముందే విలీనం చేశారని మైతేయి తిరుగుబాటు చేశారు.
Read Also: Tollywood: ఒడిశా రైలు ప్రమాదం.. తల్లడిల్లుతున్న టాలీవుడ్
రెండో సమస్య.. మణిపూర్ జనాభా 2011 లెక్కల ప్రకారం, 41.39 శాతం హిందువులు, 41.29 శాతం క్రిస్టియన్లు, 8.39 శాతం ముస్లింలు, మిగిలినవారు జైనులు, బుద్ధులు మొదలగువారు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 28.6 లక్షల జనాభా ఉండగా.. ట్రైబల్ జనాభా 11.67 లక్షల మంది ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది క్రిస్టియన్లే ఉన్నారు. మూడో సమస్య ఏంటంటే.. 53 శాతం జనాభా కేవలం లోయలో నివసిస్తున్నారు. వీరికి 40 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే 90 శాతం కొండ ప్రాంతాల ప్రజలను కేవలం 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 53 శాతం జనాభా గల మైతేయీలు ఆ లోయకే పరిమితం అయ్యారు. ఇది ట్రైబల్ కమ్యూనిటీలు నాగాలు, కుకీల మధ్య ఘర్షణాపూరిత వాతావరణానికి కారణంగా మారింది.
Read Also: Hero Bike: హీరో బైక్ కి USB ఛార్జింగ్…ట్యూబ్లెస్ టైర్లు.. దీని ధర తెలిస్తే షాకే..!
ఇక నాలుగో సమస్య విషయానికొస్తే.. మణిపూర్ రీజియన్. దీనికి ఒక వైపు మిజోరం, అసోం, నాగాల్యాండ్లు ఉండగా.. మరో వైపు 352 కిలోమీటర్ల చొప్పున మయన్మార్ సరిహద్దు ఉంటుంది. ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్ ద్వారా 16 కిలోమీటర్ల మేరకు సరిహద్దులో నివసించే వారు ఎదుటి దేశంలో వీసా లేకుండా వెళ్లడానికి ఆస్కారం ఉన్నది. ఈ సరిహద్దు గుండా కుకీలు చొరబడుతున్నారని, వారి జనాభా పెంచుకుని ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్నారని మైతేయీల వాదన. ఇదిలా ఉండగా మైతేయీల ఎస్టీ డిమాడ్ను పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు రాష్ట్రానికి ఇచ్చిన ఆదేశాలను జారీ చేసింది. దీంతో మైతేయీలు తమ వాటానూ భుక్తం చేస్తారని, వారి పలుకుబడిపై నమ్మకంతో ట్రైబల్స్ భావించారు. కానీ, అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల్లో అధికంగా కుకీలే ఉన్నారని మైతేయీలు తిరిగి వాదిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల కారణంగా అక్కడ హింస చెలరేగినప్పుడు కేంద్రం వెంటనే కట్టడి చర్యలు తీసుకోలేదు. కానీ, ఇప్పుడు వేగంగా పరిస్థితులు అదుపులోకి తెచ్చింది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?