Ratan Tata: వృద్ధాప్యంలో రతన్ టాటాకు అండగా నిలిచిన యువకుడు ఎవరు?
- వృద్ధాప్యంలో రతన్ టాటాకు అండగా నిలిచిన యువకుడు
- ఇంతకీ ఆయన ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాటా సన్స్కు అత్యంత విజయవంతమైన ఛైర్మన్గా పేరున్న రతన్ టాటా ఇప్పుడు మన మధ్య లేరు. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో గత రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన వానప్రస్థ ఆశ్రమంలో తన జీవితాన్ని గడుపుతున్నప్పుడు.. ఆయనతో ఒక సన్నని యువకుడు తరచుగా కనిపించేవారు. రతన్ టాటా తరచుగా సంప్రదించే ఆ యువకుడి గురించి పూర్తిగా తెలుసుకుందాం..
యువకుడి పేరు శంతను నాయుడు..
మనం మాట్లాడుకుంటున్న సన్నటి యువకుడి పేరు శంతను నాయుడు. రతన్ టాటాకు సహాయకుడిగా ఉండేవారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు 31 ఏళ్ల శంతను నాయుడుతో ప్రత్యేక సంబంధం ఉంది. శంతను నాయుడు టాటా ట్రస్ట్ డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేశారు. ఆయన ప్రతిభకు రతన్ టాటా కూడా ముగ్ధుడయ్యారు. అందుకే రతన్ టాటా స్వయంగా ఫోన్ చేసి నువ్వు నాకు అసిస్టెంట్ గా ఉండాలని కోరారు. దీని తరువాత 2022 సంవత్సరంలో రతన్ టాటా కార్యాలయంలో జీఎంగా ఎంపికయ్యారు. శంతను నాయుడు ముంబై నివాసి. మహారాష్ట్రలోని పూణేలో 1993లో జన్మించారు. స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టేందుకు శంతను రతన్ టాటాకు వ్యాపార చిట్కాలు ఇచ్చేవారు. శంతను నాయుడు వ్యాపారవేత్తగా, ఇంజనీర్గా, జూనియర్ అసిస్టెంట్గా, డీజీఎమ్గా , సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా, రచయితగా, వ్యాపారవేత్తగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. అందుకే చివరి రోజుల్లో రతన్ టాటాకు తోడుగా నిలిచారు.
Also Read
2017 నుంచి టాటా ట్రస్ట్లో పనిచేస్తున్న శంతను..
లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. శంతను జూన్ 2017 నుంచి టాటా ట్రస్ట్లో పనిచేస్తున్నారు. ఇది కాకుండా, నాయుడు టాటా ఎల్క్సీలో డిజైన్ ఇంజనీర్గా కూడా పనిచేశారు. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఒకసారి ఆయన వీధి కుక్కల కోసం రిఫ్లెక్టర్లతో చేసిన డాగ్ కాలర్ గురించి ఫేస్బుక్లో రాశారు. ఈ పోస్ట్ చదివిన తర్వాత రతన్ టాటా ఆయన్ని సమావేశానికి పిలిచారు. దీని తరువాత, అతను మే 2022 నుంచి రతన్ టాటాతో కలిసి పనిచేయడం ప్రారంభించారు.
జంతువులపై ప్రేమే కారణమైంది..
రతన్ టాటాతో శంతను నాయుడుకు ఉన్న స్నేహం జంతువుల పట్ల వారి భాగస్వామ్య ప్రేమ నుంచి వికసించింది. 2014లో నాయుడు రాత్రిపూట కార్లు ఢీకొనకుండా వీధికుక్కలను రక్షించడానికి రిఫ్లెక్టివ్ కాలర్లను తయారు చేసినప్పుడు ఇద్దరూ కలుసుకున్నారు. ఆయన చొరవకు ముగ్ధుడై, టాటా సన్స్ గౌరవ చైర్మన్ తన వద్ద పని చేయమని నాయుడుని ఆహ్వానించారు.
నికర విలువ ఎంత?
శంతను అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో చదివారు. అక్కడి నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. నిజానికి, శంతను నాయుడు టాటా గ్రూప్లో పని చేస్తున్న ఐదవ తరం. తన కుటుంబంలోని నాలుగు తరాలు కూడా టాటాగ్రూప్ లో పనిచేశారు. అమెరికా నుంచి చదువు పూర్తయ్యాక టాటా గ్రూప్లో పనిచేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన ఉద్యోగంతో పాటు, గుడ్ఫెలోస్లో గౌరవ సభ్యుడు కూడా. ఇది సీనియర్ సిటిజన్లకు సమగ్ర మద్దతును అందిస్తుంది. ఈ కంపెనీ విలువ దాదాపు రూ.5 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Harish Rao : 22A భూములపై హరీశ్ రావు ఫైర్.. ‘కమీషన్ల కోసమే దోపిడీ!’
-
Kaka vs House No 47: పాత ఫార్ములానే రిపీట్ చేస్తున్నారా? చిరు, వెంకీ సినిమాలపై ఆసక్తికర చర్చ!
-
Dhanush: “నాకు యాక్టింగ్ నేర్పిస్తావా?”.. ఇరుముడి పాపతో ధనుష్ వీడియో కాల్ వైరల్
-
Brain Eating Amoeba: మెదడును తినేసిన జీవి.. 8ఏళ్ల చిన్నారి కథలో ఊహించని విషాదం
-
Mojtaba Khamenei: మోజ్తబా ఖమేనీ అరుదైన వీడియో విడుదల.. అనుమానాల వేళ వైరల్
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!