WHO: కొవిడ్ విషయంలో డబ్ల్యూహెచ్వో గుడ్న్యూస్.. ఏమిటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WHO: కరోనా మహమ్మారి కోరల్లో నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయనే వార్తలు భయాందోళనలను కలిగిస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ-డబ్ల్యూహెచ్వో గుడ్న్యూస్ చెప్పింది. కొవిడ్ను ఎదుర్కొనేందుకు ప్రపంచ జనాభాలో 90 శాతం మందిలో కొంత మేర రోగ నిరోధక శక్తి కలిగి ఉన్నారని అంచనా వేసింది. వ్యాక్సినేషన్ కారణంగా ప్రపంచంలోని 90 శాతం మందిలో కొవిడ్ను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి వచ్చినట్లు డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ చెప్పారు. కాకపోతే కొత్త వేరియంట్లు ఉద్భవించే ప్రమాదం లేకపోలేదని ఆయన హెచ్చరించారు.
కొవిడ్ మహమ్మారి ఎమర్జెన్సీ దశ ముగింపునకు వచ్చిందని.. కానీ వైరస్ ఇంకా తుడిచిపెట్టుకుపోలేదని టెడ్రోస్ హెచ్చరించారు. వైరస్పై నిఘా, పరీక్షల నిర్వహణ, వ్యాక్సినేషన్ ప్రక్రియలో కొనసాగుతున్న లోపాలతో కొత్త వేరియంట్ల కారణంగా మరణాలు పెరిగేందుకు కారణమవుతున్నట్లు హెచ్చరించారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా ఏడాది తర్వాత కూడా కొవిడ్ నుంచి రక్షణ లభిస్తున్నట్లు ఓ పరిశోధన పేర్కొంది. దాని ఫలితంగా తరుచుగా బూస్టర్ డోస్లు తీసుకోవాల్సిన అవసరాన్ని తగ్గించినట్లు తెలిపింది. కొత్త వేరియంట్గా ఒమిక్రాన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించినప్పటి నుంచి గత వారాంతంలో ఒక సంవత్సరం గడిచిందని టెడ్రోస్ పేర్కొన్నారు. అప్పటి నుండి ఇది ప్రపంచమంతటా వ్యాపించింది. దాని ముందున్న డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ గణనీయంగా వ్యాప్తి చెందగలదని రుజువు చేసింది.
Also Read
- కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
- రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
- Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
- Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
School Teacher Suspend: భారత్ జోడో యాత్రలో పాల్గొన్నందుకు స్కూల్ టీచర్ సస్పెండ్
కొవిడ్ బూస్టర్లపై అధ్యయనంలో ఫైజర్/బయోఎన్టెక్, మోడెర్నా ద్వారా వచ్చిన కొత్త వ్యాక్సిన్లు మెరుగైన రక్షణను అందించే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్వో వెల్లడించింది. 360,000 కంటే ఎక్కువ మంది వ్యక్తులపై జరిపిన అధ్యయనంలో ఈ మేరకు ప్రకటించింది. సెప్టెంబరులో యూఎస్లో ప్రవేశపెట్టినప్పటి నుంచి కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ బీఏ 4/5 స్ట్రెయిన్లు సోకిన 18-49 సంవత్సరాల వయస్సు గల యువకులకు ఎక్కువ ప్రయోజనాన్ని కలిగించాయి. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా ఏడాది తర్వాత కూడా కోవిడ్ నుంచి రక్షణ లభిస్తున్నట్లు ఓ పరిశోధన పేర్కొంది. దాని ఫలితంగా తరుచుగా బూస్టర్ డోస్లు తీసుకోవాల్సిన అవసరాన్ని తగ్గించినట్లు తెలిపింది.
తాజావార్తలు
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
Ananya Panday: లైగర్ బ్యూటీకి కష్టకాలం.. రెండేళ్ల ప్రేమకు గుడ్బై!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
ట్రెండింగ్
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!