IPL Auction 2025: ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు ఎవరంటే..?
- ఐపీఎల్ వేలం చరిత్రలో కోట్లు కొల్లగొట్టిన ఆటగాళ్లు
- గత వేలం కంటే.. ఈసారి వేలంలో రికార్డులు బద్దలు
- మెగా వేలంలో భారత్ ఆటగాళ్లకు రికార్డు ధర
- టాప్ 10 ఆటగాళ్లలో ఐదుగురు ఇండియన్ ప్లేయర్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ వేలం చరిత్రలో కొంత మంది ఆటగాళ్లు కోట్లు కొల్లగొట్టారు. గత వేలం కంటే.. ఈసారి వేలంలో రికార్డులు బద్దలైంది. ఐపీఎల్లో ఇండియన్ బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తుండటంతో.. తాజాగా జరిగిన మెగా వేలంలో భారత్ ఆటగాళ్లు రికార్డు ధర పలికారు. ఐపీఎల్ 2024 సీజన్ వరకు టాప్ 10 ఆటగాళ్లలో కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే భారతీయులు ఉండేది. కానీ ఇప్పుడు ఈ జాబితాలో మరో ఐదుగురు ఆటగాళ్లు చేరారు. అంతే కాకుండా.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో భారత్ ఆటగాళ్లే ఉన్నారు.
Fire Accident : జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం… పరిసర ప్రాంతాల్లో దట్టంగా కమ్ముకున్న పొగ
Also Read
- Nepal Floods: నేపాల్లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
- భారత్లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
- Best Mileage Bikes: లీటర్కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
- YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో రిషబ్ పంత్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత.. వేలంలో రూ.25 కోట్ల బిడ్ దాటిన మొదటి వ్యక్తి శ్రేయాస్ అయ్యర్ ఉన్నాడు. ఈ సీజన్లో అతడిని పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో.. శ్రేయాస్ రెండో స్థానంలో ఉన్నాడు. గత సీజన్లో రూ. 24.75 కోట్లకు అమ్ముడైన మిచెల్ స్టార్క్.. 2024 వరకు ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఉన్నాడు. ప్రస్తుతం అతను మూడవ స్థానంలో ఉన్నాడు.
IPL Auction 2025: మెగా వేలం తర్వాత ఏ టీమ్ బలంగా, బలహీనంగా ఉంది..!
ఈ జాబితాలో నాలుగో పేరు వెంకటేష్ అయ్యర్. ఈ భారత ఆల్రౌండర్ను కోల్కతా నైట్ రైడర్స్ ఈసారి రూ. 23.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఐదవ స్థానంలో పాట్ కమ్మిన్స్ ఉన్నాడు. గత సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేసింది. 2023లో పంజాబ్ కింగ్స్ రూ. 18.5 కోట్లకు కొనుగోలు చేసిన సామ్ కుర్రాన్ ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ ఇద్దరు ఆటగాళ్లను రూ.18-18 కోట్లకు కొనుగోలు చేసింది. వారిలో ఒకరు అర్ష్దీప్ సింగ్ కాగా.. మరొకరు యుజ్వేంద్ర చాహల్ వరుసగా 7, 8 స్థానాల్లో ఉన్నారు. కామెరాన్ గ్రీన్ రూ. 17.50 కోట్లతో 9వ స్థానంలో ఉన్నాడు. చివరగా బెన్ స్టోక్స్ ఉన్నాడు. అతనిని 2023లో రూ. 16.25 కోట్లకుచెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.
ఐపీఎల్ వేలంలో విక్రయించబడిన అత్యంత ఖరీదైన ఆటగాళ్ల జాబితా:
1. రిషబ్ పంత్ – రూ. 27 కోట్లు – లక్నో సూపర్ జెయింట్స్ – 2025
2. శ్రేయాస్ అయ్యర్ – 26.75 కోట్లు – పంజాబ్ కింగ్స్ – 2025
3. మిచెల్ స్టార్క్ – రూ. 24.75 కోట్లు – కోల్కతా నైట్ రైడర్స్ – 2024
4. వెంకటేష్ అయ్యర్ – రూ 23.75 కోట్లు – కోల్కతా నైట్ రైడర్స్ – 2025
5. పాట్ కమిన్స్ – 20.50 కోట్లు – సన్రైజర్స్ హైదరాబాద్ – 2024
6. సామ్ కర్రాన్ – 18.50 కోట్లు – పంజాబ్ కింగ్స్ – 2023
7. అర్ష్దీప్ సింగ్ – 18 కోట్లు – పంజాబ్ కింగ్స్ – 2025
8. యుజ్వేంద్ర చాహల్ – 18 కోట్లు – పంజాబ్ కింగ్స్ – 2025
9. కామెరాన్ గ్రీన్ – రూ. 17.50 కోట్లు – ముంబై ఇండియన్స్ – 2023
10. బెన్ స్టోక్స్ – 16.25 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్ – 2023
తాజావార్తలు
-
King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
-
Nepal Floods: నేపాల్లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
-
Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
-
Apple Mac mini M6: ఆపిల్ కొత్త Mac mini M6, Mac Studio M5 Max, M5 Ultra విడుదల.. 2nm చిప్, AI పవర్! ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!