* IPL 2026: నేడు కోల్కతా వర్సెస్ ముంబై… కోల్కతా వేదికగా రాత్రి 7.30కి మ్యాచ్
* ఇవాళ దేశవ్యాప్త కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ బంద్.. AIOCD పిలుపు మేరకు బంద్ లో మెడికల్ షాపుల అసోసియేషన్లు… దాదాపు 12.5 లక్షల మెడికల్ షాపుల బంద్.. ఆన్ లైన్ మందుల అమ్మకాలను నిలిపివేయాలని డిమాండ్.. ఆన్ లైన్ మందుల అమ్మకాలలో భారీ డిస్కౌంట్ లు వలన నష్టపోతున్నాం .. కోవిడ్ లో ఇచ్చిన జీఓ ను రద్దు చేయాలని డిమాండ్
* నేడు సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన.. ఇవాళ ఉదయం 10 గంటలకు కుప్పం రానున్న సీఎం చంద్రబాబు దంపతులు.. తిరుపతి గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం దంపతులు..
* కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.. ఉదయం 8 గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరనున్న సీఎం దంపతులు.. ఉదయం 10 గంటలకు శాంతిపురం మండలం తుమ్మిసి హెలిప్యాడ్కు చేరుకుని రోడ్డు మార్గాన కడపల్లెకు ప్రయాణం.. 10.45 గంటలకు గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొనున్న సీఎం కుటుంబ సభ్యులు.. 11.15 గంటలకు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు దంపతులు.. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు బెంగళూరుకు విమానాశ్రయానికి పయనం
* ఢిల్లీ పర్యటనలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఇవాళ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు పలువురు కేంద్రమంత్రులను కలవనున్న డిప్యూటీ సీఎం
* తిరుమల: ఇవాళ ముగియనున్న ఆన్ లైన్ లక్కీడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్ల రిజిస్ట్రేషన్.. మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిఫ్ విధానంలో ఆగస్టు నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల చేయనున్న టీటీడీ
* తూర్పుగోదావరి: రాజమండ్రి ప్రత్యేక న్యాయస్థానంలో నేటి నుంచి దళిత యువకుడు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షుల విచారణ ప్రారంభం.. ఎమ్మెల్సీ అనంత బాబును పీటీ వారెంట్ పై కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు .. సాక్షులను బెదిరించినందుకు బెయిల్ రద్దు కావడంతో గత నెల 25 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు
* నంద్యాల: నేడు శ్రీశైలం మండలం సున్నిపెంటలో పలు సీసీ రోడ్లను ప్రారంభించనున్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి
* తిరుమల: వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి వెలుపల క్యూలైన్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 84,315 మంది భక్తులు .. తలనీలాలు సమర్పించిన 43,033 మంది భక్తులు .. హుండీ ఆదాయం రూ.3.74 కోట్లు
* కొమురం భీం జిల్లాలో నేడు ముగ్గురు మంత్రుల పర్యటన. జూన్ 2న కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వంజరి వద్ద సీఎం సభ. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్ల పరిశీలనకు రానున్న మంత్రులు
జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గడ్డం వివేక్. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి.
* ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాలో మండుతున్న ఎండలు. రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రత. గడిచిన 24 గంటల్లో నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ లో 45.8డిగ్రీలు. మంచిర్యాలజిల్లా దండేపల్లి 45.7 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదు. ఆదిలాబాద్ జిల్లా రామ్ నగర్ లో 45.6డిగ్రీలుగా నమోదు. కొమురం బీం జిల్లా సిర్పూర్ టి లో 45.5గా నమోదు.
