NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* ఢిల్లీ: నేషనల్ లెర్నింగ్ వీక్ (ఎన్‌ఎల్‌డబ్ల్యు)ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఈ కార్యక్రమం..

* హైదరాబాద్‌: ఈ రోజు ఉదయం 9 గంటలకు నాగోల్ లో పర్యటించనున్న కేటీఆర్ బృందం.. కేటీఆర్ తో పాటు నాగోల్ లో ఎస్టీపీని సందర్శించనున్న సిటీ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల బృందం..

* తిరుమల: ఇవాళ ఆన్ లైన్ లో జనవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల.. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు లక్కి డిప్ రిజిస్ట్రేషన్.. ఎల్లుండి మధ్యహ్నం లక్కి డిప్ విధానంలో ఆర్జిత సేవా టిక్కెట్లు కేటాయింపు

* తిరుమల: 8 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 61,576 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,412 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 3.54 కోట్లు

* ప్రకాశం : టంగుటూరు మండలం టంగుటూరులో పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి.. అనంతరం పొదిలి మండలం కొండాయపాలెం, ముండ్లమూరు మండలం కెల్లంపల్లి, తాళ్లూరు మండలం రామభద్రపురం, మాధవరం గ్రామాల్లో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలు పరిశీలించి రైతులతో మాట్లాడనున్న మంత్రి స్వామి..

* విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతిలో పలు కార్యక్రమాలకు హాజరవుతారు..

* రాష్ట్ర పురపాలక.. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* నెల్లూరు: దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరులోని క్యాంప్ కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గ నేతలతో జరిగే సమావేశంలో పాల్గొంటారు

* గుంటూరు: నేడు పోలీసు కస్టడీ కి మాజీ ఎంపీ నందిగం సురేష్ .. తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన, మరియమ్మ అనే మహిళ హత్య కేసులో ,రిమాండ్ ఖైదీ గా ఉన్న నందిగం సురేష్ ను పోలీస్ కస్టడీకి ఇస్తూ మంగళగిరి కోర్టు ఆదేశాలు.. నేటి ఉదయం 11:30 గంటల నుండి సోమవారం మధ్యాహ్నం 12:30 గం ల వరకు నందిగం సురేష్ ను విచారించనున్న పోలీసులు..

* తూర్పుగోదావరి జిల్లా: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి భారతి ఈ సాయంత్రం జనసేనలో చేరిక.

* పశ్చిమ గోదావరి: ఉదయం 10 గంటలకు పోడూరు మండలం జిన్నురు గ్రామంలో పర్యటించనున్న మంత్రి నిమ్మల రామానాయుడు.. 10.30కి మట్టపర్రు గ్రామంలో పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలలో పాల్గొంటారు.. మధ్యాహ్నం 12 గంటలకు పాలకొల్లు పట్టణం హాస్పిటల్ అభివృద్ధి పనుల పరిశీలన.. 2 గంటలకు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి కార్యక్రమం.. సాయంత్రం కార్యాలయం లో అందుబాటులో ఉండనున్న మంత్రి..

* శ్రీ సత్యసాయి : నేడు ధర్మవరంలో పర్యటించనున్న మంత్రి సత్యకుమార్.

* అనంతపురం : నేడు ఉరవకొండలో పర్యటించనున్న మంత్రి పయ్యావుల కేశవ్.

* అనంతపురం : నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం.హాజరు కానున్న ఎంపీలు,ఎమ్మెల్యేలు.

* ఏలూరు జిల్లా: ఉంగుటూరు, ఏలూరులో బీజేపీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనున్న రాష్ట్ర బీజేపీ ఇంఛార్జ్‌ సిద్ధార్థనాద్ సింగ్..

* అనంతపురం : నేటి నుంచి ఆర్డీటి మైదానంలో ఆల్ ఇండియాజోనల్ స్థాయి రాజమాత జీజాబాయి సీనియర్ పుట్ బాల్ టోర్నీ.. పాల్గొననున్న 16 రాష్ట్రాల జట్లు.

* విశాఖ: నేటి నుంచి ప్రభుత్వ ఎడ్యుకేషన్ టూరిజం ప్రాజెక్ట్ ప్రారంభం.. పర్యటక కేంద్రాల నుంచే పాఠాలు నేర్చుకొనున్న విద్యార్థులు.. టూరిజం సెంటర్ల లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ

* సంగారెడ్డి: నేడు సదాశిపేట బంద్ కి పిలుపినిచ్చిన హిందూ సంఘాలు.. మూడు రోజుల క్రితం హనుమాన్ మందిర్ లో వినాయకుని విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను త్వరగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బంద్