Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
*అమరావతి: ఇవాళ సాయంత్రం సచివాలయానికి సీఎం చంద్రబాబు.. ఇవాళ సాయంత్రం 4.41 గంటలకు చాంబర్లో బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు.. నేడు సచివాలయం మొదటి బ్లాక్ చాంబర్లో సీఎంగా చంద్రబాబు బాధ్యతల స్వీకరణ.. మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయనున్న సీఎం చంద్రబాబు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేయనున్న చంద్రబాబు.. పెన్షన్లను రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం చేయనున్న చంద్రబాబు.. స్కిల్ సెన్సస్ ప్రక్రియ, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై సంతకాలు చేయనున్న చంద్రబాబు.. సచివాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించిన ప్రభుత్వం.
*విజయవాడ: నేడు దుర్గగుడికి సీఎం చంద్రబాబు.. తిరుమల నుంచి గన్నవరం విమానాశ్రయం వచ్చి నేరుగా దుర్గమ్మ దర్శనానికి రానున్న సీఎం చంద్రబాబు.. మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారి దర్శనం చేసుకుని ఉండవల్లి ఇంటికి వెళ్లనున్న చంద్రబాబు.
Also Read
- AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు..
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
- Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..
*ఏపీ వ్యాప్తంగా నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం.. నేటి నుంచే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, కిట్లు పంపిణీ.
*అమరావతి: నేటితో ముగియనున్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మధ్యంతర ముందస్తు బెయిల్ గడువు.. బెయిల్ పొడిగిస్తారా లేదా అనే అంశంపై నేడు ఏపీ హైకోర్టు విచారణ.. ఈవీఎం ధ్వంసంతో పాటు మరో మూడు కేసుల్లో పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ గతంలోనే ఇచ్చిన ఏపీ హైకోర్టు
*అమరావతి: ఏపీలో హింసాత్మక ఘటనలు నిరోధించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్.. పిటిషన్ వేసిన వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి.. దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, దాడికి గురైన వారికి రక్షణ కల్పించాలని పిటిషన్.. నేడు విచారణ చేయనున్న హైకోర్టు వెకేషన్ బెంచ్.
*నేడు ఖమ్మంకు నలుగురు మంత్రులు.. మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. నేడు సీతారామ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించనున్న మంత్రులు.. చాపర్లో ప్రాజెక్టు వద్దకు చేరుకుని కాలువల వెంట పర్యటించనున్న మంత్రులు.
*నేడు ఇటలీ వెళ్లనున్న ప్రధాని మోడీ.. ఇటలీ వేదికగా జరగనున్న జీ-7 సమ్మిట్.. ఇటలీలో రెచ్చిపోయిన ఖలిస్తానీ ఉగ్రవాదులు.. ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న గాంధీ విగ్రహం ధ్వంసం.. ఘటనపై విదేశాంగ శాఖ ఆగ్రహం, బాధ్యులపై చర్యలకు ఆదేశం.. పర్యటనలో భాగంగా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించాల్సి ఉన్న మోడీ.
*ఢిల్లీ: నేడు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ.. కిషన్ రెడ్డికి బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఇచ్చిన మోడీ సర్కార్.
*ఢిల్లీ: నేడు హోంశాఖ సహాయమంత్రిగా బండి సంజయ్ బాధ్యతల స్వీకరణ.. నేడు ఉదయం 10.30 గంటలకు నార్త్ బ్లాక్లోని కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ.
*టీ20 ప్రపంచకప్: నేడు బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్.. రాత్రి 8 గంటలకు ప్రారంభం.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
-
AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు..
-
OnePlus Ace 6 Ultra: వన్ప్లస్ ఏస్ 6 అల్ట్రా విడుదల.. 8600mAh బ్యాటరీ, Dimensity 9500తో గేమింగ్ మాన్స్టర్
-
Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!
-
Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో