* తెలంగాణ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రేపు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, అన్ని విద్యాసంస్థలకు సెలవు.. పోలింగ్ కేంద్రాలున్న విద్యాసంస్థలకు ఈ రోజు, రేపు సెలవు
* నేడు వైసీపీ సామాజిక సాధికార యాత్ర డే-24.. బస్సు యాత్ర జరిగే నియోజకవర్గాలు.. 1. మచిలీపట్నం – కృష్ణా జిల్లా, 2. కురుపాం – పార్వతీపురం మన్యం జిల్లా
* అమరావతి: నేడు సీవేజ్ సక్షన్ వాహనాల లాంచింగ్.. వాహనాలను లాంచ్ చేయనున్న సీఎం జగన్.. ఉదయం 10 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం దగ్గర కార్యక్రమం.. జెండా ఊపి సీవేజ్ సక్షన్ వాహనాలను ప్రారంభించనున్న సీఎం
* అమరావతి: పరిశ్రమల ఏర్పాటుపై జగన్ సర్కార్ ఫోకస్.. వరుసగా రెండో రోజు పలు పరిశ్రమల శంకుస్థాపన, ప్రారంభోత్సవం.. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా చేయనున్న సీఎం జగన్.. ఉదయం 11 గంటలకు కార్యక్రమం..
* శ్రీకాకుళం: నేడు పలాసలోని కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రిని ప్రజా సంఘాలతో కలిసి సందర్శించనున్న రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు.
* అంబేద్కర్ కోనసీమ జిల్లా : 212వ రోజుకు చేరిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. ఇవాళ ఉదయం 10 గంటలకు ముమ్మడివరం ఉమెన్స్ డిగ్రీ కాలేజీ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.. పాత ఇంజరం వద్ద పాదయాత్ర 2900 కిలోమీటర్లకు చేరిన సందర్భంగా శిలాఫలకం ఆవిష్కరణ.. సుంకరపాలెం విడిది కేంద్రంలో రాత్రి బస.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజానగరం నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబు పర్యటన.. 91 కోట్ల రూపాయలతో చేపట్టిన తొర్రిగడ్డ రివర్స్ పంపింగ్ స్కీం, 38 కోట్ల రూపాయలతో చేపట్టిన చిన్న నీటిపారుదల అభివృద్ధి పనులు ప్రారంభించనున్న మంత్రి అంబటి.. కోరుకొండ మండలం కాపవరం జగనన్న లే అవుట్ లో 1552 మంది లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేయనున్న మంత్రి
* ప్రకాశం : ఒంగోలు జీజీహెచ్ లో రేపు అభివృద్ధి కమిటీ సమావేశం, హాజరుకానున్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
* ప్రకాశం : యర్రగొండపాలెంలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం మినీ లోక్ అదాలత్ కార్యక్రమం..
* శ్రీ సత్యసాయి : నేడు హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం .
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరులోని ఉస్మాన్ సాహెబ్ పేట లో శ్రీ వేముల శ్రీరామశాస్త్రి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్న సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
* నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో నేడు ముస్లిం మైనార్టీ విభాగ నాయకుల సమావేశం
* నెల్లూరు: ఉదయగిరి మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న వై.సి.పి.నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి
* తిరుమల: 6 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 58,874 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 17,133 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.5 కోట్లు
* శ్రీకాకుళం: నేటి శాసనసభాపతి తమ్మినేని సీతారాం కార్యక్రమ వివరాలు.. ఉదయం 7.30 గంటలకు బూర్జ మండలం అన్నం పేట, తిమడాం గ్రామలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు.. మధ్యాహ్నం 3.30 గంటలకు సరుబుజ్జిలి మండలం చిన్న మతలపేట, పెద్దమతల పేట , గోనెపాడు గ్రామాలలో జల జీవన మిషన్ ద్వారా ఇంటింటికి మంచి నీటి కొళాయి శంఖు స్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు
* అనంతపురం : మంత్రి ఉషాశ్రీచరణ్ గారి కార్యక్రమాలు.. ఉదయం 09:00 AM గంటలకు కళ్యాణదుర్గం పట్టణంలోని 12వ వార్డులోని కొల్లాపురమ్మ దేవాలయం సమీపంలో నిర్వహించు WhyAPNeedsJagan అనే కార్యక్రమంలో పాల్గొంటారు. 10:00 గంటలకు కళ్యాణదుర్గం పట్టణంలోని టీ సర్కిల్ సమీపంలో స్వయం ఉపాధి మహిళా సంఘాలు ఉత్పత్తులు ప్రదర్శన ,అమ్మకం అర్బన్ మార్కెట్ ను మంత్రి ఉషాశ్రీచరణ్ ప్రారంభిస్తారు.
* తిరుమల: రేపు చంద్రబాబు తిరుమల పర్యటన.. రేపు సాయంత్రం తిరుమల చేరుకోనున్న చంద్రబాబు, శ్రీరచనా అతిథిగృహంలో బస.. ఎల్లుండి ఉదయం ముందుగా వరాహస్వామివారిని దర్శించుకోనున్న చంద్రబాబు దంపతులు.. ఆ తర్వాత శ్రీవారి దర్శనం