* ఐపీఎల్ 2024లో నేడు చెన్నై సూపర్ కింగ్స్తో రాజస్థాన్ రాయల్స్ ఢీ.. మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నై వేదికగా మ్యాచ్.. రాత్రి 7.30 గంటలకు బెంగళూరులో ఢిల్లీతో తలపడనున్న బెంగళూరు జట్టు..
* కడప : ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం.. ఉదయం 6:30 గంటలకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకున్న ఉద్యోగులు.. ఏ ఏ పోలింగ్ కేంద్రానికి ఎవరిని కేటాయించాలి అన్న ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి… జిల్లా వ్యాప్తంగా వివిఫ్యాట్స్ 5,158 సిద్ధం … రిజర్వులో 555 వివిఫ్యాట్స్ .. అసెంబ్లీ పరిధిలో 277, పార్లమెంటు పరిధిలో 278 వివిఫ్యాట్స్ సిద్ధం చేసిన అధికారులు.
* కడప : జిల్లా వ్యాప్తంగా మైక్రో అబ్జర్వర్లు 337.. క్రిటికల్ పోలింగ్ స్టేషన్ స్థానాలతో సహా పోలింగ్ స్టేషన్లలో 610 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను MO లుగా నియామకం..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో పార్టీ నేతలతో జరిగే సమావేశంలో పాల్గొంటారు
* నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించనున్న నెల్లూరు లోక్ సభ టిడిపి అభ్యర్థి విజయసాయిరెడ్డి
* నెల్లూరులో టిడిపి నేతలతో సమావేశం నిర్వహించనున్న నెల్లూరు లోక్ సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
* తూర్పుగోదావరి జిల్లా: స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కు వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం.. ఓటర్ల కు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు, బైండోవర్ కేసులకు సిఫార్సు.. పోలింగు కేంద్రాలలో, బయట సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు-జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత
* నెల్లూరు జిల్లా: రేపటి ఎన్నికల పోలింగ్ కు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం.. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సిబ్బందికి ఎన్నికల సామగ్రిని అందజేయనున్న అధికారులు.. సాయంత్రంలోగా పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్న సిబ్బంది
* అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రశాంత పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి.. అమలాపురం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో 1644 పోలింగ్ కేంద్రాలు. 1200 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు.. 563 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తింపు. జిల్లా వ్యాప్తంగా 144. సెక్షన్ అమలు
* పులివెందులలో 27 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో రెండు వివిఫ్యాట్స్ ఏర్పాటు.. కడప పార్లమెంటులో 14 మంది మాత్రమే పరిధిలో ఉన్న నేపథ్యంలో ఒక్క వివిఫ్యాట్ ఏర్పాట్లు…
* కడప : రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు ఉన్నాయన్న నేపథ్యంలో ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ లో ముందస్తు చర్యలు.. షామియానులతో పాటు వాటిపై ప్లాస్టిక్ కవర్లను కప్పిన అధికారులు.. ఈవీఎంలను ఒక ప్రత్యేక పాలిథిన్ కవర్లో ప్యాకింగ్ చేసిన అధికారులు..
* ఏలూరు జిల్లా లో మొత్తం 1744 పోలింగ్ స్టేషన్లలో 16. 37 లక్షల మంది ఓటర్లు.. 1744 పోలింగ్ స్టేషన్లకు గాను 1069 పోలింగ్ స్టేషన్ లలో పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్.. పోలింగ్ సామాగ్రి సిబ్బంది తరలింపు కోసం 150 ఆర్టీసీ బస్సులు, 350 ప్రైవేట్ వాహనాలను ఏర్పాటు. జిల్లాలో 416 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లు..పారా మిలట్రీ బృందాలతో భద్రతా చర్యలు..
* చిత్తూరు జిల్లా: రేపటి ఎన్నికల పోలింగ్ కు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం.. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సిబ్బందికి ఎన్నికల సామగ్రిని అందజేయనున్న అధికారులు.. సాయంత్రంలోగా పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్న సిబ్బంది
* అనంతపురం పార్లమెంట్ పరిధిలో 20,18,162 మంది ఓటర్లు. జిల్లాలో 2,236 పోలింగ్ కేంద్రాలు. ఎన్నికల్లో ప్రత్యేకంగా దివ్యాంగులకు , మహిళలకు 12 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగుల కోసం ర్యాంపులు ఏర్పాటు.
* అల్లూరి సీతారామరాజు జిల్లా: రంపచోడవరం నియోజకవర్గంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో వై. రామవరం మండలంలోని గుర్తెడు, పాతకోట గిరిజన గ్రామాలకు పోలింగ్ మెటిరియల్, సిబ్బంది తరలింఫుకు హెలికాప్టర్ ఏర్పాటు .. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలైన వై. రామవరం మండలంలోని గుర్తెడు, పాతకోట నుండి ఈవీఎం, వి.వి ప్యాడ్ లను రంపచోడవరం లోని కౌంటింగ్ కేంద్రానికి తరలించడానికి హెలికాప్టర్
* ఎన్టీఆర్ జిల్లాలో పోలింగ్ కు సర్వం సిద్దం.. మధ్యాహ్నం 3.30కల్లా సిబ్బంది పోలింగ్ స్టేషనుకి చేరుకునేలా ఏర్పాట్లు.. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల లో ఏర్పాట్లు పూర్తి..
* విశాఖ: ఆంధ్రా యూనివర్శిటీ లో ప్రారంభమైన పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ… 1991పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వహించనున్న 13069మంది సిబ్బంది.. విశాఖ జిల్లాలో మొత్తం ఓటర్లు 20,12,373.
* విశాఖ: సెంట్రల్ జైల్లో ఖైదీల కు ఓటుహక్కు.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు 13 మందికి అర్హత…
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లని నిండిపోయి వెలుపల క్యూ లైనులో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న76,945 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 33,844 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.2.67 కోట్లు