* ఐపీఎల్ 2024: నేడు బెంగళూరుతో లక్నో ఢీ.. రాత్రి 7.30 గంటలకు బెంగళూరు వేదికగా మ్యాచ్
* నేడు ఉత్తరాఖండ్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. రుద్రాపూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మోడీ
* అన్నమయ్య జిల్లా: నేడు ఆరో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ఉదయం 9 గంటలకు అన్నమయ్య జిల్లా చీకటిమానుపల్లె నుండి ప్రారంభం కానున్న బస్సు యాత్ర.. మొలకల చెరువు, పెద్దపాల్యం, వేపురికోట మీదుగా బుర్రకాయల కోట క్రాస్, గొల్లపల్లి మీదుగా అంగళ్లకు చేరుకొనున్న బస్సు యాత్ర, సాయంత్రం 3.30 గంటలకు మదనపల్లె టిప్పు సుల్తాన్ గ్రౌండ్ లో మేమంతా సిద్ధం బహిరంగ సభ.. సభ అనంతరం నిమ్మనపల్లి క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా పుంగనూరు నియోజకవర్గం అమ్మగారిపల్లె శివారులో రాత్రి బస.
* కాకినాడ: నేడు పిఠాపురంలో నాల్గో రోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన.. ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, బషీర్ బీబీ దర్గా దర్శనం.. నియోజకవర్గ మహిళలతో ప్రత్యేక సమావేశంలో పాల్గొనున్న జనసేనాని.. పిఠాపురంలో పార్టీ బలోపేతం కోసం పనిచేసిన నేతలకు సన్మానం చేయనున్న పవన్
* కరీంనగర్: నేడు బీజేపీ నేత బండి సంజయ్ రైతు దీక్ష.. ఎంపీ కార్యాలయం దగ్గర దీక్ష చేపట్టనున్న బండి.. పంటలకు రూ.500 బోనస్, రూ.2 లక్షల రుణమాఫీ, ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్
* ఈ రోజు ఉదయం 11 గంటలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్ధులతో సన్నాహక సమావేశం
* భద్రాద్రి: నేడు ఇల్లందులో మహబూబాబాద్ ఎంపీ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం.. పాల్గొననున్న మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
* ప్రకాశం : కంభంలో వైసీపీ కార్యకర్తల సమీక్షా సమావేశం నిర్వహించనున్న గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్ధి కుందూరు నాగార్జున రెడ్డి..
* తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. నేడు వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళపాదపద్మారాదన సేవలు రద్దు చేసిన టీటీడీ
* కాకినాడ: రేపు రామచంద్రపురం నియోజకవర్గంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పర్యటన.. ద్రాక్షారామలో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్న చంద్రబాబు
* కడప : నేడు జిల్లాలో పర్యటించనున్న వైఎస్ షర్మిల.. మధ్యాహ్నం 2 గంటలకు ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాటు వద్ద ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొననున్న షర్మిల.. అనంతరం అభ్యర్థుల ప్రకటన చేయనున్న షర్మిల
* తూర్పుగోదావరి జిల్లా: నేటి నుంచి 6 మండలాల్లో 87 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ద్వారా రబీ సీజన్ లో ధాన్యం కొనుగోళ్లు, జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్ లో 3 లక్షల 20 వేల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాలని లక్ష్యం
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.. ముత్తుకూరు మండలంలోని వివిధ గ్రామాల్లో జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు
* నెల్లూరు: ఆత్మకూరులో వైసిపి నేతలు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్న నెల్లూరు లోక్ సభ వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి.. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి
* నెల్లూరు: బోగోలు మండలం బిట్రగుంటలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి
* నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని మూలపేట అలంకార్ సెంటర్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న టీడీపీ అభ్యర్థి నారాయణ
* నెల్లూరు: నేటి నుంచి చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో శ్రీ ముత్యాలమ్మ జాతర
* అమరావతి: వివేకం సినిమాను యూ ట్యూబ్, OTTలలో నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్, నేడు విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు
* గుంటూరు: నేడు పొన్నూరు, చేబ్రోలు మండలాల్లో వంగవీటి రాధా పర్యటన.. గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న వంగవీటి రాధ.
* నిజామాబాద్ : శ్రీ రాం సాగర్ ప్రాజెక్టులో వేగంగా తగ్గుతున్న నీటి మట్టం.. నేటి నుంచి కాకతీయ ఆయకట్టు కు నీటి విడుదల నిలిపివేత