* ఐపీఎల్లో నేడు సన్రైజర్స్ హైదరాబాద్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ.. రాత్రి 7.30 గంటలకు ఉప్పల్ స్టేడియం వేదికగా మ్యాచ్
* నేటితో ముగియనున్న నామినేషన్ల ఘట్టం.. మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్ లకు గడువు.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ.. రేపు నామినేషన్ల పరిశీలన
* నేడు సిద్దిపేట జిల్లాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభ.. మధ్యాహ్నం 12 గంటలకి హెలికాప్టర్లో సిద్దిపేట చేరుకోనున్న అమిత్ షా.. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జరిగే విజయ సంకల్ప సభలో పాల్గొననున్న కేంద్ర హోంమంత్రి.. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకి మద్దతుగా అమిత్ షా ఎన్నికల ప్రచారం
* కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన షెడ్యూల్.. ఉదయం 9 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి 11 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ చేరుకోనున్న అమిత్ షా.. బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి 12 గంటలకు సిద్దిపేట చేరుకోనున్న కేంద్ర హోం మంత్రి.. సభ అనంతరం బేగంపేట వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో భువనేశ్వర్ వెళ్లనున్న అమిత్ షా
* కడప : నేడు పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఉదయం 11:25 నుంచి 11:40 మధ్య నామినేషన్ వేయనున్న సీఎం..
* కడప : నేడు రాజంపేట, రైల్వే కోడూరు బహిరంగ సభలలో పాల్గొననున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్…
* నేడు మెదక్ జిల్లాలో సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన.. మెదక్ BRS ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న హరీష్ రావు.. నామినేషన్ అనంతరం కలెక్టరేట్ నుంచి రాందాస్ చౌరస్తా వరకు ర్యాలీ, బహిరంగ సభ
* కరీంనగర్: నేడు బండి సంజయ్ నామినేషన్.. హాజరుకానున్న గుజరాత్ సీఎం భుపేంద్ర పటేల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. ఎస్సారార్ కాలేజీ నుండి భారీ ఎత్తున ర్యాలీకి సిద్ధమైన బీజేపీ శ్రేణులు.. టవర్ సర్కిల్ వద్ద ప్రసంగించనున్న సీఎం భూపేంద్ర పటేల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్
* హైదరాబాద్: హెచ్సీఏ వైఖరి నిరసిస్తూ నేడు ఉప్పల్ క్రికెట్ స్టేడియాన్ని ముట్టడికి యూత్ కాంగ్రెస్ పిలుపు.. నేడు ఉదయం 10 గంటలకు ఉప్పల్ స్టేడియం ను ముట్టడించనున్న యూత్ కాంగ్రెస్ ..
* ప్రకాశం : ఒంగోలులో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
* ప్రకాశం: మండ్లమూరులో దర్శి అసెంబ్లీ వైసీపీ అభ్యర్ధి బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం..
* ప్రకాశం: కనిగిరి అసెంబ్లీ వైసీపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేయనున్న దద్దాల నారాయణ యాదవ్..
* ప్రకాశం: చీమకుర్తిలో సంతనూతలపాడు అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేయనున్న బీఎన్ విజయ్ కుమార్..
* ప్రకాశం: మార్కాపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న కే నారాయణ రెడ్డి..
* బాపట్ల : చీరాల అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేయనున్న ఎంఎం కొండయ్య యాదవ్..
* ప్రకాశం : నాగులుప్పలపాడు మండలం చదలవాడలో శ్రీ రఘునాయక స్వామి కళ్యాణం.. కళ్యాణం అనంతరం తలంబ్రాల సమయంలో ఆకాశంలో ప్రదక్షిణలు చేయనున్న గరుడ పక్షులు.. చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి భారీగా తరలిరానున్న భక్తులు..
* నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి..
* నెల్లూరు: ఇందుకూరుపేట.. బుచ్చిరెడ్డి పాలెం మండలాల్లోలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి
* నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని మూడవ మైలు సాదావారిపాలెంలో ఇంటింట ప్రచారం నిర్వహించనున్న టిడిపి అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ
* నెల్లూరు నగరంలోని ఉస్మాన్ సాహెబ్ పేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న వైసిపి లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి
* నెల్లూరు: అల్లూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
* నెల్లూరు: తోటపల్లి గూడూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న సర్వేపల్లి టిడిపి అభ్యర్థి సోమిరెడ్డి
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వై.ఎస్.ఆర్ సి.పి అభ్యర్థి చెల్లుబోయిన వేణు కడియం మండలంలోని నర్సరీ రైతులతో ఆత్మీయ సమావేశం
* అనంతపురం : రాప్తాడు ఆర్వో కార్యాలయంలో నామినేషన్ వేయనున్న కూటమి ఉమ్మడి అభ్యర్థి పరిటాల సునీత.
* శ్రీ సత్యసాయి : హిందూపురం రూరల్ పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ఎమ్మెల్యే బాలకృష్ణ
* అనంతపురం : కళ్యాణదుర్గం నియోజకవర్గం తెదేపా అభ్యర్థి గా నామినేషన్ వేయనున్న అమిలినేని సురేంద్ర బాబు.. ప్రజావేదిక నుంచి ఆర్వో కార్యాలయం వరకు ర్యాలీ.
* శ్రీ సత్యసాయి : పెనుకొండలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలొ నామినేషన్ దాఖలు చేయనున్న మంత్రి ఉషశ్రీ చరణ్.
* తిరుపతి: రేపు జాతీయ సంస్కృతి వర్శిటి మూడో స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ …67 మందికి గోల్డ్ మెడల్స్, 580 మందికి డిగ్రీలు ప్రధానం చేయానున్న ఉప రాష్ట్రపతి
* తిరుమల: 7 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులుకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 64,080 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25773 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.2.66 కోట్లు
* తిరుమల: రేపు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆలయానికి టిటిడి తరపున పట్టువస్ర్తాలు సమర్పణ
* తిరుపతి: చంద్రగిరిలో ఒక్కసారిగా పెరిగిన పొలిటికల్ హీట్… ఒకేరోజు నామినేషన్ వేయానున్న వైసీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, టీడీపీ పులివర్తి నాని.. భారీ ర్యాలితో రెండు వర్గాలు నామినేషన్ కోసం ఏర్పాటు చేసుకోవడంతో అలెర్ట్ అయిన పోలీసులు … గత అనుభావాల దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఏ చిన్న గొడవలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేసినా పోలీసులు ..