* ఐపీఎల్ 2024: నేడు పంజాబ్తో రాజస్థాన్ ఢీ.. రాత్రి 7.30 గంటలకు చండీగఢ్ వేదికగా మ్యాచ్
* నేటి నుంచి మూడు రోజుల ఏవోబీ బంద్కు మావోయిస్టుల పిలుపు.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల నైట్ సర్వీసులు రద్దు చేసిన ఆర్టీసీ..
* 14వ రోజుకు చేరుకున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర.. నేడు ఉదయం 9 గంటలకు నంబూరు బైపాస్ నుంచి స్టార్ట్ కానున్న యాత్ర.. మంగళగిరి బైపాస్ మీదగా ఉ. 11 గంటలకు సీకే కన్వెన్షన్ వద్దకు చేరుకుని చేనేత కార్మికులతో జగన్ ముఖాముఖి.. అనంతరం కుంచనపల్లి బైపాస్ మీదగా తాడేపల్లి బైపాస్ కు చేరుకొని భోజన విరామం.. తర్వాత వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్ , పైపుల రోడ్, కండ్రిక, రామవరప్పాడు, నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్ శివారులో రాత్రి బస శిబిరానికి చేరుకోనున్న సీఎం జగన్
* నేడు గుంటూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలలో పాల్గొననున్న చంద్రబాబు.. మధ్యాహ్నం 3 గంటలకు తాడికొండ పోలీస్ స్టేషన్ సమీపంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రజాగలం సభలో పాల్గొననున్న చంద్రబాబు.. అనంతరం ప్రత్తిపాడులో ప్రజాగలం సభలో పాల్గొననున్న టీడీపీ అధినేత
* శ్రీ సత్యసాయి : నేటి నుంచి నందమూరి బాలకృష్ణ రాష్ట్ర పర్యటన.. స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో బస్సు యాత్ర నిర్వహించనున్న బాలయ్య. ఉమ్మడి అనంతపురం , కర్నూలు జిల్లాలోని నియోజకవర్గాలలో పర్యటనలు. ఉదయం 09 గంటలకు కదిరిలో శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న బాలయ్య.
* కడప నగరంలోని రెండవ డివిజన్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం అంజాద్ భాష..
* రైల్వే కోడూరులోని విజయ కన్వెన్షన్ హాల్ లో ఎన్డీయే (టీడీపీ బీజేపీ జనసేన) నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైన్.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63,163 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 31,287 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 2.99 కోట్లు
* ప్రకాశం : కొండేపి నియోజకవర్గం లోని అన్నీ మండలాల్లో వైసీపీ కార్యకర్తలతో ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కొండేపి ఎమ్మెల్యే అభ్యర్ధి, మంత్రి ఆదిమూలపు సురేష్..
* ప్రకాశం: చీమకుర్తి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి, సంతనూతలపాడు వైసీపీ అభ్యర్ధి మేరుగు నాగార్జున..
* ఒంగోలులో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
* నెల్లూరు : కందుకూరులో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి వై విజయసాయిరెడ్డి, కందుకూరు ఎంఎల్ఏ అభ్యర్ధి బుర్రా మధుసూదన్ యాదవ్..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.. వెంకటాచలం మండలంలో జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు
* నెల్లూరు రూరల్ మండలం మాదరాజ గూడూరులో టిడిపి అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటింట ప్రచారాన్ని నిర్వహిస్తారు
* నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని మైపాడు గేట్ సెంటర్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్న టిడిపి అభ్యర్థి నారాయణ
* విశాఖ: నేడు మత్స్యకారులతో వైసీపీ ఆత్మీయ సమావేశం.. పాల్గొననున్న వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి
* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రి పార్లమెంట్ ఓబీసీ మోర్చా జిల్లా , మండల నాయకుల విస్తృత స్థాయి సమావేశం.. ముఖ్య అతిధిగా హాజరుకానున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు , రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి
* శ్రీ సత్యసాయి : ఎమ్మెల్యే బాలకృష్ణ తరుపున హిందూపురంలో ప్రచారం నిర్వహించనున్న బాలయ్య సతీమణి వసుంధరాదేవి. సూగురు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు.. చిలమత్తూరు మండలంలో ఎన్నికల ప్రచారంలో ప్రారంభం.
* శ్రీసత్యసాయి : విద్యుత్తు లైన్లు మరమ్మతులు కారణంగా నేడు హిందూపురం సబ్ డివిజన్ పరిధిలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం
* చిత్తూరు: పులిచెర్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మంత్రి పెద్దిరెడ్డి.