*తెలంగాణలో నేడు, రేపు రెండు రోజుల పాటు ఐసెట్ పరీక్షలు
*నేడు టీఎస్ పాలిసెట్ ఫలితాలు
*ఇవాళ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన.. రేపు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొననున్న సీఎం జగన్
*ఆర్ 5 జోన్లో పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం.. లబ్దిదారులకు ఇళ్ళ పట్టాలు అందించనున్న సీఎం
*నేడు ఏలూరులో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సర్పంచుల సదస్సు.. సర్పంచుల సమస్యల పరిష్కారంపై చర్చ..
*నేటి నుంచి మూడు రోజులు రాజమండ్రిలో టీడీపీ అధినేత చంద్రబాబు
*సుప్రీంకోర్టులో పార్లమెంట్ ప్రారంభోత్సవంపై నేడు విచారణ.. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించేలా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వాలని పిల్
*రాహుల్ గాంధీ పాస్పోర్టు అంశంపై రౌస్ ఎవిన్యూ కోర్టులో ఇవాళ విచారణ
*నేడు రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ వర్సెస్ ముంబై క్వాలిఫయర్-2 మ్యాచ్.. ఈ నెల 28న ఫైనల్ మ్యాచ్