ఢిల్లీ: ఇవాళ సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం. హాజరుకానున్న కాంగ్రెస్ పాలిత మూడు రాష్ట్రాల సీఎంలు. కుల గణనపై చర్చ, తదుపరి కార్యాచరణ ఖరారు చేయనున్న CWC.
ఇవాళ ఉదయం 10 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్న టీకాంగ్రెస్ బీసీ నేతలు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ధన్యవాదాలు తెలపనున్న నేతలు.
నేడు అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన. ప్రధాని మోడీ సభకు 5లక్షల మంది వచ్చే అవకాశం. ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఐదు రూట్లు గుర్తించిన అధికారులు. 11 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు, 100 ఎకరాల్లో 2500 బస్సులు ఆపేల చర్యలు.
ఐపీఎల్: నేడు గుజరాత్ vs హైదరాబాద్.అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7.30కి మ్యాచ్.
కాకినాడ : నేటి నుంచి కాకినాడ సాగర తీరంలో రాష్ట్రస్థాయి బీచ్ కబడ్డీ పోటీలు. ఉమ్మడి 13 జిల్లాల నుంచి హాజరుకానున్న క్రీడాకారులు.. మూడు రోజులపాటు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఏడుగంటల వరకు ఫ్లడ్ లైట్ వెలుగులో బీచ్ కబడ్డీ..ప్రేక్షకుల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు.
అల్లూరి జిల్లా : నేడు మన్యం ప్రాంతం బంద్. ప్రత్యేక డీఎస్సీ సాధన కోసం ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర మన్య బంద్. మెగా డీఎస్సీ నుండి ఏజెన్సీ టీచర్ ప్రాంత పోస్టులు మినహాయింపు ఇవ్వాలనీ డిమాండ్. టూరిజం కేంద్రాలపై బంద్ ప్రభావం.. ర్యాలీలు, సభల పై ఆంక్షలు విధించిన పోలీసులు..
తూర్పుగోదావరి జిల్లా: నేడే ప్రైవేట్ స్కూల్లో ఉచిత విద్యకు రిజిస్ట్రేషన్ కు. ఆఖరు తేదీ ప్రైవేట్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ ఐదు సంవత్సరాలు నిండిన విద్యార్థులకు 25 శాతం సీట్లు ఉచితం తల్లితండ్రులందరూ ప్రైవేట్ స్కూల్ ఆన్లైన్ చేయడానికి ఈ సాయంత్రం ఐదు గంటల లోపు రిజిస్ట్రేషన్ కు గడువు.
అమరావతి : వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై నేడు తీర్పు ఇవ్వనున్న ఏపీ హైకోర్టు. గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ పిటిషన్. నేడు తీర్పు ఇవ్వనున్న న్యాయస్థానం.
విజయవాడ : లిక్కర్ కేసులో ఏ1 కేసీరెడ్డి రాజశేఖర్ రెడ్డిని నేడు కస్టడీ కి తీసుకోనున్న సిట్. ఇవాళ నుంచి 7 రోజులపాటు విచారించనున్న సిట్ అధికారులు.
ఖమ్మం:నేడు జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన… స్టేడియం లో సింథటిక్ కోర్టు కు శంకుస్థాపన చేయనున్న మంత్రి.