Rahul Gandhi: సుశీల్ మోడీ రాహుల్ గాంధీపై పెట్టిన పరువు నష్టం కేసు పరిస్థితేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్ గాంధీపై సుశీల్ మోడీ ‘మోడీ ఇంటిపేరు’ పరువు నష్టం కేసు వేసిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల సుశీల్ మోడీ మృతి చెందారు. ఇప్పుడు ఆ కేసు ఎటువైపు వెళ్తోందనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతోంది. కాగా, 2019 ఏప్రిల్ 13న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటి పేరు ఎలా వచ్చింది?’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. గుజరాత్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ దీనిపై సూరత్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీపై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. విచారణ జరిపిన సూరత్ కోర్టు ఈ ఏడాది మార్చి 23న రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఆ మరునాడు ఆయనపై అనర్హత వేటు వేశారు. తరువాత అత్యున్నత న్యాయస్థానం అనర్హత వేటును తొలగించింది.
READ MORE: Pushpa 2 : సినిమాలో అనసూయ పాత్ర మరింత వైల్డ్ గా ఉండబోతుందా..?
Also Read
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ఇదిలా ఉండగా.. బీహార్ బీజేపీ నాయకుడు, దివంగత నేత సుశీల్ కుమార్ మోడీ కూడా గతేడాది రాహుల్ గాంధీపై ‘మోడీ ఇంటిపేరు’ కేసు పెట్టారు. ఆయనపై ఈ పరువునష్టం కేసు నమోదైంది. ఏప్రిల్ 2023లో, రాహుల్ గాంధీపై ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించి పాట్నా హైకోర్టు ఇక్కడ ట్రయల్ కోర్టు ముందు విచారణను నిలిపివేసింది. సుశీల్ మోడీ కేసులో పాట్నా హైకోర్టు ఈ ఏడాది మే 15 వరకు స్టే విధించింది. సుశీల్ మోడీ మృతితో రాహుల్ పై ఆయన కేసు ఏమవుతుందనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. సుశీల్ మోడీ వారసులు కేసును కొనసాగించాలంటే చట్టపరంగా అవకాశం ఉంటుందని పలువురు న్యాయవాదులు వివరణ ఇచ్చారు. భారతదేశంలో ఫిర్యాదుదారు చనిపోతే పరువు నష్టం కేసు సాధారణంగా ముగియదు. ఫిర్యాదుదారు ప్రతినిధి, కుటుంబ సభ్యుల స్థానంలో చట్టపరమైన చర్యలు కొనసాగవచ్చు. ఫిర్యాదుదారుకు ప్రాతినిధ్యం వహించడానికి ఎవరూ లేకుంటే.. కోర్టు కేసును కొట్టివేయవచ్చు.
- Tags
- against
- bihar
- defamation case
- Delhi
- ptna
తాజావార్తలు
-
7 Seater Cars: మారుతి ఎర్టిగా నుంచి మహీంద్రా బొలెరో వరకు.. రూ.5.65 లక్షల నుంచి లభించే చౌకైన 7-సీటర్ కార్లు ఇవే
-
Samantha Ruth Prabhu : ‘మా ఇంటి బంగారం’ హీరోయిన్ సాయి పల్లవా ? ఆ ఛాన్స్ సామ్ ఎలా కొట్టేసిందంటే ?
-
Vivo V70 Lite: వివో V70 లైట్ విడుదల.. 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 6.77 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే
-
Astrology: డబ్బు విషయంలో ఈ 3 రాశులవారు చాలా జాగ్రత్త.. ఖర్చు పెట్టే ముందు పదిసార్లు ఆలోచిస్తారట!
-
Veerappan Interview Controversy : వీరప్పన్ కేసులో హీరోయిన్ కు బిగ్ రిలీఫ్… ఆ ఛానల్ భారీ పరిహారం చెల్లించాల్సిందే.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!