ODI Worldcup 2023: ప్రపంచకప్కు అర్హత సాధించలేకపోవడం సిగ్గుచేటు: సెహ్వాగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virender Sehwag Slams West Indies Cricket Teama after fail to qualify ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023 క్వాలిఫైయింగ్ రౌండ్లో వరుసగా 4 విజయాలు అందుకున్న శ్రీలంక మెగా టోర్నీకి అర్హత సాధించింది. దాంతో 10 జట్లు పాల్గొనే వన్డే ప్రపంచకప్ టోర్నీలో 9 జట్లు తేలిపోయాయి. మిగిలిన ఒక స్థానం కోసం జింబాబ్వే, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ జట్ల మధ్య పోటీ నెలకొంది. అయితే కచ్చితంగా మెగా టోర్నీకి అర్హత సాధిస్తుందనుకున్న వెస్టిండీస్.. చెత్త ఆటతో మూల్యం చెలించుకుంది. ఒకప్పటి మేటి జట్టు అయిన విండీస్.. చిన్న జట్ల చేతిలో ఓడిపోయి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. మాజీలు అందరూ విండీస్ ఓటమికి కారణాలు చెబుతున్నారు.
విండీస్ ఓటమిపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. ప్రాంతీయ రాజకీయాలే వెస్టిండీస్ క్రికెట్ను దెబ్బ తీశాయని అభిప్రాయపడ్డాడు. ‘వెస్టిండీస్ వన్డే ప్రపంచకప్ 2023కు అర్హత సాధించలేకపోవడం సిగ్గుచేటు. నైపుణ్యం ఉంటే సరిపోదు. రాజకీయాలకు అతీతంగా ఒక జట్టును నడిపించాలనడానికి వెస్టిండీస్ మంచి ఉదాహరణ. రాజకీయాలే వెస్టిండీస్ క్రికెట్ను దెబ్బ తీశాయి. ఇంతకుమించి పడిపోవడానికి ఆ జట్టుకు ఇంకేమి మిగల్లేదు’ అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
Also Read
- Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
- Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
Also Read: Flight Ticket Offers: రూ.1499కే విమాన టిక్కెట్.. బంపర్ ఆఫర్ ఇంకా ఒక్క రోజు మాత్రమే!
వెస్టిండీస్ పతనం ఇప్పటిది కాదని, ప్రస్తుత జట్టులోని ఆటగాళ్లు క్రికెట్లోకి రాకముందు నుంచే మొదలైందని వెస్టిండీస్ మాజీ పేసర్ ఇయాన్ బిషప్ పేర్కొన్నాడు. ‘నెమ్మదిగా జరిగిన పతనం ఇది. ప్రస్తుత జట్టు క్రికెట్ మొదలుపెట్టకముందే విండీస్ పతనం మొదలైంది. దాదాపు పదేళ్లుగా వన్డేల్లో అగ్ర జట్లపై సరైన ప్రదర్శన చేయట్లేదు. టీ20ల్లో మాత్రమే 2 సార్లు ఛాంపియన్స్ అయ్యాం. ఆ తర్వాత మెరుపులు, విజయాలు పెద్దగా లేవు. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలినట్లుగా విండీస్ ఇప్పుడు లేదు. మిగిలిన జట్లు రోజు రోజుకు బలపడితే విండీస్ బలహీనంగా మారింది’ అని ఇయాన్ బిషప్ నిరాశ వ్యక్తం చేశాడు.
‘టెస్ట్ ఫార్మాట్ ఆడే నైపుణ్యం విండీస్ ఆటగాళ్లలో తగ్గిపోయింది. బోర్డు ఆర్థిక సంక్షోభం కూడా ఇందుకు ఓ కారణం. అయితే ఆర్థిక పరిస్థితులే క్రికెట్ పతనానికి కారణమని నేను అనుకోవట్లేదు. ఇంతకంటే దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న జింబాబ్వే జట్టు వేగంగా కోలుకుంది. ప్రస్తుతం ప్రపంచకప్ 2023 క్వాలిఫయర్ టోర్నీలో బాగా ఆడుతోంది. ప్రస్తుత విండీస్కు మంచి ప్రదర్శన చేసే సత్తా ఉందని నేను నమ్ముతున్నా. కెప్టెన్, కోచ్లు మారారు. వారికి కాస్త సమయం ఇవ్వాలి. తక్కువ వనరులతోనే జింబాబ్వే బాగా ఆడుతుంటే.. విండీస్ ఎందుకు మెరుగుకాకూడదు’ అని ఇయాన్ బిషప్ ధీమా వ్యక్తం చేశాడు.
Also Read: BAN vs IND: బంగ్లాదేశ్ టూర్కు భారత జట్టు ఇదే.. ఇద్దరు స్టార్ ప్లేయర్లపై వేటు!
తాజావార్తలు
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
-
Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్కు అరుదైన ఘనత!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!