West Bengal : రైలులో ఎమ్మెల్యే ప్రయాణం.. పక్కన ఉంది భార్య కాదా? షాక్ లో టీటీఈ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal : పశ్చిమ బెంగాల్లో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక టీఎంసీ ఎమ్మెల్యే తన భార్యతో కలిసి రైలులో ప్రయాణిస్తున్నారు. అప్పుడే అక్కడికి రైలులోని టీటీఈ వచ్చారు. టీటీఈ ఎమ్మెల్యే, అతనితో పాటు ప్రయాణిస్తున్న మహిళ టిక్కెట్లు అడిగాడు. ఎమ్మెల్యే టికెట్ కరెక్ట్ అని తేలింది కానీ మహిళ టికెట్ పై టీటీఈకి అనుమానం వచ్చింది. ఆ తర్వాత టీటీఈ మహిళ గుర్తింపు కార్డును అడిగాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకుని టీటీఈ షాక్ అయ్యారు.
తన గుర్తింపును నిర్ధారించేందుకు టీటీఈ ఎమ్మెల్యేను ఐడీ అడగడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే, ఆయన మద్దతుదారులు టీటీఈని చంపుతామని బెదిరించారని ఆరోపించారు. ఈ కేసులో ఎమ్మెల్యేకు టీటీఈ జరిమానా విధించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్కు విలువైన పాఠం..!
- Pakistan: పీవోకేలో కూలిన పాక్ హెలికాప్టర్.. 21 మంది సైనికులు మృతి
- TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
- Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
Read Also:Rahul Gandhi: నేటి నుంచి రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం.. శివసేన, ఎన్సీపీలతో జోడి..!
నబగ్రామ్ కనై చంద్ర మండల్కు చెందిన టీఎంసీ ఎమ్మెల్యే ఒక మహిళతో కలిసి డౌన్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నారు. విచారణకు వచ్చిన టీటీఈ మహిళను గుర్తించగా.. ఎమ్మెల్యే భార్య టికెట్పై రాసివున్న వయసుకు, ఎదురుగా కూర్చున్న మహిళ వయసుకు మధ్య చాలా తేడా కనిపించింది. ఎదురుగా కూర్చున్న మహిళ ఎమ్మెల్యే భార్య అని నిర్ధారించుకోవడానికి టీటీఈ ఆమెకు గుర్తింపు కార్డును అడిగాడు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే టీటీఈని, ఇతర ఉద్యోగులను చంపేస్తామని ఆయన మద్దతుదారులు బెదిరించినట్లు సమాచారం.
విచారణలో ఎమ్మెల్యేతో కలిసి ప్రయాణిస్తున్న మహిళ అతని భార్య కాదని, ఆయన పేరుతో ఎమ్మెల్యే వెంట ప్రయాణిస్తున్నది వేరే మహిళ అని తేలింది. దీంతో ఎమ్మెల్యేకు టీటీఈ జరిమానా విధించారు. టిఎంసి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్, గవర్నర్కు రైల్వేశాఖ లేఖ రాసింది. రైల్వే ఉద్యోగులను టీఎంసీ ఎమ్మెల్యే నిత్యం చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని తూర్పు రైల్వే ఇంకా ధృవీకరించలేదు. ఈ ఘటనపై మాల్దా తూర్పు రైల్వే సీనియర్ డీసీఎంకు బాధిత టీటీఈ అచింత్య సాహా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Read Also:Drones : డ్రోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా..ఈ రూల్స్ తెల్సుకోకపోతే జైలుకు వెళ్లాల్సిందే
తాజావార్తలు
-
Sai Pallavi: సాయి పల్లవికి ‘రామాయణ’ శాపంగా మారిందా?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్కు విలువైన పాఠం..!
-
Pakistan: పీవోకేలో కూలిన పాక్ హెలికాప్టర్.. 21 మంది సైనికులు మృతి
-
TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!